S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/20/2019 - 02:28

లండన్, అక్టోబర్ 19: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్‌ను విడదీసేందుకు ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చేసిన ప్రయత్నాలకు చుక్కెదురైంది. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు 37 సంవత్సరాల తర్వాత బ్రిటన్ పార్లమెంటు శనివారం సమావేశమైనా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఐరోపాయ యూనియన్‌తో బోరీస్ జాన్సన్ కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని వాయిదా వేయడానికే ఎంపీలు మొగ్గు చూపారు.

10/18/2019 - 22:42

మనీలా, అక్టోబర్ 18: భారత్, ఫిలిప్పీన్స్ మధ్య శుక్రవారం ఇక్కడ రక్షణకు సంబంధించి నాలుగు కీలకమైన ఒప్పందాలు జరిగాయి. రక్షణ, నౌకాయాన భద్రత భాగస్వామ్యం, ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయాలని ఇరుదేశాలు ప్రతిజ్ఞ చేశాయి.

10/18/2019 - 22:41

వాషింగ్టన్, అక్టోబర్ 18: దేశంలో అభివృద్ధి వేగంగానే దూసుకెళుతున్నదని, ఇందులో అనుమానాలకు తావులేదని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.

10/18/2019 - 22:31

అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా సరిహద్దులు దాటి మెక్సికోలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. వెనక్కి వచ్చేసిన భారతీయులు శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాస్‌పోర్టులను చూపిస్తున్న దృశ్యం

10/18/2019 - 22:24

ఇస్లామాబాద్, అక్టోబర్ 18: కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన అక్కసును చాటుకున్నారు. 370-అధికరణ రద్దును మరోసారి తప్పుపట్టిన ఆయన రాష్ట్రంలో అమలవుతున్న ఆంక్షలను ఎత్తివేసిన మరుక్షణమే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు.

10/18/2019 - 22:22

పారిస్, అక్టోబర్ 18: తీవ్రమైన ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కొనే పరిస్థితి నుంచి పాకిస్తాన్ తాత్కాలికంగా బయటపడింది. పారిస్ కేంద్రంగా పని చేస్తున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఐదు రోజుల ప్లీనరీలో పాక్ పట్ల కొంత ఉదారంగా వ్యవహరించింది. లష్కరే తోయిగా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు పాక్ సర్కారు ఆర్థిక సాయం చేస్తున్నదన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.

10/18/2019 - 02:08

వాషింగ్టన్‌లో జరిగిన అంతర్జాతీయ ఇనె్వస్టర్ల సదస్సులో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయంలో ఈ సదస్సు జరిగింది

10/17/2019 - 22:46

*చిత్రం...గురువారం పిలిప్పిన్స్ రాజధాని మనీలాకు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ దంపతులకు స్వాగతం పలుకుతున్న ఉన్నతాధికారులు

10/17/2019 - 22:37

ఇస్లామాబాద్, అక్టోబర్ 17: నదీ జలాలను తమ దేశంలోకి రానివ్వకుండా భారత్ అడ్డుకొని, వాటిని మళ్లిస్తే, ఆ చర్యను దాడిగా పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పశ్చిమాన ప్రవహిస్తున్న నదులపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని పేర్కొంది. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మోదీ హిమాలయాల నుంచి నదీ జలాలు పాకిస్తాన్‌కు వెళ్లకుండా చేస్తామని హెచ్చరించడంపై పాక్ తీవ్రంగా స్పందించింది.

10/17/2019 - 04:28

శాన్‌ఫ్రాన్సిస్కో : భారత సంతతికి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ తన కారులో శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో మరో ముగ్గుర్ని కూడా హతమార్చినట్టు 53 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ చెప్పడం పోలీసులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.

Pages