S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

12/18/2018 - 01:56

వివాదాస్పదమైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత సహజంగా కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ అంశం పాలక బీజేపీని ప్రజలముందు దోషిగా నిలబెట్టే రాజకీయ ఆయుధంగా తయారైంది.

12/14/2018 - 22:42

ప్రతి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పోటీ పడాలనేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల వింత వింత నిర్ణయాలను తీసుకుంటున్నారు. గుజరాత్‌లో ‘ఉక్కుమనిషి’ సర్దార్ వల్లభభాయి పటేల్ భారీ విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి ప్రపంచ రికార్డును మోదీ నెలకొల్పారు. అదే తరహాలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించడం విస్మయం కలిగిస్తోంది.

12/14/2018 - 02:19

తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెరాస అధినేత కేసీఆర్ తాను చంద్రబాబుకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తాననడం ఏ రకంగా చూసినా మంచిదే. ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కేసీఆర్ ఇప్పుడు ‘అప్‌డేటెట్ వెర్షన్’లా కనిపిస్తున్నారు. ‘రోబో’ సినిమా కన్నా ‘రోబో 2.0’పై సహజంగా అంచనాలు ఎక్కువ.

12/13/2018 - 03:53

కష్టకాలంలో రైతులకు అండగా ఉండాల్సిన పంటల బీమా పథకం (ఫసల్ బీమా) కార్పొరేట్ కంపెనీలకు కాసులు కురిపిస్తోందంటూ, ఈ పథకం ద్వారా లక్షల కోట్ల విలువైన ప్రజాధనం ఖర్చవుతున్నా వాస్తవానికి ప్రజలకు, రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదంటూ ‘కాగ్’ ఇటీవల తన నివేదికలో పేర్కొనడం ఆందోళనకర పరిణామం.

12/08/2018 - 00:12

పరిపూర్ణానంద స్వామి సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి. అందరూ వదిలిపెట్టిన వాడిని ‘సన్నాసి’ అని, అందర్ని, అన్నింటిని వదలిపెట్టిన వాడిని ‘సన్యాసి’ అనడం లోకోక్తి. సన్యసించినవారు ఏ ప్రలోభాలకు ప్రాకులాడరు. లోకహితం కోసం, మంచిమార్గంలో ప్రజలు నడచుకునేలా తమ ప్రవచనాల ద్వారా దేశభక్తిని, జాతీయతను స్వామీజీలు నూరిపోయాలి. ఈ సత్ సంప్రదాయాన్ని గతంలో ఎంతోమంది సాధుపుంగవులు ఆచరించారు.

12/05/2018 - 03:14

మెక్సికో సరిహద్దు గుండా అమెరికాలోకి ప్రవేశించేందుకు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న వలసకూలీలపై ట్రంప్ ప్రభుత్వం సైన్యాన్ని ప్రయోగించడం గర్హనీయం. ట్రంప్ చర్య మానవాళిపై జరిగిన నేరంగానే పరిగణించి యావత్ ప్రపంచం ఇటువంటి అమానవీయ చర్యను ఖండించాలి. అమెరికా అడుగులకు మడుగులొత్తే ఐక్యరాజ్యసమితి ఈ సంఘటనపై స్పందించి నిరసన గళం వ్యక్తం చేయాలి.

11/29/2018 - 00:33

జీవో నెంబర్ 562 ద్వారా ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం-2018, భూసేకరణ చట్టం-2013లను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం ప్రజా సంక్షేమానికి విరుద్ధం. ప్రజల నుంచి బలవంతంగా భూములను గుంజేయడానికి ఈ చట్టసవరణలు పాశుపతాస్త్రంలా పనిచేస్తాయి. ‘్భసేకరణ చట్టం-2013’కు గ్రామసభల నిర్వహణ, ప్రజల సమ్మతి అత్యంత కీలకం. ప్రస్తుత సవరణతో ఆ వెసులుబాటు ప్రజలకు లేకుండా చేశారు.

11/27/2018 - 01:50

అంతర్జాతీయ నైపుణ్య సూచీలో మనదేశం గత రెండేళ్ళలో రెండు ర్యాంకులు దిగజారి, మొత్తం 63 దేశాల పట్టికలో 55వ స్థానంలో వుందన్న స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ తాజా నివేదిక ఘోషిస్తోంది. మన దేశంలో యువతలో నైపుణ్యత కొరత, మానవ వనరుల అభివృద్ధిలో పథకాల వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

11/24/2018 - 01:12

జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయడం ఫక్తు రాజకీయ నిర్ణయం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. కేంద్రంలో పాలకపక్షం తన రాజకీయ అవసరాల దృష్ట్యా ‘రాజ్‌భవన్’ ద్వారా నెరవేర్చుకొన్న రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపం ఇది. గతంలో విభిన్న భావజాలం ఉన్నప్పటికీ పీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి.

11/22/2018 - 00:11

ఎన్ని ప్రభుత్వాలు మారినా గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయుల దయనీయ స్థితి మారడం లేదు. 2016వ సంవత్సరంలో సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్‌లోని దోహాలో ప్రవాస భారతీయ కార్మికుల శిబిరాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వీక్షించి, వాటిని వెంటనే తీరుస్తానని హామీఇచ్చి రెండేళ్ళు దాటింది. ఐనా వారి ఇబ్బందులలో కించిత్తయినా మార్పు రాకపోవడం బాధాకరం.

Pages