S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/21/2016 - 16:29

హైదరాబాద్‌: ఇకపై సినిమాలకు 48 గంటల్లోనే సింగిల్‌విండో విధానం ద్వారా అనుమతులు ఇవ్వాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయించారు. చిన్న సినిమాలకు ఐదో ఆట వేయాలని కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలానికి 200 సీట్లతో మినీ కల్చరల్‌ సెంటర్ల ఏర్పాటుకు ఉపసంఘం సిఫార్సు చేసింది.

03/21/2016 - 16:24

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో జనం వేసవి తీవ్రతతో బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం నాడు సగటు కంటే మూడు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఎండ తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావారణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

03/21/2016 - 16:21

హైదరాబాద్: శాసనసభలో వ్యవహారాలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని ఎపి ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆయన సోమవారం అసెంబ్లీ సమావేశంలో ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ, చట్టసభల్లో అదుపుతప్పి వ్యవహరించే సభ్యులను నియంత్రించాల్సి ఉందన్నారు.

03/21/2016 - 16:21

హైదరాబాద్: సాటి మహిళ అని కూడా చూడకుండా టిడిపి శాసనసభ్యురాలు అనితపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ వేటు సబబేనని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఆయన సోమవారం ఎపి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, రోజా ప్రవర్తించిన తీరుతో మహిళలంతా తలదించుకుంటున్నారన్నారు.

03/21/2016 - 16:20

హైదరాబాద్: తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అసభ్యకరంగా మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే రోజాపై చట్టపరంగా చర్యలు తీసుకున్నా, అసెంబ్లీలోనే తనకు న్యాయం జరగాలని టిడిపి ఎమ్మెల్యే అనిత అన్నారు. రోజా చేసిన వ్యాఖ్యలతో తాను, తన పిల్లలు ఎంతో మానసిక వేదన అనుభవించామని ఆమె సోమవారం శాసనసభలో మాట్లాడుతూ అన్నారు. రోజాపై చర్య తీసుకోవడానికి బదులు సభా సమయాన్ని వైకాపా అధినేత జగన్ వృథా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

03/21/2016 - 16:06

చిత్తూరు: ఎర్రావారిపాలెం మండలం తూర్పుగుట్టపల్లె దగ్గర ఆయిల్‌ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పోలీసులు 8మందిని అరెస్ట్ చేశారు. ఈ దుంగలు రూ. 32లక్షల విలువ చేస్తాయని పోలీసులు చెబుతున్నారు.

03/21/2016 - 14:25

హైదరాబాద్: ఎపిలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కామన్ యూనివర్సిటీ చట్టాన్ని రూపొందిస్తామని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన సోమవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, కామన్ వర్సిటీ చట్టం రూపకల్పనకు 8 మందితో ఓ కమిటీని వేశామన్నారు.

03/21/2016 - 14:24

హైదరాబాద్: ఏపి అసెంబ్లీలో పిఎసి కమిటీ చైర్మన్‌గా కర్నూల్ జిల్లా డోన్ ఎమ్మెల్యే బి.రాజేంద్రనాథ్ రెడ్డి పేరును వైకాపా ఎమ్మెల్యేల భేటీలో ఆ పార్టీ అధినేత జగన్ ఖరారు చేశారు. సోమవారం లోటస్ పాండ్‌లోని తన ఇంట్లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం, హైకోర్టు ఉత్తర్వులు, భవిష్యత్ పరిణామాల గురించి కూడా ఆయన సమావేశంలో చర్చించారు.

03/21/2016 - 14:24

హైదరాబాద్: నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు, తన మనవడైన దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఎపి సిఎం చంద్రబాబు తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్టుకు సోమవారం 20 లక్షల రూపాయల విరాళం అందజేశారు. చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు దేవాన్ష్‌ను ఆశీర్వదించారు.

03/21/2016 - 11:54

విజయవాడ: వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనుల్లో సోమవారం ఉదయం అపశ్రుతి చోటు చేసుకుంది. పనులు జరుగుతుండగా ఓ రిగ్గుపై పడి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. సమాచారం తెలిసిన వెంటనే సంఘటన ప్రాంతానికి అధికారులు, పోలీసులు చేరుకున్నారు.

Pages