-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 1: బిల్లులు లేకుండా జీడిపప్పును మార్కెట్లో అక్రమంగా విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.10లక్షలు విలువైన 1400 కిలోల జీడీపప్పు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కల్వకుర్తి, సెప్టెంబర్ 1: మండల పరిధిలోని తిమ్మరాసిపల్లి గ్రామ సమీపంలో గల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వలో పడి తిమ్మరాసిపల్లి గ్రామానికి చెందిన గోరెట్ల సుక్కమ్మ (45) అనే మహిళ, బర్రె బాలయ్య (80) అనే ఇద్దరు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై రవి తెలిపారు.
ఖమ్మం(క్రైం), సెప్టెంబర్ 1: వరుస దొంగతనాలకు పాల్పడుతూ కనపడ్డ వాహనాలను దొంగిలిస్తూ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కరుడుగట్టిన దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
రొంపిచర్ల, సెప్టెంబర్ 1: అద్దంకి- నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై సుబ్బయ్యపాలెం క్రాస్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకరు అక్కడికక్కడే మృతి చెంద గా, చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కథనం ప్రకారం..
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 1: రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని ఆసుపత్రి ధియేటర్లో ఆపరేషన్లు చేసే సమయంలో రోగులకు వినియోగించే మత్తు ఇంజెక్షన్లను చోరీ చేసిన యువకుడ్ని మరోసారి ఆసుపత్రి సిబ్బంది పట్టుకున్నారు. శనివారం మహిళా వేషంలో వచ్చిన ఆయువకుడు మత్తు ఇంజెక్షన్ల కోసం గైనిక్ వార్డులోకి జొరబడుతుండగా సిబ్బంది, మహిళలు నిలదీసి పట్టుకున్నారు.
కేవీబీపురం, సెప్టెంబర్ 1: కేవీబీపురం మండలంలోని సిద్దేశ్వరకోనలో మరో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు శనివారం మృతిచెందినట్లు కేవీబీపురం ఎస్ఐ నరేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన సమాచారం మేరకు చెన్నైలోని ఎస్ఆర్ఎం ఈశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం బీటెక్ సివిల్కోర్సు చదువుతున్న సిలంబరసన్ (18), విజయ్ ఆనంద్ (18) సిద్దేశ్వర కోన నీటివాగులో పడి మృతిచెందినట్లు ఆయన తెలిపారు.
సోమందేపల్లి, సెప్టెంబర్ 1 : మండల పరిధిలోని కావేటి నాగేపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి భక్తర్ (62) మృతి చెందగా ఇద్దరు గాయాలకు గురయ్యారు. ఎఎస్సై తిరుపాల్నాయక్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురం నుండి ద్విచక్ర వాహనంలో భక్తర్, బాబ్జాన్ గోరంట్లకు వెళుతుండగా కావేటి నాగేపల్లి వద్ద వాహనం అదుపు తప్పడంతో రెడ్డిచెర్వుపల్లికి చెందిన నిడిమామిడప్పను ఢీకొన్నారు.
బొండపల్లి, సెప్టెంబర్ 1: మండలంలోని రుద్రపాలెం గ్రామ సమీపంలో లారీ ఢీకొన్న ప్రమాదంలో మోటారు సైకిలుపై వెళుతున్న మహిళ తలకు తీవ్ర గాయాకావడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకొన్నది. గజపతినగరం పంచాయతీ శివారు ఎం.వెంకటాపురం గ్రామంలో నివాసం ఉంటున్న గేదెల మంగ (40) ఒక శుభకార్యానికి బి.రాజేరు మోటారు సైకిలుపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ డీకొట్టింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 24 గంటల్లో పరిస్థితి అదుపులోనికి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
చెన్నై: తమిళనాడులోని సేలం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై మమంగం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొనటంతో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో 37మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.