S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/14/2016 - 05:52

విశాఖపట్నం, జూన్ 13: ఎయులో 600 మంది బోధనేతర సిబ్బంది నియామకాలపై లోకాయుక్తకు ఆ వర్సిటీకి చెందిన రీసెర్చి స్కాలర్ ఎ.మహేష్ ఫిర్యాదు చేశారు. నిబంధనలు పక్కనపెట్టి, రోస్టర్‌ను పాటించకుండా మాజీ వీసీ జి.ఎస్.ఎన్.రాజు నియామకాలు చేపట్టారన్నారు. ఇంత భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టే సమయంలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేని, దీని వల్ల వర్సిటీపై ఏటా 5 కోట్ల రూపాయల వరకూ భారం పడుతోందని తెలిపారు.

06/14/2016 - 05:52

మార్కాపురం, జూన్ 13: ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్‌లోని అర్థవీడు మండలం బోగోలు గ్రామంలో 2011 జూలై 22న జరిగిన పానుగంటి దావీద్ హత్యకేసులో 12మందికి జీవితఖైదు విధిస్తూ సోమవారం జిల్లా ఆరవ అదనపు జడ్జి శ్రీదేవి తీర్పు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం 2011 ఫిబ్రవరి 26న హతుడు దావీద్ కుటుంబానికి, నిందితురాలు మరియమ్మ కుటుంబానికి మధ్య డ్వాక్రాగ్రూపులకు సంబంధించిన కమీషన్ విషయంలో వివాదం ఏర్పడింది.

06/13/2016 - 18:11

విజయవాడ: ఇక్కడి గన్నవరం ఎయిర్‌పోర్టులో అదనపు టెర్మినల్ పనులను ఎపి సిఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. నిర్మాణం పనులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

06/13/2016 - 18:10

హైదరాబాద్: ఎపి సచివాలయంలో క్లాస్ త్రీ, ఫోర్ పోస్టుల్లో పనిచేస్తున్న 253 మందిని తీసుకునేందుకు తెలంగాణ సర్కారు అంగీకరించింది. వీరిని రిలీవ్ చేసేందుకు ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. తమను హైదరాబాద్‌లోనే ఉంచుతున్నందుకు ఆ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

06/13/2016 - 17:22

కాకినాడ: వైకాపా అధినేత జగన్ ఈనెల 15, 16 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో జరుపతలపెట్టిన పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు వైకాపా జిల్లా నేతలకు సమాచారం అందింది. కాపుఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం రాజమండ్రి ఆస్పత్రిలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నందున శాంతి భద్రతల పరిస్థితిపై పోలీసులు నిఘా పెట్టారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

06/13/2016 - 17:22

విజయవాడ: రెవెన్యూ శాఖలో పాలనను మరింత వేగిరపరచేందుకు ఉద్యోగులందరికీ ఐటిలో శిక్షణ ఇప్పిస్తామని డిప్యూటీ సిఎం, రాష్ట్ర రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. తన శాఖలో సంస్కరణలు, మెరుగైన పాలనకు సంబంధించి ఆయన సోమవారం ఇక్కడ అధికారులతో సమీక్ష జరిపారు. రెవెన్యూలో ఉద్యోగ నియామకాలకు ఇకపై ఐటి అర్హత తప్పనిసరి చేస్తామని, విఆర్‌ఓలకు సాంకేతిక అర్హతలుండేలా మార్పు చేస్తామని తెలిపారు.

06/13/2016 - 17:20

విజయవాడ: ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనుమతి లేకుండా నడుస్తున్న చైతన్య టెక్నో స్కూల్ ఎదుట వారు ఆందోళన ప్రారంభించారు.

06/13/2016 - 17:20

కడప: జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం మితిమీరిన వేగంతో వస్తున్న లారీ ఢీకొనడంతో ఓ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బాలిక మృతితో ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

06/13/2016 - 14:26

తిరుపతి: తిరుమల కొండలపై కొద్దిరోజులుగా చిరుత పులుల సంచారం అధికమైంది. దీంతో నడకదారిన కొండపైకి చేరుకునే భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రహరీ గోడ దూకి ఓ మఠంలోకి చిరుత ప్రవేశించినట్టు సిసి కెమెరాలో రికార్డయింది. అలాగే, రింగ్‌రోడ్డుపై రెండు చిరుతలు తిరుగుతున్నట్టు ఓ భక్తుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. చిరుతల నుంచి ప్రమాదం పొంచి ఉందని భక్తులు భయాందోళనలకు లోనవుతున్నారు.

06/13/2016 - 14:24

నెల్లూరు: నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాల వద్ద సోమవారం ఉదయం ఓ యువతిని కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. వాహనంలో ఆమెను బలవంతంగా ఎక్కించి ఆగంతకులు వెళుతుండగా వెంకటాచలం టోల్‌గేట్ వద్ద విద్యార్థిని క్షేమంగా బయటపడింది. టోల్‌గేట్ వద్ద వాహనం ఆగడంతో కిడ్నాపర్ల కళ్లు గప్పి ఆమె కిందకు దూకేసింది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Pages