-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూలై 31: మార్కెట్ సంస్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇతోధిక కృషిలో భాగంగా రాష్ట్రంలో దశలవారీగా అన్ని మార్కెట్ యార్డుల్లోను ఆన్లైన్ ట్రేడింగ్కు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనకాపల్లి, ఏలూరు, గుంటూరు, దుగ్గిరాల, కడప, కర్నూలు, ఆదోని, ఎన్నిగనూరు, హిందూపురం, కల్యాణ దుర్గంలో ఆన్లైన్ ద్వారా కొనుగోలు జరిపి పోటీ ధర కల్పించడంతో పాటు లావాదేవీలన్నీ పారదర్శకతతో జరుగుతున్నాయి.
మేడికొండూరు, జూలై 31: ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాకొట్టగా బోల్తాపడివున్న ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు జోసిల్ కంపెనీ వద్ద ఆదివారం జరిగింది.
విశాఖపట్నం, జూలై 31: గల్లంతైన వాయుసేన విమానం ఎఎన్-32 శకలాలు విశాఖ జిల్లా నాతవరం మండలం అటవీ ప్రాంతంలో ఉన్నట్టు అందిన సమాచారం వట్టిమాటగా తేలింది. సూర్యలంక ఎయిర్ఫోర్స్ స్టేషన్కు రెండు రోజుల కిందట వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా అటు వాయుసేన, ఇటు అటవీశాఖ బృందాలు విస్తృత గాలింపు జరిపాయి. నాతవరం మండలం సరుగుడు పరిసర అటవీ ప్రాంతాల్లో రెండు బృందాలుగా అటవీశాఖ సిబ్బంది గాలింపు జరిపాయి.
ఏలూరు, జూలై 31: డ్రైవర్ అప్రమత్తత కారణంగా రాయగడ నుంచి విజయవాడ వెళుతున్న పాసింజర్ రైలుకు ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఏలూరు - వట్లూరు రైల్వే స్టేషన్ మధ్యలో ఇంజను పట్టాలు తప్పడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. పట్టాలు తప్పిన సమయంలో రైలు కేవలం 30 కిలోమీటర్ల వేగంలో వెళుతుండటంతో నిలుపుదల చేసేందుకు వీలుకలిగింది.
ఒంగోలు, జూలై 31: ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. ఒంగోలులో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ హోదా కోసం జపాన్ తరహాలో శాంతియుతంగా ఉద్యమిస్తామన్నారు. ప్రజలకు చేరవయ్యేందుకే కారణాలను వెతుక్కునే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిందని కెఇ ధ్వజమెత్తారు.
పుత్తూరు, జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, ప్రజల మనోభావాలు దెబ్బతినకముందే ప్రత్యేక హోదా కేటాయింపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు.
విశాఖపట్నం, జూలై 31: రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు కూడగట్టనున్నట్టు ఎపి పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లుపై సెప్టెంబర్ 5న ఓటింగ్ జరిగే అవకాశం ఉందని, అప్పటికీ ఈ అంశంపై స్పష్టత రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
రాజమహేంద్రవరం, జూలై 31: గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ఉదయం ఆరు గంటలకు రాజమహేంద్రవరం సరస్వతి విఐపి ఘాట్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఇతర ప్రజా ప్రతినిధులు పుణ్య స్నానాలు ఆచరించి, అంత్య పుష్కర క్రతువును లాంఛనంగా ఆరంభించారు. ప.గో. జిల్లా కొవ్వూరులో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రారంభించారు.
వేదాయపాళెం, జూలై 31: నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్శిటీకి సంబంధించిన వెబ్సైట్ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. తమ వెబ్సైట్ను ఎవరో హ్యాక్ చేశారని గుర్తించిన అధికారులు ఆదివారం ఉదయం 10.30 గంటలకు వెబ్సైట్ను పూర్తిగా నిలిపివేశారు.
హెచ్చరికలతో పేజీ దర్శనం
కడప/ మచిలీపట్నం/ మొగల్తూరు, జూలై 31: ఆంధ్రప్రదేశ్లో ఆదివారం కడప, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడు వేర్వేరు సంఘటనల్లో ఏడుగురు వ్యక్తులు నీట మునిగి చనిపోయారు. కడప జిల్లాలో పెన్నానది ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లి నీటిలో గల్లంతై ముగ్గురు బాలురు మృతి చెందారు. కడప నగరం దండోరా కాలనీకి చెందిన ఒక కుటుంబం పెన్నానది ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లింది.