క్రైమ్/లీగల్

మహిళా వేషంలో పట్టుబడిన మత్తు ఇంజెక్షన్ల దొంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 1: రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని ఆసుపత్రి ధియేటర్‌లో ఆపరేషన్లు చేసే సమయంలో రోగులకు వినియోగించే మత్తు ఇంజెక్షన్లను చోరీ చేసిన యువకుడ్ని మరోసారి ఆసుపత్రి సిబ్బంది పట్టుకున్నారు. శనివారం మహిళా వేషంలో వచ్చిన ఆయువకుడు మత్తు ఇంజెక్షన్ల కోసం గైనిక్ వార్డులోకి జొరబడుతుండగా సిబ్బంది, మహిళలు నిలదీసి పట్టుకున్నారు. గతనెల 13న గోరక్షణపేటకు చెందిన పలివెల శ్యామ్‌ప్రసాద్ అనే ఆయువకుడు ఆసుపత్రి అధికారుల పేర్లు చెప్పి లోపలికి జొరబడి 30 మత్తు ఇంజెక్షన్లు చోరీ చేశాడు. గతనెల 17న డిసిహెచ్‌ఎస్ డాక్టర్ రమేష్‌కిషోర్ ఆసుపత్రిలోని సిసి కెమెరాలు పరిశీలిస్తుండగా శ్యామ్‌ప్రసాద్ మళ్లీ ఆపరేషన్ ధియేటర్‌లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. ఆయన వైద్యులు, సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈవిషయం పసిగట్టిన ఆగంతకుడు ఆసుపత్రి భవనం పైనుంచి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించి, పట్టుబడ్డాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తాజాగా శనివారం మరోసారి ఆయువకుడు మత్తు ఇంజెక్షన్ల కోసం ఆసుపత్రిలోకి మహిళా వేషంలో జొరబడటం గమనార్హం. ఇంజెక్షన్లకు బానిసై, శ్యామ్‌ప్రసాద్ చోరీలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు.