S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/05/2018 - 23:28

సృజనాత్మకమైన ఆలోచన (క్రియేటివ్ థింకింగ్) అన్నది పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయం వరకు అత్యంత కీలకమైంది. నిజానికి దేన్ని ‘సృజనాత్మక విద్య’ అంటారన్నదే అసలు చర్చ. సృజనాత్మకత అంటే నావెల్టీ (కొత్తగా కనిపించాలి), రిలెవన్సీ (సమయస్ఫూర్తిగా) ఉండాలి. కొన్నిసార్లు సృజనాత్మకమైనవి కానివి కూడా స్ఫూర్తిదాయకంగానే వుంటాయి. అవి విద్యా వికాసానికి ఉపయోగపడకపోతే తరగతి గదికి సరిపోదు.

04/04/2018 - 23:41

ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అయిదవ అవతరణోత్సవం జరుపుకోబోతోంది. గత నాలుగేళ్లలో తెలంగాణ రూపురేఖలను సమూలంగా తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పవచ్చు. 2017-18లో ఆర్థికాభివృద్ధి రేటు 10.4 శాతం నమోదవుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ప్రకటించారు. అదే సమయంలో జాతీయ జిడిపి 6.6 శాతం మాత్రమే.

04/04/2018 - 00:17

సమాజంలో ఆర్థిక అంతరాలకు ‘శ్రమదోపిడీ’ కారణమని కారల్ మార్క్స్ సిద్ధాంతీకరించారు. వాస్తవానికి జ్ఞానస్థాయి, నైపుణ్యాలు, చైతన్యంలోని తేడాలే ఈ అంతరాలకు కారణమని స్పష్టంగా తెలుస్తున్నా ఆయన పట్టించుకోలేదు. ఒక కుటుంబంలో నలుగురైదుగురు ఉం టే.. వారిలో ఒకే స్థాయి జ్ఞానం, చైతన్యం, చొరవ కనిపించదు. అందుకే వారి ఆర్థిక స్థితి ఒకే తీరున ఉండదు. ఈ వ్యత్యాసానికి ‘వర్గం’ కారణమవుతుందా?

04/03/2018 - 02:00

మన దేశ జనాభా 125 కోట్లకు మించిపోగా, అందులో 35 ఏళ్లలోపు వయసు కలిగిన వారి సంఖ్య 80 కోట్ల పైమాటే. ప్రపంచంలోనే యువత అత్యధికంగా ఉన్న భారత్‌లో పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అవినీతి, అకాల మరణాలు వంటి సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. ఈ సమస్యలను యువత ఎదుర్కొనవలసి వస్తోంది. చిన్నారులను భావి భారత యువతగా తీర్చిదిద్ది, వారి శక్తిసామర్థ్యాలను జాతి కోసం వినియోగించుకోవాలి.

04/01/2018 - 01:27

చాలా సున్నితమైన విషయాలను గురించి ఏదో వ్రాస్తున్నాను. అపార్థం చేసుకోవద్దు. 86 ఏళ్ల వృద్ధాప్యంలో ఈ విషయాలు వ్రాయాలని అనిపించింది. 1963లో జిల్లా మున్సిఫ్‌గా న్యాయశాఖలో ప్రవేశించి, 1990 డిసెంబర్‌లో జిల్లా జడ్జిగా పదవీ విరమణ చేశాను. న్యాయశాఖలో సుదీర్ఘకాలం పనిచేసినందున ఈ విషయాల మీద వ్రాయటానికి కొంత అధికారం, అనుభవం ఉందనుకుంటున్నాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే- దేశాన్నంతా కదిలించిన అంశం అది.

03/31/2018 - 00:35

పోర్చుగల్‌కు చెందిన వాస్కోడగామా భారత్‌కు దారి కనిపెట్టాడని చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకున్నాం. ఆయనకు దారి చూపించిన బృందంలో ఒక గుజరాతీ కూడా వున్నాడన్న సంగతి ఈమధ్యనే చదివాను. గుజరాతీలు సముద్రంపై ఖండాంతరాలు దాటి వ్యాపారం చేసి ఎంత సంపాదించారో, ఎలా సంపాదించారో చరిత్రకారులు ఎక్కడైనా రికార్డుచేసి వుంటే తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిందే.

03/30/2018 - 00:10

ఒక శతాబ్దంలో వచ్చిన ఆవిష్కరణలు దానివల్ల తరగతి గదిపై పడిన బాధ్యత వల్ల తరగతి గత శతాబ్దాల కన్నా ఎన్నో రెట్లు ఎదిగింది. విద్యార్థి వ్యక్తపరిచే సృజనాత్మక భావాలకు తరగతి గది వేదికైంది. మానవ కల్యాణానికి ఉపయోగపడే జ్ఞానాన్ని అందించే స్థాయికి తరగతి గది ఎదిగింది. విభిన్నమైన అభిప్రాయాలకు సమన్వయకర్తగా రూపొందింది. విద్యార్థి, ఉపాధ్యాయుడు తరగతి గదిలో జరిగే చర్చకు శాస్ర్తియ రూపం తీసుకువస్తున్నారు.

03/28/2018 - 00:11

మావో ఆలోచనా విధానానికి, ఆయనతో కలిసి పనిచేసిన డెంగ్ జియావో పింగ్ భావాలకు ఎక్కడా పొంతన కుదరదు. తూర్పు-పడమరలంత తేడా కనిపిస్తుంది. చైనా ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్ భావజాలం ఆధునిక పరిస్థితులకనుగుణంగా ఉన్నా, మావో కమ్యూనిస్టు మూల సూత్రాలకు దగ్గరగా కనిపించదు. అంటే చైనాలో మావోయిజం మంచులా కరిగిపోయిందన్నమాట.

03/25/2018 - 01:28

త్యధిక సంఖ్యాకులకు చెందిన ధార్మిక సంస్థలపై ప్రభుత్వ పెత్తనం ప్రపంచంలో ఒక్క భారత్‌లోనే ఉంది. అల్పసంఖ్యాక వర్గాలవారు మ రే దేశంలోనూ అత్యధిక సంఖ్యాకుల ఆరాధనా పద్ధతులను, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడరు. అల్పసంఖ్యాకులు న్యాయస్థానాలను ధిక్కరిస్తూ, తమ పౌరస్మృతి జోలికి వస్తే ఊరుకోమని ఏ దేశంలోనూ బెదిరించరు. రాజకీయ నేతలు అల్పసంఖ్యాకులను ప్రలోభపెట్టేందుకు భారత్‌లో తప్ప మరెక్కడా బరితెగించి వ్యవహరించరు.

03/24/2018 - 00:40

భయ తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణులకు కోటి ఆశలు కల్పిస్తూ గద్దెనెక్కిన సర్పంచ్‌లు గత మూడున్నరేళ్ల పాలనలో తమ పంచాయితీల ఆదాయ వనరులు పెంచటంలో ఘోరంగా విఫలమయ్యారు. వౌలిక సదుపాయాల కల్పన విషయంలో వారు గ్రామీణుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇదే సమయంలో కొంతమంది సర్పంచ్‌లు తమ సొంత ఆదాయం మెరుగుపడే విధంగా పంచాయితీ ఖర్చులను నిర్వహించారనేది చేదు నిజం.

Pages