S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

03/17/2020 - 23:41

ఆఫ్రికా, ఆసియా (పాకిస్థాన్) తదితర ఖండాలలో గత కొంతకాలంగా మిడతల వల్ల పంటలు దెబ్బతిని ఆర్థికంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని అక్కడ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిడతల దాడివల్ల గోధుమ, మొక్కజొన్న, ప్రత్తి వంటి పంటలతోపాటు పలు కూరగాయల సాగుకు కూడా అవరోధం ఏర్పడుతుంది. పాకిస్థాన్ ఏకంగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న మిడతల నియంత్రణకై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

02/08/2020 - 22:50

ఈ మధ్యే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి మన రాష్ట్ర అభివృద్ధికి చెప్పుకోదగ్గ రీతిలో ఏ మాత్రం నిధులు కేటాయించకుండా మరోసారి మొండి చెయ్యి చూపించి మన రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది.

02/04/2020 - 01:56

తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయడంలోను, ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు పనులు వేగవంతం అయ్యేందుకు తగిన నిధులు ప్రణాళికాబద్ధంగా విడుదల చేయడంలోనూ కేంద్ర ప్రభుత్వం బహుశా రాజకీయ అవసరాల కారణంగా తీవ్ర అలక్ష్యం ప్రదర్శిస్తోంది.

01/28/2020 - 01:35

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన గిరిజన విశ్వవిద్యాలయానికి- అలనాడు సవర (గిరిజన) భాషా వికాసానికి సేవలందించిన గిడుగు రామ్మూర్తి పేరు పెట్టాలి. రాష్ట్ర సవర భాషా సంఘం కూడా ఈ ప్రతిపాదనను పరిశీలించాలని గత నాలుగేళ్లనుండి డిమాండు చేస్తోంది. ప్రస్తుతం విజయనగరంలోని ఏయూ పీజీ సెంటర్‌లో తాత్కాలికంగా ఈ నెలాఖరు నుంచి గిరిజన విశ్వవిద్యాలయ తరగతులు ప్రారంభం కానున్నాయి.

01/15/2020 - 04:22

కుల రిజర్వేషన్లు ఫలితంగా భారతదేశంలో ఎంతోమంది తెలివైన మేధావులు వారియొక్క శక్తియుక్తులు మనం వినియోగించుకోక పోవడంతో, విదేశాలకు ఉపయోగపడటంతో అవి అగ్ర రాజ్యాలుగా తయారయ్యాయి. అగ్రవర్ణాలలో చదువుకున్న అనేకమంది నూటికి నూరుమార్కులు సాధించినా వారికి సరైన ఉపాధి లేదు. అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణులైన వారికి కులం ఆధారంగా ఉన్నత ఉద్యోగాలు లభిస్తున్నాయి.

01/12/2020 - 05:21

ఇటీవల కాలంలో అక్రమ రవాణా సమస్య నానాటికీ తీవ్రరూపం దాల్చడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచెయ్యడం ముదావహం. మనుష్యులను సరుకుల మాదిరిగా మానవత్వం మరిచి ఇష్టారాజ్యంగా రవాణాచేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని సర్వోన్నత న్యాయస్థానం సూటిగా ప్రశ్నించడం ప్రభుత్వాల నిర్లక్ష్యవైఖరికి నిదర్శనం.

01/10/2020 - 01:42

ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం... మరోవైపు మూడు నెలలు దాటినా జీతాలు లేకపోవడంతో నిరుత్సాహం.. ఇదీ రాష్ట్రంలోని లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల దీనస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి మానస పుత్రిక సచివాలయం వ్యవస్థ. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడి ముంగిటకే చేర్చాలన్న సదుద్దేశంతో ఏర్పాటైనవే గ్రామ, వార్డు సచివాలయాలు.

01/09/2020 - 01:57

ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల తరువాత ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపి, హత్యచేసిన నలుగురు మానవత్వం మరచిన క్రూర మృగాలకు ఉరిశిక్ష విధించడం ఎంతైనా హర్షణీయం. ఒక విధంగా చెప్పాలంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఓ నలుగురు దోషులకు ఉరిశిక్ష పడటం అనేది ఒక చారిత్రాత్మక, సంచలనాత్మక విషయం.

01/08/2020 - 23:03

పౌరసత్వ చట్టంపై ఆందోళనలు ఇంకా కొనసాగటం మంచిది కాదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేకాక ఢిల్లీ జుమామసీదు ఇమామ్ శ్రీ బుఖారీ, అజ్మీర్ దర్గా వంటి ఎందరో ముస్లిం మత పెద్దలు మన దేశ ముస్లింలకు నష్టంలేదని స్పష్టం చేశారు. అత్యధిక ప్రజానీకం కూడ సమర్ధిస్తుంది.

01/08/2020 - 02:43

గత ఐదు నెలలకాలంలో గ్యాస్ పంపిణీ సంస్థలు సబ్సిడీ రహిత వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 150 వరకు పెంచాయి. సబ్సిడీ లేని గ్యాస్‌ను వాడే వారిలో సంపన్న వర్గాలేగాక సామాన్యులెందరో వున్నారు. గతంలో ప్రధాని మోదీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పేదలకు చౌకగా వంట గ్యాస్ అందించటానికి, స్థితిపరులు సబ్సిడీని వదులుకోవాలని కోరితే, సామాన్యులు సైతం సబ్సిడీని వదులుకున్నారు. చిరువ్యాపారులకూ గ్యాస్ వాడకం అధికమే.

Pages