-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, ఏప్రిల్ 7: ఐదు మున్సిపాలిటీల్లో మంచినీటి సరఫరా కోసం 224.94 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్, జమ్మికుంట, మెదక్, కొల్లాపూర్, కొత్తగూడెం మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేశారు. రాష్ట్రంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామాలకు, మున్సిపాలిటీలకు మంచినీటి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తోంది.
రామాయంపేట, ఏప్రిల్ 7: రెండు కోట్ల విలువైన సుమారు ఏడు టన్నుల ఎర్రచందనం దుంగల లారీని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఏపి 16 టిఎక్స్ 0367 గల లారీలో ఏడు టన్నుల ఎర్రచందనం దుంగలను వేసుకుని, పైన సిమెంట్ బస్తాలను నింపుకుని స్మగ్లర్లు హైదరాబాద్ నగర శివారు నుండి నాగపూర్కు తరలిస్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 7: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుపై టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రుజువు చేస్తూ తాము చేసే పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా సమగ్ర సమాచారాన్ని అందిస్తామని టిపిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. గురువారం నాడిక్కడ గాంధీభవన్లో పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్: హోటల్ మేనేజ్మెంటు కాలేజీలో విద్యార్థినులు, ఉద్యోగినుల ఫొటోలను మార్ఫింగ్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ గుమస్తాపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని అంబర్పేట డిడి కాలనీలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు గురిచేస్తూ కాలేజీ గుమస్తా రవీంద్రకుమార్ ఉద్యోగినులను, విద్యార్థినులను లైంగికంగా వేధించేవాడు.
హైదరాబాద్: కరవు సహాయం, ఉపాధి హామీ పథకం కింద కేంద్రం వందల కోట్ల నిధుల్చినా వాటిని ఖర్చు చేయకుండా తెలంగాణ సిఎం కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని బచావో తెలంగాణ మిషన్ అధ్యక్షుడు నాగం జనార్దనరెడ్డి గురువారం మీడియాతో చెప్పారు. రైతుల పాలిట తెలంగాణ ప్రభుత్వం శాపంగా మారందన్నారు. కెసిఆర్ అనుభవ రాహిత్యం, అవగాహన లేని పాలనపై జూన్ 1 తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని ఆయన తెలిపారు.
హైదరాబాద్: ప్రజలంతా ముందుగానే పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ప్రధాన ఆదాయ వనరైన పన్నులు సకాలంలో వసూలు చేయకుంటే ఏమీ సాధించలేమని ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ‘వంద రోజుల పథకం’ అమలును ఉగాది తర్వాత మరింత వేగవంతం చేస్తామన్నారు. 300 నాలాల్లో పూడికతీత పనులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు.
హైదరాబాద్: తగినంత మంది సభ్యులు హాజరుకానందున (కోరం లేక) గురువారం జరగాల్సిన జిహెచ్ఎంసి కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. దీంతో కో-ఆప్షన్ పదవుల కోసం ఎదురుచూసిన వారు నిరాశతో వెనుదిరిగారు.
హైదరాబాద్: ప్రైవేటు సంస్థలకు చెందిన క్యాబ్ల వల్ల తమ ఉపాధికి గండిపడుతోందని ఆటోడ్రైవర్లు సికిందరాబాద్లో గురువారం ఆందోళన చేశారు. ఆటోల కంటే వీటిని తక్కువ రేట్లకు తిప్పడం వల్ల ప్రయాణీకులు వాటినే ఆశ్రయిస్తున్నారన్నారు. రవాణా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నందున క్యాబ్లను కట్టడి చేయాలని వారు కోరుతున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్రంలో ప్రచండ భానుడి ప్రతాపానికి బుధవారం నాటికి 66 మంది మృతి చెందారు. హైదరాబాద్ సహా తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా మారింది. మార్చి నెల నుంచే ఎండలు ముదిరి ఏప్రిల్ నాటికి 42 డిగ్రీలకు చేరితే ఇక మే నెల పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని జనం భయపడిపోతున్నారు. బుధవారం నమోదైన ఉష్ణోగ్రతల ధాటికి జనం అల్లాడి పోతున్నారు.
రాయికల్, ఏప్రిల్ 6: లక్ష కోట్ల వ్యయంతో గోదావరి జలాలు వాడుకలోకి తెచ్చి రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యలు తీర్చు కోవడంతోపాటు తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని బోర్నపల్లి సమీపంలో గోదావరి నదిపై రూ.