S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/07/2016 - 01:09

ముంబయి, ఏప్రిల్ 6: ఢిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని విధ్వసం సృష్టించేందుకు పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు సంచరిస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు బుధవారం హెచ్చరించాయి. మారుతీ స్విఫ్ట్ జైర్ కారులో వీరు తిరుగుతున్నట్టుగా వెల్లడించాయి. వీరి వద్ద భారీ ఆయుధాలు, ఆత్మాహుతి దాడి జరిపేందుకు బెల్టులు కూడా ఉన్నట్టుగా స్పష్టం చేసింది.

04/07/2016 - 00:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: రాష్టప్రతి ప్రణబ్ ఆదేశాల మేరకు ఢిల్లీ, గుజరాత్ హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించిన అనంతరమే బదిలీలు జరిగాయ. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ కుమార్ ఖేట్ హైదరాబాద్‌లోని జుడికేచర్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆయన సేవలందజేస్తారని రాష్టప్రతి ఆదేశంలో పేర్కొన్నారు.

04/06/2016 - 17:59

శ్రీనగర్: పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడమే కాకుండా ఇప్పటికీ వెంటాడి వేధిస్తున్నారని శ్రీనగర్ ఎన్‌ఐటిలో చదువుతున్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ పోటీ సందర్భంగా నిట్ విద్యార్థులపై స్థానికులు దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిట్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీ చార్జి చేశారు.

04/06/2016 - 16:27

దిల్లీ: జమ్ము-కాశ్మీర్ సరిహద్దుల గుండా భారత్‌లోకి ముగ్గురు ఉగ్రవాదులు ప్రవేశించినందున దిల్లీ, గోవా, ముంబయి ప్రాంతాల్లో బాంబుదాడులకు అవకాశం ఉందని పంజాబ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులు మరో వ్యక్తితో కలిసి కారులు సంచరిస్తున్నట్లు వారు ఎక్కడైనా బాంబుదాడికి లేదా ఆత్మాహుతి దాడికి తెగబడే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు.

04/06/2016 - 16:25

ముంబయి: ముంబయితో పాటు మహారాష్టల్రోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరత ఉండగా ఐపిఎల్ మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్ పిచ్‌లను తడిపేందుకు భారీగా నీటిని వృథా చేయడం సరికాదని ముంబయి హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి ఎద్దడి లేని చోట మ్యాచ్‌లు నిర్వహించుకోవాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కు కోర్టు సూచించింది.

04/06/2016 - 16:23

ముంబయి: తమ కుమర్తె జీవితాన్ని నాశనం చేసిన బోయ్‌ఫ్రెండ్ రాహుల్‌ను ఉరితీయాలని లేదా జీవితాంతం జైల్లో పెట్టాలని ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి ప్రత్యూష తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యూష ఆత్మశాంతి కోసం బుధవారం ప్రార్ధనలు జరిపిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. డబ్బు కోసం ప్రత్యూషను శారీరకంగా, మానసికంగా వేధించి చివరికి ఆమె ఆత్మహత్యకు రాహుల్ కారకుడయ్యాడని వారు తెలిపారు.

04/06/2016 - 14:13

ముంబయి: ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి ప్రత్యూష (బాలికా వధు ఫేమ్)ను ఆమె బోయ్‌ఫ్రెండ్ రాహుల్ శారీరక, మానసిక వేధింపులకు గురిచేసేవాడని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు నమోదు చేశారు. ప్రత్యూష తల్లి ఇచ్చిన తాజా ఫిర్యాదుపై కేసు నమోదు చేశాక రాహుల్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు వేచి చూస్తున్నారు. అనారోగ్యానికి లోనైన రాహుల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

04/06/2016 - 14:12

దిల్లీ: శ్రీనగర్‌లోని ఎన్‌ఐటిలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేడు భారత్‌లో విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలే విద్యాసంస్థల్లో మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని ఆయన ఆరోపించారు.

04/06/2016 - 14:12

ముంబయి: 2002, 2003 సంవత్సరాల్లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 12 మంది మరణానికి కారకులైన వారిలో అన్సారీ, వాహిబ్, ఫర్షాన్ అనే నిందితులకు ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. మరో ముగ్గురికి పదేసి ఏళ్ల చొప్పున జైలుశిక్ష వేశారు. మొత్తం పదిమంది నిందితుల్లో ఆరుగురికి శిక్షలు ఖరారు చేయగా, మిగతా నలుగురినీ విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

04/06/2016 - 12:19

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరి రెండురోజులు కాకముందే అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. ముఖ్యమంత్రి మెహబూబా తనకు ప్రాధాన్యత లేని సాంఘిక సంక్షేమ శాఖ కేటాయించారని నిరసన వ్యక్తం చేస్తూ పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన మంత్రి సజ్జాద్ ఘనీ బుధవారం రాజీనామా చేశారు. తనకు కీలకమైన వైద్య శాఖ దక్కుతుందని ఆశించి తీరని నిరాశకు గురైనట్లు ఆయన చెబుతున్నారు.

Pages