S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/31/2016 - 05:28

హైదరాబాద్, మే 30: మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం ఎమ్సెట్-2 నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులను జూన్ 1నుండి స్వీకరించనుంది. దాదాపు 60వేల మంది పరీక్షకు దరఖాస్తు చేస్తారని అంచనా. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువమందికి హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల్లోనూ పరీక్ష కేంద్రాలకు సన్నాహాలు చేస్తున్నారు.

05/31/2016 - 05:24

హైదరాబాద్, మే 30: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణీ పథకానికి ‘్ధరాఘాతం’ తగిలింది. ఒక్కో దళిత కుటుంబానికి ఈ పథకం కింద మూడెకరాల భూమి ఇస్తామంటూ 2014 ఆగస్టు 15న సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఏటా 10 వేల మంది దళితులకు భూమి పంపిణీ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే తదుపరి పరిణామాల్లో ఈ పథకం నెమ్మదించింది.

05/31/2016 - 05:20

హైదరాబాద్, మే 30: తెలంగాణలో రెండు, ఆంధ్రలో నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు రెండు రాష్ట్రాల్లోనూ మంగళవారం చివరి రోజు. తెలంగాణలో పోటీలేకుండా ఇప్పటికే ఎన్నికలు ఏకగ్రీవమని తేలిపోయింది. తెలంగాణలోని రెండు స్థానాలనూ తెరాస అభ్యర్థులు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కైవసం చేసుకోనున్నారు.

05/30/2016 - 18:13

హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారులు, పెట్రో ట్యాంకర్ల యజమానుల చర్చలు సోమవారం మధ్యాహ్నం సఫలమయ్యాయి. సమ్మెకు సంబంధించి ఆయిల్‌ ట్యాంకర్ల అధికారులు, పెట్రో ట్యాంకర్ల యజమానులతో చర్చలు జరిగాయి. సమావేశం అనంతరం సమ్మెను విరమించుకుంటున్నట్లు పెట్రో ట్యాంకర్ల యజమానులు చెప్పారు. అయితే ఆది తాత్కాలికం మాత్రమేనని, రేపు ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరిపి ప్రకటిస్తామని తెలిపారు.

05/30/2016 - 17:15

హైదరాబాద్: రాజ్యసభకు తెలంగాణ నుంచి జరిగే ఎన్నికలకు తెరాస అభ్యర్థులుగా ఎంపికైన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు మంగళవారం నామినేషన్లు వేస్తారు. మంచి అభ్యర్థులను సిఎం కెసిఆర్ ఎంపిక చేశారని మంత్రి నాయిని అన్నారు. తమ అభ్యర్థులిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛన ప్రాయమని మరో మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

05/30/2016 - 17:15

హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలో అద్భుతరీతిలో నిర్వహించాలని మంత్రి నాయిని నరసింహారెడ్డి తెరాస కార్యకర్తలను ఆదేశించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం నాడు ముఖ్యనేతలతో ఆయన సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. నగరాన్ని విద్యుత్ కాంతులతో నింపాలని, స్వాగత ద్వారాలు, పార్టీ జెండాలతో అంతా గులాబీమయం కావాలని ఆయన అన్నారు.

05/30/2016 - 17:14

నల్గొండ: డబ్బు కోసం వ్యభిచారం చేయాలంటూ సొంత తల్లి, భర్త వేధించడంతో బిటెక్ చదువుతున్న ఝాన్సీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నకిరేకల్ మండలం నోములలో ఈ ఘోరం జరిగింది. నాలుగు లక్షల రూపాయల బాకీ తీర్చలేనందుకు విజేందర్ రెడ్డి అనే వ్యక్తితో ఝాన్సీకి ఆమె తల్లి పెళ్లి చేసింది. వ్యభిచారం చేయమని తల్లి, భర్త వేధించడంతో తనకు విజేందర్ రెడ్డి నుంచి విడాకులు కావాలని ఝూన్సీ అడిగింది.

05/30/2016 - 17:13

హైదరాబాద్: కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ నుంచి బయటకు వస్తారని తెరాస తప్పుడు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విమర్శించారు. తాము కాంగ్రెస్‌ను వీడే పరిస్థితి రాదని ఆయన సోమవారం స్పష్టం చేశారు.

05/30/2016 - 15:00

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన మిషన్ కాకతీయ మూడో దశ పనులకు ఈ ఏడాదిలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలని, అన్ని వివరాలూ ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ఉండాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం ఇక్కడ నీటి పథకాలు, మిషన్ కాకతీయ, భూ సేకరణ అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. మూడుసార్లు పిలిచినా కాంట్రాక్టర్లు రాకుంటే సంబంధిత పనులకు వేరే మార్గాలు అనే్వషించాలన్నారు.

05/30/2016 - 14:59

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్లను చోరీ చేసి వాటి ఐఎంఇఐ నెంబర్లను క్లోనింగ్ చేసి ఇతరులకు విక్రయిస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 45 సెల్‌ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, క్లోనింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

Pages