S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/13/2016 - 14:23

అనంతపురం: అనంతపురం జిల్లా కాశీపట్నం బస్టాండ్ వద్ద సోమవారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు వంద కిలోల గంజాయిని, 77 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

06/13/2016 - 14:23

విజయవాడ: ఎంపీలు, ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులను ఏడాదిలోగా పూర్తి చేయాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించినా కింది కోర్టులు పట్టించుకోవడం లేదని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైకాపా అధినేత జగన్‌పై సిబిఐ కేసులు పెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకూ ఒక్క తీర్పు కూడా రాలేదన్నారు. ప్రజాప్రతినిధులను కూడా సామాన్యమానవుల్లా పరిగణించి కేసులను తొందరగా తేల్చాలన్నారు.

06/13/2016 - 14:23

రాజమండ్రి: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు సహకరించడం లేదని డాక్టర్లు సోమవారం తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న ముద్రగడ భార్య, కొడుకు, కోడలికి మాత్రం వైద్యపరీక్షలు చేశామని డాక్టర్లు చెప్పారు. వైద్యాన్ని నిరాకరిస్తే ముద్రగడ ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందని వారు తెలిపారు.

06/13/2016 - 14:22

తిరుపతి: పాఠశాలలకు వేసవి సెలవులు ముగుస్తున్న దశలో గత నాలుగు రోజులుగా తిరుమల ఆలయానికి రద్దీ అనూహ్యంగా పెరిగిందని టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు సోమవారం తెలిపారు. ఆదివారం ఒక్కరోజునే లక్షకు మించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీకి తగ్గట్టుగా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని, సాధారణ భక్తులకు స్వామి దర్శనం సులభంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

06/13/2016 - 14:22

ఏలూరు: ఓ యువకుడి మృతితో మొగల్తూరు మండలం పాతపాడులో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉద్దేశ పూర్వకంగా ఆ యువకుడిని కొందరు హత్యచేసి, రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు చిత్రీకరిస్తున్నారని మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. ఉద్రిక్తతను చల్లార్చేందుకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు.

06/13/2016 - 14:21

తిరుపతి: ఇక్కడి అవుటర్ రింగ్‌రోడ్డుపై సోమవారం ఉదయం భక్తులతో వెళుతున్న జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు భక్తులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

06/13/2016 - 12:37

ఒంగోలు: ఓ వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన దర్శి మండలం బండివెలిగండ్లలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. స్వప్న అనే మహిళ ఆదివారం అర్ధరాత్రి దాటాక ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. అయితే, తాళికట్టిన భర్తే స్వప్నను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. స్వప్న బంధువుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

06/13/2016 - 12:36

విజయనగరం: మితిమీరిన వేగంతో వస్తున్న ఆటో బైక్‌ను ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాలకు లోనైన ఘటన నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి వద్ద సోమవారం జరిగింది.

06/13/2016 - 12:36

విజయనగరం: అత్తను అల్లుడే కిరాతకంగా హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాంలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. అత్తతో గొడవపడిన అల్లుడు ఉన్మాదంతో ఆమెను అంతం చేశాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

06/13/2016 - 12:35

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండతో సంబంధం ఉన్న మరో నలుగురిని పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఈ నలుగురూ అనంతపురం జిల్లాకు చెందినవారని సమాచారం. విధ్వంసకాండకు సంబంధించి సుమారు 300 మంది నిందితులను సిఐడి పోలీసులు గుర్తించి విడతల వారీగా అరెస్టు చేస్తున్నారు. ఇంతవరకూ మొత్తం 17 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

Pages