S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/21/2016 - 17:24

శ్రీనగర్: సిఆర్‌పిఎఫ్, జమ్ముకాశ్మీర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాదులకు సంబంధించిన భారీ డంప్‌ను సైన్యం బుధవారం స్వాధీనం చేసుకుంది. ఈ డంప్‌లో ఏకే56 రైఫిల్, స్నిఫర్ రైఫిల్, మిషన్ గన్, ఇతర పేలుడు పదార్ధాలు, పెద్ద ఎత్తున బుల్లెట్లు లభించాయి. త్రాల్‌లోని కమ్లా అటవీ ప్రాంతంలో డంప్‌ బయటపడింది.

09/21/2016 - 17:22

దిల్లీ: దిల్లీ లోని ప్రముఖ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆస్పత్రి నుంచి రోగులను ఖాళీ చేయిస్తున్నారు.

09/21/2016 - 17:20

దిల్లీ: కృష్ణా జలాల పంపకంపై ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం బుధవారం ముగిసింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు.రెండు రాష్ట్రాలు ప్రజెంటేషన్‌ ఇచ్చాయి.

09/21/2016 - 17:18

దిల్లీ: కృష్ణా జలాల లభ్యత ఆధారంగా అంచనా వేసి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు దామాషా ప్రకారం నీటి పంపిణీని చేస్తామని, దీనిని ఇరు రాష్ట్రాలు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. కేంద్రం జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. కృష్ణా జలాల అంశంపై బుధవారం దిల్లీలో నిర్వహించిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో మూడు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు.

09/21/2016 - 16:18

దిల్లీ: లైంగిక వేధింపుల కేసులలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను దిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఖాన్‌ బంధువుగా చెప్తున్న 32 ఏళ్ల మహిళ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఖాన్‌ తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతపెడుతున్నాడని 32 ఏళ్ల మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

09/21/2016 - 16:14

దిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశంపై చర్చిచేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ బుధవారం దిల్లీలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో వాదనలు వినిపించేందుకు రెండు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి.

09/21/2016 - 14:42

ఢిల్లీ : రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ రూపకల్పన, సమర్పణలకు సంబంధించిన మొత్తం విధానాన్ని సంస్కరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరుగా ప్రవేశపెడుతున్నారు.

09/21/2016 - 14:39

ఢిల్లీ : న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ ముట్టడికి బుధవారం యత్నించారు. పోలీసులు అడ్డుకుని నిరసనకారులను అరెస్టు చేశారు. యూరీ దాడి వెనుక పాక్‌ హస్తం ఉందంటూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జమ్మూలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. అహ్మదాబాద్‌లో ముస్లిం వర్గాలు పాక్‌ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాయి.

09/21/2016 - 14:35

న్యూఢిల్లీ: వచ్చే కేంద్ర కేబినెట్‌ భేటీలో ఏపీ ప్యాకేజీకి ఆమోదముద్రతో పాటు చట్టబద్ధత కల్పిస్తామని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. అపెక్స్‌ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాతో పదేళ్లలో వచ్చే సాయం ఏపీకి రెండేళ్లలోనే వచ్చేలా చర్యలు తీసుకుంటామని జైట్లీ హామీ ఇచ్చినట్లు సమాచారం.

09/21/2016 - 14:27

శ్రీనగర్‌ : కా శ్మీర్‌లోని యూరీ, నౌగామ్‌లో బుధవారం ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. యూరీ వద్ద సరిహద్దు దాటి వచ్చేందుకు 12 నుంచి 15 మంది ఉగ్రవాదులు ప్రయత్నించారు. 10 మంది ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది. నౌగామ్‌లో ఐదారుగురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. నౌగామ్‌లో ఒక ఆర్మీ జవాను చనిపోగా , మరో ఇద్దరు గాయపడ్డారు. ఇంకా సరిహద్దులోని కొన్ని ప్రాంతాల నుంచి ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు.

Pages