-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
పత్తికొండ, మార్చి 22:స్థానిక ఏపీఆర్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న మద్దికెర గ్రామానికి చెందిన తరుణ్కుమార్(13) గురువారం పాఠశాల సమీపంలోని బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న తండ్రి రామాంజినేయులు, తల్లి హైమావతి హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకుని బోరున విలపించారు.
జంగారెడ్డిగూడెం, మార్చి22: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరిపై నుండి గురువారం కిందికి దిగుతూ అదుపుతప్పిన ఆటో గోడను ఢీకొని బోల్తా పడటంతో ఒక మహిళ మృతి చెందగా 11 మంది గాయాలపాలయ్యారు. పారిజాతగిరి కొండపైకి గల సీసీ రోడ్డులో తిరుగు ప్రయాణంలో పారిజాతగిరి టౌన్లో ప్రాణాలను హరిస్తూ మృత్యుమలుపుగా మారిపోయింది. ఇదే ప్రదేశంలో 2015 నవంబర్ 7న జరిగిన ఆటో ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృత్యువాత పడ్డారు.
అల్లాదుర్గం, మార్చి 22: వ్యవసాయ సాగు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం, మరో వైపు భార్య అనారోగ్యానికి గురికావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ రైతు గుండె ఆగిపోయింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై వివరాలిలా ఉన్నాయి... అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సీతానగర్ గ్రామానికి చెందిన బోరంచ శంకరయ్య (37) గుండెపోటుతో మృతి చెందారు.
పెబ్బేరు, మార్చి22: 44 జాతీయ రహదారి పెబ్బేరు సమీపంలో బాలాజీ దాబా దగ్గర జరిగిన కారు ప్రమాదంలో డాక్టర్ గిరిజ హైదరాబాద్ నుండి కర్నూల్ వైపు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఐ ఓడి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం హైదరాబాద్ నుండి ఏపి 9బి ఆర్ 9091 కారులో వెళ్తుండగా అదుపు తప్పి వేగంగా డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టి రోడ్డు అవతల హైదరాబాద్ వెళ్ళే రోడ్డుపై పడింది.
బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 22 : స్థానిక కెనరా బ్యాంకు ఏటీఎంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నించారు. అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడిన దొంగలు సీసీ కెమెరాల దిశ మార్చి ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు. అయినప్పటికీ ఏటీఎం యంత్రం తెరుచుకోకపోవడంతో అసహనానికి గురై యంత్రాన్ని వెలుపలకి తీసుకొచ్చి విఫలయత్నం చేశారు. బయటే ఏటీఎం యంత్రాన్ని వదిలి వెళ్లినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు.
పీలేరు, మార్చి 22: మండల పరిధిలోని రేగల్లు గ్రామం బోయపల్లెలో ఈనెల 15న జరిగిన మహిళ హత్యకేసులో ఆమె భర్తను అరెస్టు చేసినట్లు సీఐ వేణుగోపాల్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోయపల్లెలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం తన భార్య పార్వతమ్మ గత కొంతకాలంగా కువైట్కు వెళ్లి తిరిగి వచ్చింది.
చక్రాయపేట, మార్చి 22: లైసెన్సులు లేని అక్రమ వాహనాల యజమానులు 20 మందిపై కేసు నమోదు చేసి రూ.7 వేలు జరిమానా వేసినట్లు ఎస్ఐ గోవిందరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని రాయచోటి-వేంపల్లె ప్రధాన రహదారిలో లైసెన్సు, ఆర్సీ, హెల్మెట్ లేని అక్రమ వాహనాలపై జరిమానా వేయడంతో పాటు అక్కడ మద్యం తాగి వాహనాలు నడుపుతున్న యజమానులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
సంబేపల్లె, మార్చి 22: సంబేపల్లె మండల పరిధిలో గతనెల 23వ తేదీన మద్యం సేవించి వాహనం నడిపిన ఓ వ్యక్తికి గురువారం రాయచోటి సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ రెడ్డికుమార్ 8 రోజులు జైలుశిక్ష విధించినట్లు ఎస్ఐ సయ్యద్హషం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 23వ తేదీన వాహనాల తనిఖీలో భాగంగా రాయచోటి పట్టణం కొత్తపల్లెకు చెందిన షేక్ జాఫర్ మద్యం సేవించి వాహనం నడిపాడన్నారు.
రాయచోటి, మార్చి 22: పట్టణంలోని ఎస్ఎన్ కాలనీకి చెందిన హరీష్కుమార్(25) అనే విద్యార్థి గురువారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్ఎన్ కాలనీకి చెందిన హరీష్కుమార్ గత రెండు సంవత్సరాల కిందట బీటెక్ చదువు పూర్తయినట్లు తెలిపారు.
వీరబల్లి, మార్చి 22: మండల పరిధిలోని వంగిమళ్ల గ్రామ పంచాయతీలోని కావలిగడ్డకు చెందిన నందిని(25) భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక బుధవారం రాత్రి సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. వివరాల్లోకెళ్తే.....