-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
చండీగఢ్, జూన్ 5: రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జాట్ సామాజికవర్గ నాయకులు హర్యానాలో మళ్లీ ఉద్యమానికి ఉద్యుక్తులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకు భారీ మొత్తంలో రాష్ట్ర పోలీసు బలగాలతోపాటు 5 వేల మందికి పైగా పారామిలటరీ సిబ్బందిని మోహరించినప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయని జాట్ నాయకులు రోహ్తక్ జిల్లాలో తమ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న జస్సియా గ్రామంలో ఆదివారం హవనాన్ని నిర్వహించి తాజాగా ఆందోళన ప్రారంభించారు.
న్యూఢిల్లీ, జూన్ 5: ప్రధాని నరేంద్ర మోదీకి అఫ్గానిస్తాన్ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేయడం భారత్కు గర్వకారణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రధాని మోదీకే కాకుండా యావత్ దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్న జైట్లీ భారత్ తరఫున అఫ్గాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 5: మరికొద్ది రోజుల్లో జరుగనున్న రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు దేశంలోని ప్రముఖ యోగా సంస్థలు తమ వంతు తోడ్పాటును అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన శిక్షకులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న విషయం విదితమే.
న్యూఢిల్లీ, జూన్ 5: వివాదాస్పద బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామిని తన హీరోగా పేర్కొన్న కేంద్ర మంత్రి ఉమాభారతి, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై స్వామి చెప్పే మాటలను నమ్ముతున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండే అవకాశం లేదన్న ఆమె అమిత్ షా నేతృత్వంలో బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ముంబయి, జూన్ 5: ముంబయి- పుణె ఎక్స్ప్రెస్ రహదారిలో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో 17మంది మృతిచెందారు. ఆగివున్న రెండుకార్లను వేగంగా వస్తున్న ఒక ప్రైవేటు బస్సు ఢీకొనడంతో మొత్తం మూడు వాహనాలు లోతైన గోతిలో పడ్డాయ. కారు టైరు పేలిపోవడం వల్ల అది ఎక్స్ప్రెస్వేలో నిలిచివుందని, దానిపక్కనే ఓ ఎంయువి కూడా ఆగివుందని పోలీసులు తెలిపారు.
న్యూదిల్లి:బిజిపి నేత సుబ్రహ్మణ్యస్వామి తన హీరో అని, అయోధ్యలో రామాలయం ఈ ఏడాది చివరలో ప్రారంభిస్తామన్న ఆయన మాటలను విశ్వసించవచ్చని కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తాను లేనని, ఈ ఎన్నికల్లో యూపిలో అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. న్యూదిల్లీలో ఆదివారం ఆమె పిటిఐతో మాట్లాడారు.
చండీగఢ్:ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లను పదిహేనురోజుల్లోగా అమలు చేయాలని కోరుతూ జాట్లు మరోసారి ఉద్యమించడంతో హర్యానాలోని 9 జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గతంలో పట్టణ ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో ఉధృతంగా మొదలైంది. హిస్సార్, మయ్యన్, భివాని, పానిపట్, సోనిపట్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వారు ఆందోళనకు దిగారు.
న్యూదిల్లి:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇప్పటికీ అనధికారికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారని, అధికారికంగా ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించడం లాంచనమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు రాహుల్కు అప్పగించాలని దిగ్విజయ్సహా పలువురు సీనియర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జైరామ్ రమేశ్ మద్దతు తెలపడం విశేషం.
పుణె:ముంబై-పుణె ఎక్స్ప్రెస్ హైవేపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 33మంది తీవ్రంగా గాయపడ్డారు. టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపక్కన ఆగి మరమ్మతులు చేస్తున్న కారు, అతడికి సహకరించేందుకు ఆగిన మరో ఇన్నోవా కారులోని వారిని సతార్నుంచి వస్తున్న బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ రెండుకార్లూ పక్కనే ఉన్న లోతైన గోతిలోకి జారిపోయాయి. ఈ ప్రమాదంలో 17మంది మరణించారు.
మధుర, జూన్ 4: ఉత్తరప్రదేశ్లోని మధుర పట్టణంలో ‘స్వాధీన్ భారత్ సుభాష్ సేన’ నేతృత్వంలో కనీ వినీ ఎరుగని రీతిలో హింసాకాండ చెలరేగి 24 మందిని బలిగొన్న 48 గంటల తర్వాత ఈ హింసాకాండ ప్రధాన నిందితుడు సాయుధ ముఠా నేత రామ్వృ యాదవ్ మృతి చెందినట్లు పోలీసులు శనివారం సాయంత్రం ధ్రువీకరించారు.