-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
ఖమ్మం: భద్రాచలంలోని వెంకటేశ్వర కాలనీలో దుర్గ అనే ఉద్యోగిని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. అటవీశాఖలో పనిచేస్తున్న ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయమై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవికి మాజీ మంత్రి డి.శ్రీనివాస్ శనివారం రాజీనామా చేశారు. రాజ్యసభ సీటుకు తెరాస అధిష్ఠానం తనను ఎంపిక చేయడంతో ఆయన సలహాదారు పదవిని వదులుకున్నారు. తన రాజీనామా లేఖను సిఎం కెసిఆర్కు పంపారు. ఎంపీగా తెలంగాణ ప్రజల కోసం దిల్లీలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు కెసిఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించుకుంటేనే దివంగత నేత ఎన్టీఆర్కు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని టిడిపి నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం ఇక్కడి ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో ఆయన నివాళులర్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతి కార్యకర్తా దీక్ష వహించాలన్నారు.
హైదరాబాద్, మే 27: సికింద్రాబాద్ కంటోనె్మంట్లో ఒక దారిని మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ శాఖ తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. కంటోనె్మంట్లో దారి మూయడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఇదివరకే రక్షణశాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, మే 27: హైదరాబాద్లో నైజీరియన్ విద్యార్థిపై జరిగిన దాడి అంశంపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శుక్రవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు ఫోన్ చేసి ఆరా తీసింది. నైజీరియన్పై జరిగిన దాడి జాత్యాంకహార చర్య కాదని, బైక్ను పార్క్ చేసే విషయంలో జరిగిన గొడవే కారణమని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు ముఖ్యమంత్రి వివరించినట్టు సమాచారం.
హైదరాబాద్, మే 27: ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి శుక్రవారం ఉత్తర్వులు అందాయి. కేంద్ర మంత్రిత్వశాఖ డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డివోపిటి) నుంచి ఈ ఉత్తర్వులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందాయి.
హైదరాబాద్, మే 27: తిరుపతిలో జరుగుతున్న మహానాడులో తెలంగాణ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మహానాడు మూడు రోజుల అజెండాలో 28, 29 తేదీల్లో ఆరు అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, నిశితంగా విమర్శించేందుకు టిడిపి నేతలు సిద్ధమవుతున్నారు.
నిజామాబాద్, మే 27:కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా, ఇవ్వడం లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారామ్ అహిర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని రకాలుగా సాయం అందజేస్తోందని, అయినా నిధులు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు.
హైదరాబాద్, మే 27: సచివాలయాన్ని మార్చాలన్న నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సచివాలయాన్ని మార్చే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, మే 27: అత్యధిక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరని దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు నంబర్ వన్ స్థానం దక్కింది. ఓటర్ల మనోగతాలపై సర్వేలు నిర్వహించే విడిపి అసోసియేట్స్ అనే సంస్థ దేశంలో మోస్ట్ పాపులర్ సిఎం ఎవరన్నదానిపై ఇటీవల సర్వే నిర్వహించింది. గతంలో ఇదే సంస్థ సాధారణ సర్వే నిర్వహించి ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ముందుగా చెప్పింది.