-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
కాకినాడ, మే 30: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం వలన ఏమాత్రం ప్రయోజనం లేదని, హోదా కంటే రాష్ట్రానికి అత్యధిక స్థాయిలో నిధుల మంజూరుపైనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. కాకినాడలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.
భీమవరం, మే 30: రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఇక నుంచి నిర్మించబోయే ప్రతీ భవనంలో ఇంకుడుగుంత తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సోమవారం అదేశించింది. ఆ ఇంకుడుగుంతను జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. భవన నిర్మాణానికి సంబంధించిన ఆమోదం కోసం సమర్పించే ప్లాన్లోనే ఇంకుడుగుంత ఎక్కడ నిర్మించేదీ చూపించాల్సి ఉంటుంది.
విశాఖపట్నం, మే 30: దేశంలో ఇప్పటికీ 1.8 కోట్ల ఇళ్ల కొతర ఉందని కేంద్ర పట్టణ గృహనిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి, హౌసింగ్ ఫర్ ఆల్ మేనేజింగ్ డైరెక్టర్ అమ్రి అభిజిత్ అన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ అల్పాదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకే ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందన్నారు.
విజయవాడ, మే 30: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ‘‘ఆర్థిక నేరాల్లో ఎ1 ముద్దాయిగా ఉన్న జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అందులో ఎ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఇప్పుడు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారు. ఇది గర్హనీయం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ పార్టీకి ఎ1,ఎ2 ముద్దాయిలు తప్ప, వేరే నాయకులు లేరా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
హైదరాబాద్, మే 30: మరో పదకొండు రోజుల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన చేదు అనుభవాలు దృష్టిలో ఉంచుకుని, తన పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ విసిరే వలలో పడకుండా, వారి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
విజయవాడ, మే 30: రాజ్యసభ స్థానానికి పోటీ చేయనున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరికి తిరిగి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన టిజి వెంకటేష్కు రాజ్యసభ టిక్కెట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. తన నివాసంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అభ్యర్థులను ప్రకటించారు.
విజయవాడ: ఎపి నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఎట్టకేలకు టిడిపి ఖరారు చేసినట్లు తెలిసింది. టిడిపికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, పార్టీ నాయకుడు టిజి వెంకటేష్లను బరిలో నింపాలని నిర్ణయించారు. ఒక సీటును తమకు కేటాయించాలని మిత్ర పక్షమైన బిజెపి విజ్ఞప్తిని టిడిపి అధినేత చంద్రబాబు అంగీకరించారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఎపి నుంచి రాజ్యసభకు పంపుతారు.
కర్నూలు: యాగంటి ఆలయ ఈఓ ఆదిశేషునాయుడిపై సోమవారం మధ్యాహ్నం రామకృష్ణారెడ్డి అనే గుమస్తా హత్యాయత్నం చేశాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్నందుకు రామకృష్ణారెడ్డికి జీతం నిలిపివేశారు. తనపై ఈఓ కక్ష గట్టారన్న ఆగ్రహంతో ఈఓపై రామకృష్ణారెడ్డి పెట్రోలు పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా మిగతా ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఆయనకు గండం గడిచింది. పరారైన రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
విజయవాడ: ఎపి నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని నిలిపే విషయమై టిడిపిలో చేరిన 17 మంది వైకాపా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఇక్కడ మంతనాలు జరుపుతున్నారు. వాస్తవానికి అసెంబ్లీలో తనకున్న సంఖ్యాబలం మేరకు మూడు రాజ్యసభ స్థానాలను టిడిపి కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. మరో స్థానాన్ని వైకాపా గెలుచుకునే వీలుంది.
దిల్లీ: వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. బిహార్లో సోమవారం నాడు ఆర్జెడి తరఫున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, జెడియు నుంచి శరద్ యాదవ్, ఆర్జెడి అభ్యర్థిగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి నామినేషన్లు వేశారు. పంజాబ్ నుంచి కాంగ్రెస్ నాయకురాలు అంబికాసోనీ నామినేషన్ దాఖలు చేశారు.