S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/22/2016 - 02:10

హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇటు అసెంబ్లీలో అటు కోర్టులో కూడా సస్పెన్షన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. సభా హక్కుల కమిటీ ముందు హాజరయ్యేందుకు రోజాకు మరో అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల చేసిన సిఫార్సులను నాలుగు గంటల చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

03/22/2016 - 02:04

హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం శాసనసభలోని తన చాంబర్‌లో సిఎం ఇసుక విధానం అమలుపై రెవిన్యూ, మైనింగ్ పోలీసు శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి రెవిన్యూ డివిజన్‌లో రెవిన్యూ , మైనింగ్, పోలీసు అధికారులతో టాస్క్ఫోర్సు వేయాలని సిఎం కోరారు.

03/22/2016 - 02:01

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి ద్రోణాచలం వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేరును ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేశారు. స్పీకర్ ఈ విషయాన్ని అధికారికంగా అసెంబ్లీలో ప్రకటిస్తారు. అలాగే పిఏసి సభ్యులుగా తుని ఎమ్మెల్యే రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే సురేష్ పేరును వైకాపా ప్రతిపాదించింది.

03/22/2016 - 01:56

యాదమరి/కనిగిరి: చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా యాదమరి మండల పరిధిలో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు.

03/22/2016 - 01:54

హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ సిబ్బంది తరలింపుపై మరోమారు మున్సిపల్ మంత్రి డాక్టర్ పి నారాయణ ఉద్యోగుల నేతలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్ పి టక్కర్ సైతం పాల్గొన్నారు. జూలై 15 నాటికి 4వేల మందిని, జూలై మరో 3వేల మందిని, ఆగస్టుకి మరో 3వేల మంది ఉద్యోగులను తరలించాలన్న ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల ముందుంచారు.

03/21/2016 - 18:17

హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరై క్షమాపణలు చెప్పేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఎపి శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. అయిదుగురు వైకాపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ప్రివిలైజ్ కమిటీ (శాసనసభ హక్కుల కమిటీ) చేసిన సిఫార్సులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

03/21/2016 - 18:16

హైదరాబాద్: విడతల వారీగా ఉద్యోగులను తరలించాలన్న ఏపి ప్రభుత్వ ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య సోమవారం ఇక్కడ సమావేశం జరిగింది. జూన్ 15లోగా నాలుగువేల మందిని, జూలైలో మూడు వేల మందిని, ఆగస్టులోగా మరో మూడు వేల మంది ఉద్యోగులను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

03/21/2016 - 18:15

హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయడంపై ఏపి అసెంబ్లీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. రోజా అసెంబ్లీకి హాజరు కావచ్చని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

03/21/2016 - 18:15

విజయవాడ: ఎపి రాజధానిగా అవతరించే అమరావతి ప్రాంతంలో సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎస్‌వి రమణ, మదన్ బి లోకూర్ పర్యటించారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతం, నమూనా నిర్మాణాలను వారు పరిశీలించి, సిఆర్‌డిఎ అధికారులతో సమావేశమయ్యారు.

03/21/2016 - 18:14

చిత్తూరు: ఎర్రావారిపాలెం మండలం తూర్పుగుట్టపల్లి వద్ద సోమవారం పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి 24 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న 8 మంది కూలీలను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.

Pages