-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల కౌనె్సలింగ్కు బుధవారం షెడ్యూలు ఖరారు చేశారు. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ డాక్టర్ ఎంవి రెడ్డి షెడ్యూలును విడుదల చేశారు. 22న 1నుండి 6 వేల ర్యాంకు వరకూ షెడ్యూల్ ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలన మొదలై జూలై 1న 92001 నుండి చివరి ర్యాంకు వరకూ జరుగుతుంది. ఇదంతా పూరె్తైన తర్వాత 25 లేదా 26 నుండి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.
హైదరాబాద్, జూన్ 15 : తెలంగాణలో 2016-17 సంవత్సరంలో 112 లక్షల ఎకరాల్లో (45.49 లక్షల హెక్టార్లు) పంటలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2016-17 సంవత్సరం వ్యవసాయ ప్రణాళికను సేద్యం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్లో పత్తిపంట విస్తీర్ణాన్ని తగ్గించేందుకు నిర్ణయించి, కందులు, మొక్కజొన్న, సోయాబీన్ పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు.
హైదరాబాద్, జూన్ 15: మా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలను బాహటంగా కొనేస్తున్నారు2 అని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ సిఎం కెసిఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఫిరాయింపులకు కెసిఆర్ బాధ్యత వహించాలన్నారు. బుధవారం గాంధీ భవన్లో జరిగిన తెలంగాణ పిసిసి సమన్వయ కమిటీ సమావేశానికి దిగ్విజయ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెరాసను అధికారంలో కొనసాగనీయకుండా రాష్టప్రతి పాలన పెట్టాలని కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు బాంబుపేల్చారు. ఈ రహాస్యాన్ని తొలిసారి బయట పెడుతున్నానని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
భద్రాచలం, జూన్ 15: ఆధ్యాత్మిక, ఇతిహాస ప్రాధాన్యత కలిగిన భద్రాచలం శ్రీ రామ దివ్యక్షేత్రం తాజాగా కేంద్ర రామాయణ వలయంలో చోటు సంపాదించుకుంది. స్వదేశీ దర్శన్ పేరిట దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, ఇతిహాస ప్రాధాన్యమున్న ప్రాంతాలను కలుపుతూ కేంద్ర పర్యాటక శాఖ రామాయణ పర్యాటక వలయంగా ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. టి.పిసిసి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను పెంచుతున్న తెరాస పాలకులు భారీగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
హైదరాబాద్: తెరాస పాలనలో తెలంగాణ నాశనమవుతోందని కొందరు కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేస్తున్నారని, నిజానికి కాంగ్రెస్ పార్టీయే భ్రష్టుపడుతోందని సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
కరీంనగర్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజన్న ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం ఏడునెలల మగశిశువు మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కాంగ్రెస్ నాయకులు జి.వినోద్, జి.వివేక్ బుధవారం తెరాసలో చేరారు. సిఎం కెసిఆర్ సమక్షంలో వీరంతా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. నల్గొండ జిల్లా నుంచి గుత్తా అనుచరులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇక్కడి తెలంగాణ భవన్కు తరలివచ్చారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం లభించిందని టి.టిడిపి నేత రేవంత్రెడ్డి అన్నారు. ఈ పరిణామాలు ముందుగా ఊహించినవేనని ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన వర్క్షాప్లో అన్నారు. గతంలో కెసిఆర్ ఎమ్మెల్యేలను కొంటున్నపుడే కాంగ్రెస్ పార్టీని హెచ్చరించామని, ఆ తర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను బలవంతంగా బయటకు పంపారని అన్నారు.