S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/24/2016 - 03:36

ముంబయి, సెప్టెంబర్ 23: జమ్మూకాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన ఫావద్ ఖాన్ వంటి కళాకారులు తక్షణమే భారత్‌ను వదలిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) శుక్రవారం డిమాండ్ చేసింది. లేకుంటే వారి షూటింగ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించింది.

09/24/2016 - 03:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సిబిసి) చేసిన తీర్మానం ప్రకారం పదేళ్ల లోపు అమ్మానాన్నలిద్దరిని కోల్పోయి, సంరక్షకులు ఎవరూ లేక అనాథలుగా మిగిలిన జనరల్ కేటగిరికి చెందిన పిల్లలు ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాలలో ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి) కోటాలో రిజర్వేషన్లు పొందుతారు.

09/24/2016 - 03:35

జమ్ము, సెప్టెంబర్ 23: కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భర్త రెండోపెళ్లి చేసుకున్నాడన్న ఆగ్రహంతో ఓ మహిళ అతనిపై యాసిడ్ కుమ్మరించింది. ఈ ఘటనలో ఆమెకూ తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కతువా జిల్లాలోని బని పట్టణంలో మహమ్మద్ దిన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం షమీమా అఖ్తర్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది.

09/24/2016 - 03:33

చెన్నై, సెప్టెంబర్ 23: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జ్వరంతో బాధపడుతుండటంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జ్వరం తగ్గుముఖం పట్టిందని, సాధారణ ఆహారం తీసుకుంటున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి ప్రతినిధి సుబ్బయ్య విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు.

09/24/2016 - 03:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సిగంపూర్‌నుంచి చెన్నై వస్తున్న విమానంలో శుక్రవారం శామ్‌సన్ గెలాక్సీ నోట్-2 పేలిపోయింది. ఈ రోజు ఉదయం 7.45 గంటల సమయంలో చెన్నై విమానాశ్రయంలో విమానం లాండయ్యే సమయంలో ఈ ఫోన్ పేలినట్లు తెలుస్తోంది. ఫలితంగా విమానంలో స్వల్పంగా మంటలు చెలరేగగా, సిబ్బంది మంటలార్పే యంత్రాలతో ఆ మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు.

09/24/2016 - 03:07

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 23: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల 26న జరిపే పిఎస్‌ఎల్‌వి-సి 35 ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 9:12గంటలకు ప్రారంభం కానుంది. ప్రయోగం పై శుక్రవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్.

09/24/2016 - 02:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి కొత్త పరోక్ష పన్నుల విధానాన్ని అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న కేంద్రం శుక్రవారం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజులుగా ఇక్కడ సమావేశమవుతున్న జిఎస్‌టి కౌన్సిల్ శుక్రవారం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)నుంచి మినహాయింపునకు ఎంత ఆదాయ పరిమితి నిర్ణయించాలనే దానిపై చర్చించింది.

09/23/2016 - 17:34

చెన్నై: సింగపూర్‌ నుంచి వస్తున్న ఇండిగో విమానం శుక్రవారం చెన్నైలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో సామ్‌సంగ్‌ నోట్‌2 ఫోన్‌ పేలడంతో విమానంలో స్వల్పంగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు పేర్కొన్నారు. వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు సామ్‌సంగ్‌ సంస్థకు సమన్లు జారీచేశారు. సామ్‌సంగ్‌ నోట్‌ ఫోన్లను అనుమతించొద్దని డీజీసీఏ అన్ని విమానయాన సంస్థలకు సూచనలు జారీచేసింది.

09/23/2016 - 17:27

దిల్లీ: దేశంలో వస్తు సేవలపన్ను(జీఎస్‌టీ) అమలుకు సంబంధించి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన రెండో రోజూ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఎంత ఆదాయ పరిమితిని విధించాలనే దానిపై చర్చించారు. ఆదాయ పరిమితిని రూ.20లక్షలుగా నిర్ణయించినట్లు జైట్లీ వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల్లో ఉన్న వారికి ఈ పరిమితిని రూ.10లక్షలుగా ఖరారు చేసినట్లు తెలిపారు.

09/23/2016 - 15:02

ముంబై: పాకిస్థాన్ నటీనటులు, ఆర్టిస్టులు 48 గంటల్లో ఇండియా వదిలిపెట్టి వెళ్లి పోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చెందిన చిత్రపట్ కర్మచారి సేన శుక్రవారం హెచ్చరించించింది. ఉరీ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో అల్టిమేటం జారీ చేసింది. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్థాన్ ఆర్టిస్టులు మూటముళ్లె సర్దుకుని వెళ్లిపోవాలని చిత్రపట్ సేన అమేయ్ ఖోపాక్ అన్నారు. ‘ 48 గంటలు సమయం ఇస్తున్నాం.

Pages