-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, మే 24: రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ల పర్వం ప్రారంభం అయిన తరువాత కూడా ముఖ్యమంత్రి మనసులో ఏముందో తెలియక నాయకులు ఆయోమయంలో ఉన్నారు. తెలంగాణ నుంచి రెండు స్థానాలు ఉండగా, రెండింటిలోనూ టిఆర్ఎస్ విజయం సాధించడానికి కావలసిన బలం ఉంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటివరకు తన మనసులో ఏముందో చెప్పడం లేదు. రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్న నాయకులు మాత్రం ముఖ్యమంత్రిని కలిసి వెళుతున్నారు.
హైదరాబాద్, మే 24: తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, సురక్షిత చర్యలు తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం రూ. 139 కోట్లతో ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ సంస్ధను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల ట్రాఫిక్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తారు.
హైదరాబాద్, మే 24: పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు కేవలం రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం నల్లా కనెక్షన్కు రూ.1200 వసూలు చేస్తుండగా, దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు రూ.200 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇకనుంచి రూ.200కు బదులుగా నామమాత్రంగా రూపాయి మాత్రమే వసూలు చేయాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది.
హైదరాబాద్, మే 24: రాష్టవ్య్రాప్తంగా సుమారు నాలుగు వేల వరకు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి మళ్లీ బ్రేక్పడింది. జూన్ 2న రాష్ట్రావతరణ వేడుకలు ముగిసిన తర్వాతే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని తాజాగా సిఎం కె చంద్రశేఖర్రావు నిర్ణయించినట్టు పార్టీవర్గాల సమాచారం.
హైదరాబాద్, మే 24: టి-హబ్లో పెట్టుబడులకు అమెరికాలోని ఇల్లినాయిస్లో పలు సంస్థలు ఆసక్తి చూపించాయి. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రెండు వారాల పాటు అమెరికా పర్యటనకు వెళ్ళగా, కెటిఆర్కు చికాగో నగరంలో తెలంగాణ ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ భారత కాన్సుల్ జనరల్ అసఫ్ సయిద్తో మంత్రి సమావేశం అయ్యారు.
హైదరాబాద్, మే 24: దేశంలోనే ఆదర్శంగా పాలమూరు ప్రాజెక్టును నిర్మించాలని, నిర్దేశించుకున్న సమయంకన్నా ముందే ప్రాజెక్టు పూర్తిచేయాలని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఐడిసి కార్యాలయంలో పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి మంగళవారం సమీక్ష జరిపారు.
హైదరాబాద్, మే 24: తెలంగాణలో బోగస్ విద్యాసంస్థలు అన్నింటినీ ఏరివేసే వరకూ విజిలెన్స్ దాడులు కొనసాగుతాయని సిఎం కె చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులే ఉండాలని, వేలంవెర్రిగా ఒకేరకమైన కోర్సుల్లో చేరడంవల్ల నిరుద్యోగం పెరిగిందని సిఎం అభిప్రాయపడ్డారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రైవేటు విద్యా సంస్థలతో సిఎం కెసిఆర్ మంగళవారం సమావేశమయ్యారు.
హైదరాబాద్, మే 24: ఉద్యోగుల విభజన కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, సీనియార్టీ సమీక్ష, కారుణ్య నియామకాలపై ఇంతకాలం కొనసాగిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఉద్యోగుల విభజన ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన కమలానాథన్ కమిటీ కసరత్తు దాదాపు పూర్తి కావడంతో వీటిపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ సాధారణ పరిపాలనశాఖ మంగళవారం జీవో 1161 విడుదల చేసింది.
హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఇక రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్: బోగస్ కాలేజీలు, నిబంధనలను పాటించని విద్యాసంస్థల్లో అక్రమాలను గుర్తించేందుకు పోలీస్ విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతాయని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తనిఖీల్లో పోలీసులు వద్దంటూ ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు తనను కలిసి చేసిన విజ్ఞప్తులపై ఆయన స్పందించారు. కాలేజీల్లో సౌకర్యాల కల్పనకు అవసరమైతే కొంత సమయం ఇస్తామని, ఫీజు రీయింబర్స్మెంటు పేరిట అవకతవకలకు పాల్పడితే సహించేది లేదన్నారు.