-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
ఖమ్మం: కొత్తగూడెంలో యువకుల మధ్య ఘర్షణ ఫలితంగా సుశాంత్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఘర్షణ అనంతరం సుశాంత్ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో గాలించారు. గోధుమవాగులో సుశాంత్ మృతదేహాన్ని మంగళవారం కనుగొన్నారు. యువకుల మధ్య కొట్లాట వల్లే ఈ దారుణం జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: గండిపేటలోని ఓ రిసార్ట్సులో సోమవారం అర్ధరాత్రి పార్టీలో రివాల్వర్ కాల్పుల ఘటనపై పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళా సర్పంచ్ భర్త ప్రశాంత్ యాదవ్ ఇచ్చిన పార్టీలో అతని స్నేహితుడు ప్రభాకర్ తాగిన మత్తులో రివాల్వర్ పేల్చాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భూ వివాదాల సెటిల్మెంట్ల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్: తెలంగాణలో తీవ్ర కరవు పరిస్థితుల వల్ల రైతులంతా బాధల్లో ఉండగా రాష్ట్ర అవతరణ దినోత్సవం పేరిట సంబరాలు జరపడం తగదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సంబరాల పేరిట ప్రభుత్వం విచ్చలవిడిగా నిధులను ఖర్చు చేస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సిఎం కెసిఆర్ విఫలం చెందారన్నారు. ప్రజాసంక్షేమ పాలన కేవలం కాంగ్రెస్కే సాధ్యమన్నారు.
హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో ఎపికి రైల్వేజోన్ ప్రకటిస్తారన్న నమ్మకం తనకుందని మాజీ ఎంపీ, బిజెపి నేత కావూరి సాంబశివరావు అన్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఎపి నుంచి రాజ్యసభకు పంపడం శుభసూచకమన్నారు. ఎప్పటికైనా ఎపికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు.
వరంగల్: రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు దళితులను వంచిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ మంగళవారం ఇక్కడ ఆరోపించారు. ఎమ్మార్పీఎస్పై ఎపిలో పోలీసులు నిఘా పెట్టడంలో చంద్రబాబు ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దళితుడిని సిఎం చేస్తానన్న కెసిఆర్ ఆ వర్గాలకు అన్యాయం చేస్తున్నారన్నారు.
హైదరాబాద్: నగర శివారులోని గండిపేట వద్ద గోల్కొండ రిసార్ట్సులో సోమవారం అర్ధరాత్రి రివాల్వర్ కాల్పులు కలకలం సృష్టించాయి. గండిపేట సర్పంచ్ భర్త ప్రశాంత్ యాదవ్ తన స్నేహితులకు రిసార్ట్సులో పార్టీ ఇచ్చాడు. అక్కడికి హాజరైన ప్రభాకర్ అనే వ్యక్తి పార్టీలో ఆకస్మికంగా తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థులు డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు మంగళవారం ఉదయం టి.అసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్: ఒకే ప్రాంతానికి చెందిన నలుగురు బాలికలు అదృశ్యమైన సంఘటన నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం నుంచి వీరు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలికల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
హైదరాబాద్: సినీ నటుడు, మాజీ ఎంపి మోహన్బాబును కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మంగళవారం కలిశారు. శంషాబాద్ మండలం జల్పల్లిలోని మోహన్బాబు ఫాంహౌస్కు ఆయన వెళ్లి, కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముద్రగడ గత కొన్నిరోజులుగా నగరంలోనే బస చేసి వివిధ పార్టీల నాయకులను, సినీ నటులను కలుసుకుంటున్నారు.
ఖమ్మం: భద్రాచలంలో హనుమాన్ జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మంగళవారం ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం విస్తృత సన్నాహాలు చేసింది.