S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సబ్ ఫీచర్
ప్రపంచం ఇప్పుడు కొత్త ‘మతం’ వైపు పయనిస్తోంది. మతమంటే కొన్ని కట్టుబాట్లు, పద్ధతులు, విధానాలు, విశ్వాసాలు. మనిషి చుట్టూ పరిస్థితులు మారినప్పుడల్లా మతాలు రూపాంతరం చెందుతున్నాయి. ఒకప్పుడు ‘భగవంతుడు-భక్తి’ చుట్టూ మతం ప్రవహించింది. ఆ విశ్వాసంతో శతాబ్దాలపాటు కొనసాగారు.. కొనసాగుతూ ఉన్నారు. అయితే అదే అంతిమం కాదు, అక్కడే మనిషి ఆగిపోలేదు.
భారత దేశంలో కులవ్యవస్థ కారణంగా జనంలో అసమానతలు పెరుగుతున్నాయి.. కాబట్టి కుల రహిత సమాజం ఆవిర్భవించాలి.. క్రైస్తవంలో, ఇస్లాంలో కులాలు అసలే ఉండవు.. కేవలం హిందూ మతంలోనే అనేక కులాలు ఉంటాయి..’ అని ఇటీవల కొందరు సరికొత్త వాదనలు చేస్తున్నారు. అయితే- ఇస్లాంలో, క్రైస్తవంలో వేర్వేరు తెగలుంటాయన్న విషయం ప్రస్తావించకుండా వారు హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకొని వివాదాలను రాజేస్తున్నారు.
సాంకేతికతను ఆలంబనగా చేసుకొని మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాల్సిన అవసరం పెరుగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో అనేకానేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్న మాట నిజమే. ఆధునిక నాగరికత, పాశ్చాత్య సంస్కృతి వల్ల మన జీవన విధానంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొన్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతోంది. నైతిక విలువలు నానాటికీ దిగజారడం ఆందోళనకర పరిణామం.
కాలానుగుణంగా సమాజ వైఖరిలో వచ్చిన మార్పువల్ల కాస్త పెద్దగా కనిపించే ప్రతి ఊరిలో నేడు ఒకటి కన్న ఎక్కువ స్కూళ్లు కనపడుతున్నాయి. ప్రతి స్కూలును బేరీజు వేసుకునే అవకాశం రావటం సముచితమే. కానీ, తల్లిదండ్రుల ‘ఆప్షన్ల’ మేరకు పిల్లలు స్కూళ్లకు వెళుతున్నారు. ధనవంతుల పిల్లలు ఒక దగ్గరకు, పేదల పిల్లలకు మరో ఒక స్కూలు వెళ్తున్నారు. ఈనాడు విద్య వ్యాపారంగా మారింది.
సుగంధ ద్రవ్యాల వ్యాపారార్థం 1498లో వాస్కోడగామా కేరళలోని కోజికోడ్లో అడుగిడిన సంఘటనతో ఐరోపా వర్తకుల రాకపోకలకు భారత ఉపఖండం స్వాగతం పలికింది. 1757లో ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని శే్వతజాతి సైన్యం బెంగాల్ నవాబుపై విజయం సాధించడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు తెర లేచింది. యుద్ధానంతరం బెంగాల్, బిహార్, ఒడిశా ప్రాంతాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వశమయ్యాయి.
ప్రపంచానికే ఉన్నతమైన విద్యావంతులను, మేధావులను మన విశ్వవిద్యాలయాలు అందించాయన్నది ఒకప్పటి మాట. నేడు విశ్వవిద్యాలయాలు రాజకీయాల కారణంగా తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాలకు మాత్రమే వేదికలుగా నిలిచిన విశ్వవిద్యాలయాలు నేడు కులసంఘాలతో, రాజకీయ విద్వేషాలతో నిండిపోతున్నాయి.
బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుంచి పారద్రోలే ఉద్యమంలో ‘నేతాజీ’ సుభాష్ చంద్రబోస్ సారథ్యంలో ఎందరో యువకులు ముందుకు నడిచారు. దేశభక్తి ప్రపూరితమైన నాటి యువకులు గాంధేయవాదంతో ఏకీభవిస్తూనే విప్లవత్తోజ కార్యాచరణతో బ్రిటిష్ నిరంకుశ రాజనీతిని ప్రతిఘటించారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో, స్వేచ్ఛా సాధనలో ఎందరో అజ్ఞాత త్యాగధనుల ఆత్మార్పణలు, సాహసోత్తేజం చరిత్రలో కరిగిపోయాయి.
సుప్రీం కోర్టు ఆదేశంతో కేంద్ర ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం సం యుక్తంగా నిర్వహించిన జాతీయ పౌర నమోదు (ఎన్ఆర్సీ) ప్రక్రియతో అక్కడ నివసిస్తున్న 40 లక్షల మందిని (ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినవారు) చొరబాటుదారులుగా తేలారు. వెంటనే నకిలీ లౌకికవాద ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో గందరగోళం సృష్టించాయ.
స్వాతంత్య్ర కాంక్ష రగిలిన సమయంలో శే్వతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ‘ఆగస్టు విప్లవం’ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అహింస, అవిధేయత అనేవి ఈ విప్లవంలో ప్రధాన అంశాలు. అందుకే భారత జాతీయోద్యమం అనేకానేక దేశాలలో వలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా నిలిచింది. సురేంద్రనాథ్ బెనర్జీ ‘ఇండియన్ నేషనల్ అసోసియేషన్’ (్భరత జాతీయ సంఘం) స్థాపించారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్లోని సనౌలి గ్రామంలో మహాభారత కాలం నాటి కత్తులు, రథాలు, సమాధులు పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. క్రీస్తుపూర్వం రెండువేల సంవత్సరాల నాటి ఈ వస్తువులు, సమాధులు అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించే అవకాశాలున్నాయి. ఇక, రామాయణ కాలం నాటి ఆనవాళ్లు సైతం అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అంతరిక్షం నుంచి ‘నాసా’ చిత్రించిన ఫొటోల్లో ‘రామసేతు’ కనిపించడంతో దానిపై పరిశోధనలు జరుపుతున్నారు.