-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ: ప్రస్తుత వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా మజ్జిగ అందజేయాలని ఎపి సర్కారు నిర్ణయించింది. ఈరోజు ఇక్కడ జరిగిన మంత్రిమండలి సమావేశంలో వేసవిలో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. మూలపడ్డ నీటి సరఫరా పథకాలకు 200 కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించారు. వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ: విధుల నుంచి తమను తొలగించినందుకు నిరసనగా విశాఖలో ముగ్గురు టాక్సీ డ్రైవర్లు సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఉబెర్ క్యాబ్స్ సంస్థలో పనిచేస్తున్న తమను తొలగించి కొత్తవారిని తీసుకోవడం అన్యాయమని వీరు అంటున్నారు. ముగ్గురు డ్రైవర్లు ఆత్మహత్యకు యత్నించడంతో స్థానిక రాంనగర్లో కలకలం మొదలైంది.
విజయవాడ: తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఇక్కడ ఆ పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఎపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, వైకాపా నుంచి వలసలు తదితర అంశాలపై చర్చించారని సమాచారం.
కర్నూలు: శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఇంజనీరింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు సోమవారం తనిఖీలు ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను వారు పరిశీలిస్తున్నారు.
విజయవాడ: దళితుల అభివృద్ధి కోసం రాష్టవ్య్రాప్తంగా పర్యటించి ప్రభుత్వానికి సూచనలు చేస్తానని, ఈ వర్గాలపై దాడుల్ని అరికట్టేందుకు కృషి చేస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. పేదవర్గాలకు నీడ కల్పించేందుకు అంబేద్కర్ జయంతి నాడు గృహనిర్మాణ పథకాలను సిఎం చంద్రబాబు ప్రారంభించడం హర్షణీయమన్నారు.
విశాఖ: మామిడికాయలను రాత్రికిరాత్రి మగ్గబెట్టేందుకు కార్బయిడ్ వాడితే చట్టప్రకారం చర్యలు తప్పవని ఆహార భద్రత అధికారులు హెచ్చరించారు. విశాఖలోని పూర్ణామార్కెట్, జ్ఞానాపురం, ఎంవిపి కాలనీ తదితర ప్రాంతాల్లోని పండ్లమార్కెట్లను అధికారులు సోమవారం ఉదయం తనిఖీ చేసి మామిడిపండ్లను సేకరించారు. కృత్రిమంగా మగ్గపెట్టిన పండ్ల విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
విజయనగరం: బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే సుజయకృష్ణ, ఆయన సోదరుడు బేబీనాయన ఈ నెల 20న విజయవాడలో సిఎం చంద్రబాబు సమక్షీంలో టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా టిడిపి నాయకత్వం భారీగా సన్నాహాలు చేస్తోంది. బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన టిడిపి నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
విశాఖ: విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వైకాపా నాయకుడు గుడివాడ అమర్నాథ్ సోమవారం తమ పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆందోళన విరమించారు. ఆదివారం రాత్రి దీక్షను భగ్నం చేసి అమర్నాథ్ను కెజిహెచ్లో పోలీసులు చేర్పించారు. ఈరోజు మధ్యాహ్నం జగన్ ఆస్పత్రికి వచ్చి అమర్నాథ్కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
హైదరాబాద్: వడదెబ్బ వల్ల మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తున్నట్లు ఎపి సర్కారు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టుకు తెలిపింది. వేసవిలో తీసుకుంటున్న చర్యల గురించి దాఖలైన పిటిషన్పై కోర్టులో సోమవారం విచారణ జరిగింది.
విశాఖ: విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్న తమ పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ను పరామర్శించేందుకు వైకాపా అధినేత జగన్ సోమవారం ఇక్కడికి వచ్చారు. నాలుగురోజులుగా దీక్ష చేస్తున్న అమర్నాథ్ను పోలీసులు ఆదివారం కింగ్జార్జి ఆస్పత్రికి తరలించారు. రైల్వేజోన్ కోసం ఉద్యమించేందుకు వివిధ పార్టీల నాయకులతో జగన్ ఈరోజు సాయంత్రం సమావేశమవుతారని వైకాపా నేతలు చెబుతున్నారు.