S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సబ్ ఫీచర్
ప్రపంచంలో ఎక్కడైనా లభించేది స్నేహం ఒక్కటే. సాంకేతికత పెరిగిన ప్రస్తుత హైటెక్ యుగంలో మనిషికి అనేకానేక సమస్యలు, సవాళ్లు అనునిత్యం తప్పడం లేదు. ఒక్కోసారి ఏం చేయాలో తోచదు. కళ్ల ముందు అంధకారం అగుపిస్తుంది. అంతలోనే ఓ ఆత్మీయ పిలుపు ‘నేనున్నానం’టూ చెవులకు వినిపిస్తుంది.
ఏవిటండీ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే భాష రోజురోజుకూ ఇలా దిగజారిపోతోంది..?’’ అన్నారు ఆకాశవాణి పూర్వ సంచాల కులు డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ ఓ రోజు పొద్దునే్న నాకు ఫోను చేసి.
అన్ని శక్తులనూ ఒక అంశంపై కేంద్రీకరిస్తేనే శ్రేష్ఠత ఏర్పడుతుంది. ఆ శ్రేష్ఠత రావటానికి ప్రభుత్వం విద్యాలయాలను ఏర్పాటు చేసింది. అది ఒక రోజుతో కాదు. దాని వెనుక అవిరళ కృషి దాగి ఉంటుంది. ఆ కృషి జరిగిన తర్వాతే ప్రపంచం గుర్తిస్తుంది. అప్పుడు విద్యార్థికి ఆనందం కలుగుతుంది. ఆనందం శ్రమ చేసేటప్పుడు ఉండదు. అప్పుడూ శక్తంతా పనిమీదనే ఉంటుంది. పనిచేసేటప్పుడు ఆనందం స్ఫురణకువస్తే ఏ విద్యార్థి అయినా జారిపడతాడు.
హిందూ మతంగా ప్రచారంలో ఉన్న ‘హిందూ ధర్మం’ ఒక జీవన విధానమని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది. భారతీయ సమాజంలో నేటికీ హిందూమతం ఘనంగా కొనసాగుతోంది. హిందూ ధర్మంలోని వారు ఆచరించే విభిన్న మతాలను వైదిక మతాలంటారు. వైదిక మతాల్లో వైవిధ్యాలే తప్ప వైరుధ్యాలు ఉండవు. శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, కుమారస్వామి, గణపతి వంటి దేవుళ్లంతా ఒకే పరివార వారన్న విషయాన్ని విస్మరించరాదు.
జాగాయకుడు గద్దర్ పార్టీ పెడతారట..’
‘ఆ.. ........’
‘ఏమండోయ్.. గద్దర్ రాజకీయ పార్టీ పెడతారట...’
‘అంత సీన్ లేదులే!’
‘అదేమిటి.. అలా అంటారు?’
‘అదంతే!.. అది పూర్తిగా పాతపాట.’
- ఊహాత్మకమైన ఈ సంభాషణను పక్కన పెడితే...
లోక్సభలో తెలుగుదేశం పార్టీ మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన మర్నాడు- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జాతీయ స్థాయి విలేఖరుల సమావేశాన్ని నిర్వహించి, కొన్ని అసందర్భ వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందో చెబుతూ, ఆయన కాస్త ‘అతి’గా మాట్లాడటం తెలంగాణ వాదులకు తీవ్ర మనస్తాపం కలిగించింది.
ప్రస్తుత నగర జీవన విధానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకువెళ్తున్న యువతలో కొందరు చెడు మార్గంలోకి వెళుతున్నారు. కొందరైతే అమానవీయ చర్యలకు పాల్పడుతూ మానవత్వానికే మచ్చ తెస్తున్నారు. ఇందుకు అనేక సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాను చేసిన అప్పులు తీర్చడానికి స్నేహితుడి ఖరీదైన సెల్ఫోన్ను దొంగిలించడమే కా కుండా అతడిని ఓ యువకుడు పెట్రోలు పోసి తగులబెట్టాడు.
ఈ సంవత్సరం మార్చి నెల 8వ తేదీన దేశవ్యాప్తంగా మహిళా దినోత్సవం ఘనంగా జరిపారు. ఆ సందర్భంగా బెంగళూరు నగరంలో జరిగిన ఉత్సవంలో మాజీ డీజీపీ సాంగ్లియానా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ‘నిర్భయ కేసు’గా విశేష ప్రాచుర్యం పొందింది. బెంగళూరులో జరిగిన సభకు ‘నిర్భయ’ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రినాథ్ సింగ్లు హాజరయ్యారు.
ప్రస్తుత 21వ శతాబ్దంలో అద్భుత ప్రయోగాలు జరిగాయి. చిన్న చిన్న దేశాలు ఏర్పడ్డాయి. మలేషియా నుంచి సింగపూర్ విడిపోయింది. వనరులన్నీ మలేషియాలో ఉండేవి కానీ, ఈనాడు ప్రపంచంలో అమెరికాతో సమానంగా సింగపూర్ ‘జీడీపీ’ ఉంది. ఉత్తర కొరియాలో వనరులన్నీ ఉన్నాయి. కొరియా విడిపోయాక దక్షిణ కొరియా శరవేగంగా అభివృద్ధి చెందింది. స్వీడన్ ఒకనాడు ప్రపంచానికి గడియారాలిచ్చింది.