S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/12/2018 - 00:23

మనిషి తన కనీస అవసరాలు తీర్చుకోవడంలో విజయం సాధించాడే కాని కుటుంబ, సామాజిక, దేశ సంబంధ సమస్యలు అతడిని వేధిస్తూనే ఉన్నాయి. మానవ సమాజం నేడు ఎదుర్కొంటున్న సవాళ్లలో పర్యావరణ సమస్య ప్రధానమైనది. ఆధునిక యుగంలో పలురకాల వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఎక్కువ వనరులను వినిమయం చేయడం పరిపాటిగా మారింది. వస్తు ఉత్పత్తితోపాటు కాలుష్యం కూడా అంతేస్థాయిలో పెరుగుతోంది. ‘నేడు ప్రపంచం సమస్య టెర్రరిజం కాదు..

05/11/2018 - 00:24

తరగతి గది ప్రధానంగా మూడు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీనిలో ఏది కొరత ఉన్నా తరగతి గది క్రుంగిపోతుంది. అవి.. 1.బోధన 2.లెర్నింగ్ 3.సామాజిక కార్యక్రమాలు. ఈ మూడు కార్యక్రమాలు తీవ్రమైన మార్పులకు గురవుతున్నాయి. ఒకనాడు ఉపాధ్యాయునికి సుద్దముక్క, మాట్లాడటం (జాక్ అండ్ టాక్) ఉండేది. ఈనాడు బోధనా ప్రక్రియలో ఎన్నో ఉపకరణాలు వచ్చాయి. ఒకప్పుడు ప్రీ డైమన్షన్ లెక్క చెప్పాలంటే తలకిందులయ్యే వాళ్లం.

05/09/2018 - 00:05

స్వతంత్ర భారతావని 75 ఏళ్ల వేడుక సందర్భం నాటికి అంటే- 2022 కల్లా అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేసే సత్సంకల్పానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుంది. రైతాంగం రుణభారంతో, గిట్టుబాటు ధర లేకుండా నిరాశా నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడే అవాంఛనీయ విపత్కరతను పారద్రోలటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఆలోచిస్తున్నాయి.

05/08/2018 - 00:02

ఈ అనంత విశ్వంలో జీవ వైవిధ్యం ఉనికిని ఒక్క భూమిపై మాత్రమే చూస్తాం. మానవజాతి మాత్రమే కాదు, వివిధ రకాల వృక్షాలు, జంతుజాలం, జలచరాలు, పక్షులు, క్రిమికీటకాదుల మనుగడకు ఈ భూమియే ఏకైక ఆధారం. ఆధునికత, శాస్త్ర సాంకేతిక ప్రగతి పేరుతో మానవుడు సాగిస్తున్న వికృత విధ్వంస కేళి మానవజాతి మనుగడకే ప్రమాదకారిగా పరిణమిస్తున్నది. సకల ప్రాణికోటికీ మరణ శాసనాన్ని లిఖిస్తున్నది.

05/06/2018 - 00:30

ప్రతిరోజూ వార్తల్లో యువత ఆత్మహత్యల గురించి వింటున్నాం. పరీక్షల సమయం, ఫలితాలు వెలువడిన వేళ, లవ్ బ్రేకప్, ప్రేమను తిరస్కరించడం, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు వంటి కారణాలతో ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మిగిలిన వయసుల వారికంటే యుక్తవయస్కులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సుమారు 34.5 శాతం మేరకు 15-29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారే సూసైడ్ చేసుకుంటున్నారు.

05/05/2018 - 00:05

నగదు కొరతతో సామాన్యుడి సణుగుడు.. ప్రభుత్వానికి సైతం కొరుకుడుపడని సమస్య.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా నగదు లేదన్న నిరసన ధ్వనులు జనం నుంచి ప్రతిధ్వనిస్తున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా అన్నివర్గాల వారూ తమ సంపాదనలో అంతో ఇంతో బ్యాంకుల్లో దాచుకోవడం పరిపాటి. మరి.. బ్యాంకుల్లోనే డబ్బులేకపోవడం, తమ డబ్బు ను తాము తీసుకునే అవకాశం మృగ్యం కావడంతో ప్రజానీకం తీరని కష్టనష్టాలను ఎదుర్కొంటోంది.

05/03/2018 - 23:44

ఒకప్పుడు దేశమంతటా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి..! నిజమే అనుకుందాం.. కానీ- మోదీని పదవి నుంచి దించేయడమంత తేలిక కాదేమో- ‘్భవి ప్రధాని’ని ఎన్నుకోవడం. సార్వత్రిక ఎన్నికలకు దాదాపుగా ఇంకా సంవత్సరం పైనే సమయం ఉంది. మరి- ఈ పూర్తి సంవత్సరకాలం దేశంలో రాష్టప్రతి పాలన సాగించరు కదా! దీనిపై విపక్ష నేతలు, విజ్ఞులు ఏమంటారు?

05/02/2018 - 23:59

తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రవేశించగానే- ‘సముద్రంలో చేపలు పట్టబోయే నావికుడు లంగరు వేసినట్టు’ తన మేధస్సుతో తరగతి గదిపై లంగరు వేస్తాడు. అది రాబోయే కాలానికి భూమికగా ఉపయోగపడుతుంది. దానికి రెండు,మూడు లక్ష్యాలుంటాయి. పిల్లలకు తాను చెప్పబోయే పాఠానికి సంబంధించిన కానె్సప్ట్‌ను అర్థం చేసుకునే పూర్వ పరిజ్ఞానం ఉన్నదా? లేదా? వారికి ఇందుకు సంబంధించిన నైపుణ్యం ఉన్నదా? లేదా?

05/01/2018 - 23:52

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో భ్రామాగఢ్ వద్ద ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు మరణించారు. వీరంతా అహెరి, పెరిమిలి, సిరొంచ గెరిల్లా దళాలకు చెందిన వారట. మృతుల్లో దళ కమాండర్లూ ఉన్నారు. వీరిలో తెలంగాణకు చెందిన విజేందర్ ఒకరు.

05/01/2018 - 00:07

విశ్వవ్యాప్తంగా కార్మికులంతా ‘మేడే’ను పండుగలా శతాబ్ద కాలానికి పైగా జరుపుకుంటున్నారు. మొదటి పారిశ్రామిక విప్లవం తొలి నాళ్లలో కార్మికులు ‘బానిసలు’గా పనిచేయాల్సిన దీనస్థితిలో- పనిగంటలు తగ్గించాలని అమెరికాలోని చికాగో నగరంలో 1886 మే మాసం ప్రారంభం నుంచి ప్రదర్శనలు, ఊరేగింపులు, సమావేశాలు, ఆవేశపూరిత ప్రసంగాలు కొనసాగాయి.

Pages