క్రైమ్/లీగల్

నిలిచి ఉన్న లారీని ఢీకొన్న ఆటో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొంపిచర్ల, సెప్టెంబర్ 1: అద్దంకి- నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై సుబ్బయ్యపాలెం క్రాస్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకరు అక్కడికక్కడే మృతి చెంద గా, చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలానికి చెందిన చల్లా నాగరాజు, నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన ఇర్లా తిరుపతమ్మలకు నాలుగురోజుల కిందట వివాహమైంది. వివాహానంతరం నాగరాజు, తన అత్తగారి గ్రామమైన దేచవరానికి కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఆటోను బాడుగకు మాట్లాడుకుని ప్రయాణం చేస్తున్నారు. సుబ్బయ్యపాలెం క్రాస్ వద్ద నిలిచిఉన్న లారీని ఆటో ఢీకొంది. ఈ ఘటనలో వధువు తమ్ముడు గురుమూర్తి (16) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడినవారిని చికిత్స నిమిత్తం నరసరావుపేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తమ్మిశెట్టి వెంకట రమణమ్మ (35) మృతిచెందింది. ఉప్పు దుర్గ, బత్తుల లక్ష్మీ, వరుడు నాగరాజుతో పాటు మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. రొంపిచర్ల ఎస్‌ఐ ఎస్ వెంకట్రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు.