S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/21/2018 - 22:17

రక్తపాత విప్లవాలకు కాలం చెల్లింది. జ్ఞాన విప్లవాలకు ఆదరణ కనిపిస్తోంది. ప్రజలు పెద్దఎత్తున అందులో భాగస్వాములవుతున్నారు. ఇది ఈ కాలపు విశిష్టత. తాజాగా ఐటి, టెలికమ్యూనికేషన్ రంగాల్లో, విద్య-వైద్యంలో ఈ విప్లవాల ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రంగాలన్నీ పరస్పర పూరకాలుగా, ఒకదానిపై ఒకటి ఆధారపడి ముందుకు వెళుతున్నాయి. ఈ విషయమై, ప్రపంచంలోని అన్ని దేశాలు పోటీపడుతున్నాయి.

07/20/2018 - 23:45

రాముడిపైన సీతపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌పై ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించి ఆయన స్వంత జిల్లా చిత్తూరు పంపారు. ఎవరైనా ఒక వ్యక్తి జాతీయ పురుషుడిపైన అనుచితమైన వ్యాఖ్యలుచేస్తే వారికి నగర బహిష్కరణ శిక్ష వేస్తే సరిపోతుందా? అదే కనుక న్యాయం అయ్యేటట్లైతే మన న్యాయస్థానాల చట్టాల పరిస్థితి ఏమిటి?

07/19/2018 - 22:54

పాఠశాల ఒక వ్యవస్థ. దాని పని విధానం చెట్టుకున్న బెండు వంటిది. అది కాలానుగుణంగా మారుతుంటుంది. అది వడ్డించిన విస్తరి కాదు. దానిలో ఉండే వ్యక్తులు చేసే పని నిర్ధారణ చేస్తుంది. పాలసీలు, రూల్స్ సమస్యలను పరిష్కరించవు.దానిలో పనిచేసే మనుషుల ఆలోచనా విధానమే సమస్యల సృష్టికి, పరిష్కారానికి కారణం. రూల్స్‌ను మార్చే ముందు అక్కడి వ్యక్తులతో కలిసి మాట్లాడి ఏకాభిప్రాయాలు తీసుకొచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి.

07/17/2018 - 22:28

కాలం చెల్లిన మార్క్స్ సిద్ధాంతాన్ని అత్యున్నత శిఖరంపై చూడాలనుకునే రచయిత్రి రంగనాయకమ్మ స్వాప్నికురాలు, అమాయకురాలు.. మార్క్సిజం ‘బలిపీఠం’ ఎక్కడం ఏ మాత్రం సహించని సంప్రదాయ మార్క్సిస్టు ఆమె. సాంకేతిక పరిజ్ఞానం శ్రామికుల ముంగిళ్లలో నర్తనమాడుతున్నా ఆమె పాతకాలపు సమీకరణలనే వల్లెవేస్తున్నారు. మార్క్సిజంపై ఈగ వాలనీయకుండా ఆమె ఇటీవల చేస్తున్న రచనలు చూస్తే ఈ అభిప్రాయమే కలుగుతుంది.

07/16/2018 - 22:16

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తన సొంత గూడు అయిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరడం వింతేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ నేతృత్వంలో రాహుల్ గాంధీ సమక్షంలో కిరణ్ ‘స్వగృహప్రవేశం’ లాంఛనంగా పూర్తయ్యింది.

07/13/2018 - 22:54

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) హిందూ మతతత్వ సంస్థ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే ఆరోపణలు సంధించడం సరికాదు. ప్రధాని నరేంద్ర మోదీ ‘సంఘ్’ భావజాలాన్ని అమలు చేస్తున్నారని, బడుగు వర్గాలను, మైనారిటీ మతస్థులను నిర్లక్ష్యం చేస్తున్నారని రాహు ల్ అభియోగం మోపడం అర్థరహితం.

07/11/2018 - 02:14

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలో సైతం హోరెత్తేవిధంగా ప్రైవేట్ పాఠశాలల ప్రచార కార్యక్రమం ఉధృతంగా సాగుతున్నది. నేటి విద్యా విధానాన్ని చదువు‘కొంటున్న దుస్థితి’గా పేర్కొనవచ్చు. ఇంకా... నేటి విద్యా వ్యవస్థ దోపిడీ వ్యవస్థ, మాఫియా వ్యవస్థ అని కూడా చెప్పవచ్చు.

07/07/2018 - 00:44

వచ్చే ఏడాది ఆరంభంలో లోక్‌సభకు ఎలాగూ ఎన్నికలు తప్పవు. కాని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలు ఒకేసారా? విడివిడిగానా? అనేదానిపై ఇంకా స్పష్టత ఏర్పడలేదు. ప్రధాని మోదీ తప్పుకోవాల్సిందే అంటూ ఇటీవల కర్ణాటకలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఐక్యతను చూపిన నాయకగణం డిమాండ్ చేస్తోంది.

07/05/2018 - 23:47

శసేవలో ప్రాణాలు కోల్పోయిన నేతల్ని వేళ్ల మీద లెక్కించవచ్చు. అటువంటి అద్భుతమైన మహా నాయకుల్లో డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఒకరు. వ్యక్తిగత ప్రతిష్టకన్నా దేశహితమే ప్రధానమన్నది ఆ యన విధానం. భారత్ నుంచి జమ్ము-కాశ్మీర్ చేజారిపోకుండా ఉంచటంలో ఆయన చూపిన చొరవ జాతి గుర్తించుకోదగినది. చివరకు కాశ్మీర్ అంశంపై పోరాటంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

07/03/2018 - 23:40

ఇటీవల మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ ‘పాలకులు-విప్లవోద్యమం’పై ఓ వ్యాసం రాస్తూ- ‘సైనిక దాడులను ముమ్మరం చేస్తున్నారు.. భారత వాయుసేన, తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ కమాండ్ బలగాలు కలిసి దాడి చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. ‘హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తూ వివిధ రూపాలలో ఆకాశదాడులు చేస్తున్నారు.

Pages