S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
బాలీవుడ్లో క్వీన్ చిత్రంతో సెనే్సషన్ సృష్టించిన కంగనా రనౌత్.. ఆకారంలో పెద్ద ఎత్తులేకున్నా ప్రతిభలో ఆకాశమంత ఎత్తుకెదిగి మణికర్ణికతో మరోసారి క్వీన్ అయ్యందంటూ ప్రశంసలు అందుకుంది. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక’. జీ స్టూడియోస్, కమల్జైన్ నిర్మాణంలో జాగర్లమూడి క్రిష్, కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. జనవరి 25న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించా.
వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా మారిన రకుల్కు ‘స్పైడర్’ ఇచ్చిన షాక్ తర్వాత ఎందుకో తెలుగు సినిమాలు సైన్ చేయడం తగ్గించింది. తమిళం, హిందీపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. రకుల్ ప్రస్తుతం మూడు తమిళ సినిమాలు.. రెండు హిందీ చిత్రాలు చేస్తోంది. తాజాగా తెలుగులో ఒక సినిమాకు పచ్చజెండా ఊపిందని వార్తలు వస్తున్నాయి. హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.
సిరిమల్లె పూవే/ విరిజల్లు కావే/ వరదల్లె రావే/ వలపంటే నీవే/ ఎనె్నల్లు తేవే/ ఎదమీటి పోవే -అంటూ సాగే ‘పంతులమ్మ’ చిత్రంలో పాటంటే నాకెంతో ఇష్టం. ఈ చిత్రంలో నటీనటుల పాత్రపోషణ పరిధులు దాటకుండా సహజ భావన కలుగుతుంది. అలతిలలతి పదాలు, హృద్యమైన భావనతో వేటూరి కలంనుంచి జాలువారిన గీతానికి రాజన్- నాగేంద్ర అంతే లలితంగా, సుమధురంగా బాణీ కట్టారు.
సందేశాత్మక చిత్రాలు తెలుగుకు కొత్తకాదు. ఆ బాటలో 2004లో జూ.ఎన్టీఆర్, భూమిక, జెనీలియా హీరో హీరోయిన్లుగా దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన చిత్రం -సాంబ. విద్య గొప్పతనం, విలువను వినాయక్ బాగా చూపించాడు. కథగా.. రాయలసీమలో అభ్యుదయ భావాలు కలిగిన మోతుబరి ధర్మయ్యనాయుడు. కానీ నిరక్షరాస్యుడు.
భాగమతి తర్వాత అనుష్క ఏ సినిమాలో నటిస్తోందనే విషయం ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి గానీ ఒక ప్రాజెక్టు మాత్రం కన్ఫర్మ్. అదే రచయిత కోన వెంకట్ -దర్శకుడు హేమంత్ మధుకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోందట. ఈమధ్యే సినిమా గురించి కోన వెంకట్ వెల్లడించాడు. సినిమా అమెరికా నేథ్యంలో తెరకెక్కే ఒక హారర్ ఫిలిం అని టాక్.
సినిమా వ్యాపారమే అయినా ఒకప్పుడు సంగీత ప్రయోజనాన్ని కాంక్షించే నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులూ ఉండేవారు. వారి పుణ్యమా అని ఆనాటి సినిమా కథలు, నటీనటులతోపాటు పాటలు చిరస్థాయి కీర్తిని ఆర్జించిపెట్టేవి. అలాంటి అనేకానేక పాటల్లో ‘జయసింహ’ చిత్రంలోని ‘ఈనాటి ఈహాయి’ పాట నాకు చాలా చాలా ఇష్టం. విశ్వవిఖ్యాత నటరత్న ఎన్టి రామారావు సొంత బ్యానరుపై నిర్మించిన జానపద చిత్రం జయసింహ.
వైవిధ్యమైన కథలను తెరకెక్కించే సక్సెస్ఫుల్ నిర్మాత దిల్రాజు సారథ్యంలో దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ తెరకెక్కించిన చిత్రం -సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.
గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్నా, కెరీర్ గ్రాఫ్ మాత్రం పైకి ఎదగడం లేదంటని బాధపడుతోందట లావణ్య త్రిపాఠి. గత రెండేళ్లుగా ఏడాదికి నాలుగైదు సినిమాలు చొప్పున చేసేసినా -తనతోపాటు పరిశ్రమకు వచ్చిన హీరోయన్లతో సమానంగా రేటింగ్ సంపాదించలేకపోయంది. పైగా ఓ రేంజ్ హీరోలతో సినిమాలు పడుతున్నా, టాప్రేంజ్కు లావణ్య చాలా దూరంగానే ఉండిపోయంది.
ప్రత్యేకమైన పాత్రలతో కోలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న వరలక్ష్మి శరత్కుమార్ ఈమధ్య కాలంలో ఎక్కువగా నెగటివ్ రోల్స్వైపు మొగ్గుచూపుతోంది. స్టార్ హీరో కూతురిగా కన్నా ఒక నటిగా గుర్తింపురావాలని తపనపడే వరలక్ష్మి కొన్ని నెలల క్రితం దాకా విశాల్ ఎక్స్ లవర్గా మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది.
స్వాతికిరణం చిత్రంలోని -తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ.. అన్న పాట నాకు చాలా ఇష్టం. భూపాలరాగ సమయంలోని కాస్మిక్ నేచర్ని మనసు పొరల్లోకి తీసుకొస్తున్నంత గొప్పగా ఉంటుంది. ప్రకృతి నుంచి పాట తీయమంటే మైమర్చిపోయి రాసే సిరివెనె్నల సీతారామ శాస్ర్తీ మమతపెట్టి రాసిన గీతమిది. ‘ఈ దోవ పొడవునా కువకువల స్వాగతం/ నీ కాలి అలికిడికి మెలకువల వందనం’ అన్న ఎక్స్ప్రెషన్ అత్యద్భుతం.