S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/01/2016 - 12:23

హైదరాబాద్: తెలంగాణలో టిడిపికి చెందిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి (మల్కాజిగిరి) బుధవారం ఉదయం తెరాసలో చేరారు. ఆయన తెరాస అధినేత, సిఎం కెసిఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. మల్లారెడ్డిని తెరాసలోకి ఆహ్వానిస్తున్నట్లు కెసిఆర్ అన్నారు. బంగారు తెలంగాణ తెరాస వల్ల సాధ్యమవుతుందని భావించి టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు.

06/01/2016 - 07:19

దామరచర్ల, మే 31: రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు ఆమోదం తెలిపారు. మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని మండలంలోని వీర్లపాలెం గ్రామ శివారులో పైలాన్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.

06/01/2016 - 07:16

కరీంనగర్, మే 31: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో మంగళవారం నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర ఘనంగా జరిగింది. హిందు సమాజాన్ని జాగృతం చేయడంతోపాటు ఏకతాటిపైకి తెచ్చేందుకు చేపట్టిన ఈ యాత్రలో హిందువులు దండులా కదిలిరాగా, అందరి ప్రశంసలు చూరగొంది. వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సైతం కరీంనగర్ నగరానికి తరలివచ్చి శోభయాత్రలో పాల్గొనడం విశేషం.

06/01/2016 - 07:14

తొగుట, మే 31: మల్లన్నసాగర్ భూనిర్వాసిత గ్రామమైన మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో గ్రామస్థులంతా పంచాయతీ కార్యాలయం ముందు మంగళవారం బైఠాయించి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. 2013 చట్టాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్త్తూ రిలే దీక్ష చేపట్టారు. సోమవారం రాత్రి గ్రామ చావిడి వద్ద ఆట, పాటలతో నిరసనలు తెలిపి వంటావార్పు నిర్వహించారు.

06/01/2016 - 07:12

రామన్నపేట, మే 31: నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ పి.శీనయ్య తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన దొంత అంజయ్య (61) చేనేత వృత్తిని జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

06/01/2016 - 07:09

చౌటుప్పల్, మే 31: సబ్సిడీ విత్తనాల కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సింగిల్‌విండో కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట సబ్సిడీ విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. సబ్సిడీ విత్తనాలు వచ్చిన గంటలోనే ఖాళీ అవుతున్నాయి.

06/01/2016 - 07:04

హైదరాబాద్, మే 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్‌శర్మ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే మావోల ప్రాబల్యం పెరుగుతోందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగొచ్చని అపోహలను దరిచేరనీయకుండా పోలీస్ యంత్రాంగం మావోల ప్రాబల్యం గల ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసి వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలిగిందన్నారు.

06/01/2016 - 07:02

జగదేవ్‌పూర్,మే 31: మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో గల సిఎం కెసిఆర్ ఫాంహౌస్‌ను డిజిపి అకుల్‌సబర్వాల్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి మంగళవారం సందర్శించారు.పలు మార్లు సిఎం కె.చంద్రశేఖర్‌రావు తన వ్యవసాయ క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ చేపట్టవల్సిన రక్షణ చర్యల గురించి పర్యవేక్షించారు.

06/01/2016 - 07:01

హైదరాబాద్, మే 31:మిషన్ కాకతీయపై అధ్యయనం చేసేందుకు షికాగో యూనివర్సిటీ ముందుకు వచ్చింది. మిషన్ కాకతీయ పథకం అమలు తీరు, దాని ప్రభావాన్ని యూనివర్శిటీ అధ్యయనం చేస్తుంది. షికాగో యూనివర్శిటీతో ఎంఓయు ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కాడా) కమీషనర్ డాక్టర్ జి మల్సూర్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మిషన్ కాకతీయపై రెండేళ్ల పాటు యూనివర్సిటీ ఆఫ్ షికాగో అధ్యయనం చేయనుంది.

06/01/2016 - 07:00

హైదరాబాద్, మే 31: నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీని వీడితే పార్టీకిగానీ, జిల్లాకు గానీ నష్టమేమీ లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. కోమటిరెడ్డి పార్టీలో ఉంటేనే నష్టమని అన్నారు.

Pages