S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/14/2016 - 08:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: రాష్ట్రంలో నెలకొన్న కరువును ఎదుర్కొనేందుకు నిధులు కోరుతున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆరు జిల్లాల కలెక్టర్ల వద్ద పడి ఉన్న రూ. 315 కోట్లను ఎందుకు ఖర్చు చేయలేదని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది.

04/14/2016 - 07:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: భయాందోళనల మధ్య తాము శ్రీనగర్ నిట్‌లో చదువుకోలేమని తెలుగు విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం శ్రీనగర్ నుంచి ఇక్కడికి చేరుకున్న విద్యార్థులు జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. శ్రీనగర్ నిట్‌లో తమకు రక్షణ లేదని, అక్కడ చదువుకోలేమని తెలిపారు. ఈ నిట్ కేంద్రాన్ని నిట్‌ను జమ్ముకు తరలించాలని, లేని పక్షంలో మరో క్యాంపస్‌కు మారేందుకు తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

04/14/2016 - 07:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెరిగే తమ వేతనంలో కొంత భాగాన్ని ఉద్యోగులు ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడుల పునర్వ్యవస్థీకరణకోసం ఉపయోగించే ఓ నిధిలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించే ఓ పథకం రూపకల్పనకు ప్రభుత్వం యోచిస్తోంది.

04/14/2016 - 07:26

శ్రీనగర్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కాశ్మీర్‌లో ఆందోళనలు చల్లారకపోగా తాజాగా బుధవారం ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో మరో యువకుడు మృతి చెందడంతో పరిస్థితి మరింత దిగజారింది. మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లోని హంద్వారా పట్టణంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు, ఒక మహిళ మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే.

04/14/2016 - 07:24

నందన్‌ఘాట్, ఏప్రిల్ 13: బిజెపి హిందుత్వాన్ని రెచ్చగొడుతూ శాంతియుత వాతావరణాన్ని పాడుచేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మతతత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పోకడలను ఉపేక్షించబోమని ఆమె హెచ్చరించారు. ‘సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్డడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. మత రాజకీయాలు చేస్తూ ఉద్రిక్తతలు పెంచుతోంది’ అని ఆమె ఆరోపించారు.

04/14/2016 - 07:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అమెరికాతో మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న లాజిస్టిక్స్ సపోర్ట్ ఒప్పందం ఒప్పందం ప్రమాదకరమైనదని, భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానానికి విఘాతమని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.

04/14/2016 - 07:22

కొల్లాం, ఏప్రిల్ 13: కూలిపోయిన ఇళ్ల్లు.. కలుషితమైన నీళ్ల్లు.. రసాయనాలు కలిసిపోయిన పదార్థాల అవశేషాల దుర్గంధాలు, పేరుకుపోయిన కాంక్రీట్ చెత్త.. పుట్టింగల్ దేవి ఆలయంలో 113 మందిని పొట్టన పెట్టుకున్న దుర్ఘటన కొల్లాం ప్రజలకు మిగిల్చిన విషాదమిది. ఆలయ పరిసరాల్లో చాలా కుటుంబాలు ఈ దుర్ఘటన తరువాత బంధువుల ఇళ్లకు వలసవెళ్లాయి. ఎక్కడికీ వెళ్లలేని వారు మాత్రం తమ ఇళ్లను మరమ్మతు చేసుకునే పనిలో పడ్డారు.

04/14/2016 - 07:21

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: సమన్లు జారీ చేసినప్పటికీ గత సోమవారం తన ఎదుట హాజరు కానందుకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ కార్యదర్శి సునీల్ అరోరాపై బెయిలుకు అవకాశం ఉండే అరెస్టు వారెంటు జారీ చేయాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.

04/14/2016 - 06:20

సుజాపూర్, ఏప్రిల్ 13: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మమతా బెనర్జీ ప్రభుత్వం గాలికొదిలేసిందని సోనియా ఆరోపించారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల్లో ఎక్కువ పశ్చిమ బెంగాల్‌లోనే చోటుచేసుకున్నాయి’ అని విరుచుకుపడ్డారు.

04/14/2016 - 04:27

ముంబయి, ఏప్రిల్ 13: ఈనెల 30 తరువాత మహారాష్టల్రో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించరాదని బిసిసిఐకు బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మహారాష్టల్రో కరవు తాండవిస్తున్న కారణంగా మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు బిసిసిఐని ఆదేశించింది. ఈనెల 30లోగా జరగాల్సిన మ్యాచ్‌లను నిర్వహించుకోవచ్చని అనుమతించింది.

Pages