జాతీయ వార్తలు

హైదరాబాద్ హైకోర్టుకు సురేష్ కుమార్ ఖేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: రాష్టప్రతి ప్రణబ్ ఆదేశాల మేరకు ఢిల్లీ, గుజరాత్ హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించిన అనంతరమే బదిలీలు జరిగాయ. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ కుమార్ ఖేట్ హైదరాబాద్‌లోని జుడికేచర్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆయన సేవలందజేస్తారని రాష్టప్రతి ఆదేశంలో పేర్కొన్నారు. న్యాయమూర్తి ఖేట్ ఏప్రిల్ పదిహేనులోగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి రాజీవ్ షక్దేర్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. గుజరాత్ హైకోర్టు అదనపు న్యాయమూర్తి కౌషల్ జయేంద్ర థకేర్‌ను అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. ఈ ఇద్దరు న్యాయమూర్తులూ ఏప్రిల్ 15 లోపు పదవీ బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది.