-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ప్రతాప్గఢ్, మార్చి 23: ఉత్తరప్రదేశ్లోని వారణాసి- లక్నో జాతీయ రహదారి శుక్రవారం రక్తసిక్తమైంది. టెం పో, ట్రక్ ఢీకొన్న దుర్ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిది మంది మహిళలున్నారని పోలీసులు తెలిపారు. ప్రమా దం ఫతేన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిందని ఏఎస్పీ(ఈస్ట్) రాకేష్ సింగ్ వెల్లడించారు. ఇద్దరు మహిళలు సంఘటనా స్థలంలోనే చనిపోయారని ఆయన అ న్నారు.
ముంబయి, మార్చి 23: ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ జీనత్ అమన్పై లైంగికదాడి, చీటింగ్కు పాల్పడిన ముం బయి వ్యాపారవేత్త సర్ఫరాజ్ అలియాస్ అమన్ ఖన్నాను పోలీసులు అరెస్టు చేశారు. జీనిత్ ఫిర్యాదును నమోదు చేసుకుని గురువారం రాత్రి ఖన్నాను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. తనపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా రూ.15 కోట్లు కాజేశాడని జీనత్ తన ఫిర్యాదులో పేర్కొంది.
న్యూఢిల్లీ, మార్చి 23: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు నిబంధనల ఉల్లంఘనలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తు దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. గతంలోఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా శుక్రవారం జస్టిస్ మదన్ బీ లోకూర్ , జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
న్యూఢిల్లీ, మార్చి 23:జంట పదవుల కేసులో ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఊరట లభించింది. లాభదాయక పదవుల్లో ఉన్నారన్న ఆరోపణపై అనర్హత వేటుకు గురైన 20మంది సభ్యత్వాలనూ పునరుద్ధరిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ ఎన్నికల కమిషన్ సిఫార్సు చేయడాన్ని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్నీ సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.
సూర్యాపేట, మార్చి 23: పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్ క్రిమిసంహరక మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో చోటుచేసుకుంది. ఈసంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
మిర్యాలగూడ టౌన్, మార్చి 23: మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్నగర్కు చెందిన అంగోతు సునీత అనే బాలింత తన కవల ఆడపిల్లలను విక్రయించిన, కొన్న కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశామని స్థానిక డీఎస్పీ పద్మనాధుల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత జనవరి 11న మిర్యాలగూడలోని సాహితి హాస్పిటల్లో సునీతకు కవల ఆడపిల్లలు పుట్టారు.
గూడూరు టౌన్, మార్చి 23: జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా నేరపరిశోధన ఓఎస్డీ విఠలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది మూడుప్రాంతాల్లో ఏకకాలంలో ఎర్రచందనం స్మగ్లర్లపై దాడులు నిర్వహించి ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వెంకటాచలం, చిల్లకూరు, నాయుడుపేట ఎస్సైలు నాగరాజు, శ్రీనివాసరావు, రవినాయక్లు ఈ దాడుల్లో పాల్గొన్నారు.
నెల్లూరు కలెక్టరేట్, మార్చి 23: చింతారెడ్డిపాళెం అడ్డరోడ్డు కూడలి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. చింతారెడ్డిపాళెం జాతీయ రహదారి అడ్డరోడ్డు కూడలి వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, చింతారెడ్డిపాళెంకు చెందిన సన్నీ తన ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా మొదట బైక్ను కారు ఢీకొంది.
నెల్లూరు, మార్చి 23: పోలీసుల ముసుగులో సంచరిస్తూ పలు నేరాలకు పాల్పడిన నకిలీ పోలీసు ముఠాను శుక్రవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ సొత్తు రూ.3 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీసీఎస్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ బాలసుందరరావు వివరాలు వెల్లడించారు.
షాద్నగర్ రూరల్, మార్చి 23: ఇంట్లో నిద్రిస్తున్న ఒంటరి మహిళపై యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన పట్టణంలోని సీఎస్కే వెంచర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. షాద్నగర్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మహిళ (45)పై నాగార్జున అనే వ్యక్తితోపాటు ముగ్గురు స్నేహితులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు.