S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/01/2019 - 05:28

బీజింగ్, నవంబర్ 30: ఈ శతాబ్దం ఆసియా ఖండానికి సొంతం కావాలంటే భారత్-చైనా ప్రాంతీయంగాను, అంతర్జాతీయంగాను బలమైన సహకార బంధాన్ని కొనసాగించాల్సి ఉంటుందని మేధావుల ఫోరం స్పష్టం చేసింది. కేవలం వ్యాపార, వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా అత్యధిక జనాభా కలిగిన ఈ రెండు దేశాలు బహుముఖీయ రీతిలో మైత్రిని విస్తరించుకోవాలని, అప్పుడే ఈ శతాబ్ది ఆసియాకు సొంతం అవుతుందని ఈ ఫోరం తెలిపింది.

11/29/2019 - 05:37

ఐక్యరాజ్య సమితి, నవంబర్ 28: ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రవాసులుగా ఉంటున్న వారిలో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఐక్యరాజ్య సమితి (యూఎన్) నివేదక స్పష్టం చేసింది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, 17.5 మిలియన్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో ఉన్నారు. ఈ ఏడాది సుమారుగా 27 కోట్ల మంది ఇతర దేశాలకు వెళ్లారు.

11/29/2019 - 05:35

వాషింగ్టన్: అమెరికాలో కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డు కోసం 2,27,00 మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. చట్టపరమైన శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డు కచ్చితంగా ఉండాలి. తాజా లెక్కల ప్రకారం అన్ని దేశాల నుంచి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారి సంఖ్య ఏకంగా 40 లక్షల మందిపైమాటే. వారందూ ఇంతకు ముందే అమెరికాలో స్థిరపడిపోయిన ఎన్నారైల కుటుంబాలే కావడం గమనార్హం.

11/28/2019 - 04:44

వాషింగ్టన్, నవంబర్ 27: అమాయకులయిన 166 మందిని బలిగొనడంతో పాటు వారి కుటుంబాలను, ఆప్తులను శోకసంద్రంలో ముంచిన 2008 నాటి ముంబయిపై ఉగ్రవాద దాడికి బాధ్యులయిన కుట్రదారులకు ఇప్పటికీ శిక్ష పడకపోవడం బాధితులకు అవమానకరమని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మైక్ పోంపియో పేర్కొన్నారు. 2008 నవంబర్ 26న ముంబ యి నగరంపై జరిగిన దాడి భారత దేశ చరిత్రలోనే అత్యంత భయంకరమయిన దాడులలో ఒకటిగా నిలిచిపోయింది.

11/28/2019 - 04:42

కొలంబో, నవంబర్ 27: శ్రీలంక క్రికెట్‌లో ప్రఖ్యాత, లెజెండరీ స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్‌కు అరుదైన గౌరవం లభించింది. శ్రీలంక ఉత్తర ప్రావిన్స్‌కు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాలని అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ప్రత్యేకంగా ఆహ్వానించారు. 47 సంవత్సరాల మురళీధరన్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (800) తీసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన సంగతి క్రికెట్ అభిమానులకు తెలిసిందే.

11/28/2019 - 04:39

బీజింగ్, నవంబర్ 27: చైనా ప్రభుత్వం జీవావరణ, పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. 2020 నాటికి కార్బన్ ఉద్ఘారాలను తగ్గించాలన్న లక్ష్యంతో కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు పర్యావవరణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసింది. కార్బన్ ఉద్ఘారాలు తగ్గించేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 2005తో పోల్చుకుంటే తీవ్రత బాగా తగ్గింది.

11/28/2019 - 02:25

వాషింగ్టన్, నవంబర్ 27: అఫ్గనిస్తాన్‌లోని కాబుల్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం (యుఎన్‌డిపీ)లో పని చేస్తున్న భారత సంతతికి చెందిన అమెరికన్ యుఎన్‌డీపీ నిపుణుడు అనిల్ రాజ్‌ను పొట్టన పెట్టుకున్నారు. కాలిఫొర్నియాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న అనిల్ రాజ్ అఫ్గనిస్తాన్‌లోని కాబుల్‌లో యుఎన్‌డిపీలో ఉద్యోగం చేస్తున్నాడు.

11/28/2019 - 02:20

ఖాట్మాండు: నేపాల్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. అర్గకాచి జిల్లాలో బుటావాల్ నగరం వైపు వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 8 మంది మహిళలు సహా 17 మంది మృతి చెందారని, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. సాంధిక్కార లోయ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

11/24/2019 - 23:59

నాగసకి, నవంబర్ 24: అణ్వాయుధాలకు పూర్తిగా స్వస్తి పలకాలని పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఊరేగింపులో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోప్ ప్రసంగిస్తూ అణ్వాయుధాలు కలిగి ఉండడం కూడా నేరమని వ్యాఖ్యానించారు. అణ్వాయుధాల వల్ల కలిగే అనర్థాల గురించి చెబుతూ గత సంఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

11/20/2019 - 05:26

కొలంబో, నవంబర్ 19: భారత్‌తో సన్నిహిత సంబంధాలను శ్రీలంక కొత్త అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష కొనసాగించే అవకాశం ఉంటుందని, అలాగే చైనాతో ఆర్థిక లావాదేవీలను కొనసాగించే విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 13 లక్షల మెజారిటీతో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రాజపక్ష దేశాధినేతగా ఎన్నిక కావడం భారత్‌కు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని వీరు విశే్లషించారు.

Pages