S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/23/2018 - 23:28

కల్లూరు, మార్చి 23:మండల పరిదిలోని పెద్దటేకూరు గ్రామం సమీపంలో జాతీయ రహదారి-44పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. మండల పరిధిలోని ఉలిందకొండ గ్రామానికి చెందిన రంగారెడ్డి(57) తెల్లవారుజామున టాటా మ్యాజిక్ వాహనంలో సపోట పండ్లు లోడ్ చేసుకుని కర్నూలుకు బయల్దేరాడు.

03/23/2018 - 23:23

కంభం, మార్చి 23: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కంభంలోని కాపువీధిలో శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఎ కృష్ణప్రసాద్ (30) మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కంభం ఎస్సై రామానాయక్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

03/23/2018 - 23:22

మహబూబ్‌నగర్, మార్చి 23: మహబూబ్‌నగర్ పట్టణంలోని శివశక్తినగర్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ రవి(27) ఉరివేసుకుని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుశాఖలో ఫింగర్‌ప్రింట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రవి ఆత్మహత్య చేసుకోవడం జిల్లా పోలీసుల్లో కలకలం రేపింది. అయితే రవి భార్య రంజిత గురువారం ఆత్మహత్య చేసుకోగా రవి శుక్రవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

03/23/2018 - 23:16

పెనుమూరు, మార్చి 23: జిల్లాలోని పలు గ్రామాల్లో ద్విచక్రవాహనాలు, పొట్టేళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠాను పెనుమూరు పోలీసులు, ఐడి పార్టీ బృందం శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పాకాల సీఐ రామలింగయ్య కథనం మేరకు వివరాలు. ఐదు నెలలుగా జిల్లాలోని పలమనేరు, చంద్రగిరి, పాకాల, పూతలపట్టు, పెనుమూరు, ఎంఆర్‌పల్లి, కల్లూరు ప్రాంతాల్లోని ఈ 9 మంది దొంగలు పతకం ప్రకారం గ్రామాల్లో సంచరిస్తారు.

03/23/2018 - 23:12

తిరువూరు, మార్చి 23: తిరువూరు శివారు పీటి కొత్తూరులో శుక్రవారం ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు చెరువులోపడి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం పీటి కొత్తూరు సమీపంలోని దేవసముద్రం చెరువు సమీపంలో రమణ, పావనీల కుమారుడు లోకేష్ (8), నెల్లూరి వెంకయ్య, రమాదేవిల కుమారుడు చక్రవర్తి(10) మధ్యాహ్నం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులోపడి ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయారు.

03/23/2018 - 23:08

నంగునూరు, మార్చి 23: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన నంగునూరు మండల ఒబులాపూర్ గ్రామంలో జరిగింది. రూరల్ సిఐ సైదులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మహమ్మద్ అమిరలి 45, టీవిఎస్ సుజుకి ఏపి 10 ఎన్ 6288 నంబరు గల బైక్ పై స్నేహితుమైన బస్వరాజు రాజు 35 తో కలిసి పాలమాకులకు వెలుతున్న క్రమంలో రోడ్డు ప్రక్కన ఉన్న వాటర్ ట్యాంకును గమనించక ట్యాంకరుకు ఢీకొట్టారు.

03/23/2018 - 23:07

పాతబస్తీ, మార్చి 23: కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యంత దయనీయ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాహ్మణ వీధి పాత పోస్ట్ఫాసు సెంటరు కొండ ప్రాంతంలో నివాసముంటున్న గూడూరు కృష్ణ (55), వెంకట సత్యవతి (50) శుక్రవారం ఉదయం ఒకే సీలింగు ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. తొలుత భర్త లుంగీతో ఉరేసుకోగా భార్య గమనించింది. వేలాడుతున్న కృష్ణను లుంగీని కత్తిరించి కాపాడటానికి ప్రయత్నించింది.

03/24/2018 - 03:30

మధిర, మార్చి 23: రైలు కిందపడి బుర్రి ధనలక్ష్మి(20) అనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం తూనికిపాడు గ్రామానికి చెందిన ధనలక్ష్మి మధిరలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. .

03/23/2018 - 22:54

ఆకివీడు, మార్చి 23: రైలు నుండి జారిపడింది...మృత్యువుతో పోరాడింది... చివరకు ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే భీమవరం గ్రామానికి చెందిన యువతి తెల్లవార్లు మృత్యువుతో పోరాడి గాయాలతో బయటపడింది. భీమవరం గ్రామానికి చెందిన జయంతి రాజేశ్వరి (21) గురువారం విజయవాడకు వెళ్లింది. అయితే రాత్రి తిరిగి ఇంటికి తిరుగు ముఖం పట్టింది. గురువారం సాయంత్రం విజయవాడ నుండి బయల్దేరి భీమవరం బయల్దేరింది.

03/23/2018 - 22:40

పుల్లంపేట, మార్చి 23: క్షణికావేశం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. తనకు బైక్ కొన్విమని మండలంలోని కోనయ్యగారిపల్లెలో బైక్‌కొని ఇవ్వమని పవన్‌చైతన్యకుమార్‌రెడ్డి తల్లి రవికుమారిని కోరగా ఆ తల్లి తనకు అంతస్థోమత లేదని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కొడుకు వెంటనే పురుగుల మందు తాగాడు. అదిచూసి భయపడి తన కొడుకు మరణిస్తాడని అవేదనతో రవికుమార్ ఇంట్లో వాస్‌మాల్ 33 తాగింది.

Pages