S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాబిన్సోహి, నవనీత్ కౌర్ థిల్లాన్ జంటగా సుమన్రెడ్డి దర్శకత్వంలో బి.ఎస్.ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ఏక్త’. నిర్మాతలు భిక్షమయ్య సంగం, సుమన్రెడ్డి ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తిచేశారు.
రోబో చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న చిత్రానికి 2.0 అన్న పేరును దర్శకుడు శంకర్ ఖరారు చేసిన మాట తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చెన్నైలో సాగుతోంది. ప్రస్తుతం రజనీకాంత్ ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ షూటింగ్కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
మేసా రాజేష్ ప్రధాన పాత్రలో రోహిణి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘కాపాలి’ (మిమ్మల్ని మీరే కాపాడుకోండి). ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మేసా రాజేష్ మాట్లాడుతూ- దాదాపు అనేక భాషల్లో చిత్రాలు చూసిన నేపథ్యంలో ఓ వైవిధ్యమైన చిత్రం తీయాలనే కోరికతో కాపాలి రూపొందించామని తెలిపారు.
జనతాగ్యారేజ్ అందించిన కిక్తో జూ.ఎన్టీఆర్ వరుసగా చిత్రాలను చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాడు. రాఘవేంద్రరావు ప్రస్తుతం నాగార్జునతో ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
‘ప్రేమమ్’ చిత్రం కథ ఒక్కటే అయినా మూడు వేరియేషన్స్లో కథానాయకుడి పాత్ర ఉంటుంది. కొత్తగా ఛాలెంజింగ్గా అనిపించింది. ఆ మూడు పాత్రల్లో ఇప్పటివరకూ నా జీవితంలో జరిగిన దానినే గుర్తుచేసుకుంటూ నటించాను. అయితే టీచర్ను ప్రేమించే పాత్ర ఇంతవరకూ చేయలేదు. అది మాత్రం దర్శకుడు చెప్పినట్టు
‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రానికి దర్శకుడే కర్త కర్మ క్రియలా నిలిచారు. అన్ని సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలో నటించా. కానీ వీరూ పోట్ల నాలోని కొత్త నటుణ్ణి బయటికి తీశాడు అని నటుడు సునీల్ తెలిపారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వీరూపోట్ల దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం రూపొందించిన చిత్రం ‘ఈడు గోల్డ్ ఏహే’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 7న విడుదలకు సిద్ధమైంది.
‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న దగ్గుపాటి రానా ప్రస్తుతం ‘బాహుబలి ది కంక్లూజన్’ చిత్రానికి సంబంధించిన మరో ఐదు రోజుల షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. గతంలో 110 కిలోల బరువుండే ఆయన ఇప్పుడు పాత్రకు అనుగుణంగా బరువు తగ్గాల్సి వచ్చింది. దీంతో తన కోచ్ కునాల్గిర్ పర్యవేక్షణలో డైట్ కంట్రోల్ తీసుకుంటూ వ్యాయామం చేశారు. ప్రస్తుతం 92-93 కిలోల వరకూ బరువు తగ్గించుకోగలిగారు.
సుమన్, శివకృష్ణ, ప్రీతినిగమ్ ప్రధాన తారాగణంగా ప్రేమ్ మూవీస్ పతాకంపై మిరియాల రవికుమార్ దర్శకత్వంలో కొత్తపల్లి సతీష్బాబు రూపొందించిన చిత్రం ‘త్యాగాల వీణ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సి.ఎమ్ క్యాంప్ ఆఫీసులో విడుదల చేశారు.
‘‘మలయాళ భాషలో ‘ప్రేమమ్’ చిత్రం విడుదలై రెండేళ్లయింది. ఇప్పుడు మళ్లీ తెలుగులో రీమేక్లో అదే పాత్రలో నటించమంటే ఒప్పుకున్నా. ఎందుకంటే, మొదటి సినిమాలో నటించినదంతా
ఓ రకంగా మర్చిపోయాను. తెలుగులో చేసేటప్పుడు కూడా సరికొత్తగానే పాత్రను అర్థం చేసుకుని నటించాను. ఆ చిత్రంలో నా పాత్ర పేరు మేరీ అయితే, ఇక్కడ సుమ’’ అని కథానాయిక అనుపమా పరమేశ్వరన్ తెలిపారు.
బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్, టీజర్ను విజయదశమి సందర్భంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రాజసూయ యాగ కీలక సన్నివేశాల చిత్రీకరణ అనంతరం ఆర్ఎఫ్సిలో షూటింగ్ చేస్తున్నారు. ఫస్ట్లుక్ను 9న, టీజర్ను 11న విడుదల చేయనున్నట్టుగా సమాచారం.