S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

04/09/2017 - 22:06

మహాకవి శ్రీశ్రీ జయంతి పురస్కరించుకుని ఏప్రిల్ 30న విజయవాడలో శతాధిక కవి సమ్మేళనం జరుగుతుంది. రెండు రాష్ట్రాల్లోని కవులందరూ ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చు. సమాజము, సంస్కృతి, చదువు, సౌందర్యము, కళ, సాహిత్యానికి సంబంధించి శ్రీశ్రీ స్పందనలకు కవిత్వ రూపం ఇవ్వాలని యువసాహితీ వికాస వేదిక సాంస్కృతీ సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది. కవి సంగమంలో పఠనం చేసిన కవితల సంకలనాన్ని సాహితీ స్రవంతి పేరుతో ప్రచురిస్తారు.

04/09/2017 - 22:05

జనవంశమ్ (కావ్యకృతి)
కవి: శేషేంద్ర
పుటలు; 272 వెల: రూ.450;
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలు
**

04/03/2017 - 14:34

1938లో విశాఖపట్నం నుంచి ఒక యువ కవి దేశ చరిత్రలు గీతం రాస్తూ, ఏ శిల్పం, ఏ సాహిత్యం, ఏ శాస్త్రం, ఏ గాంధర్వం, ఏ వెల్గులకి ప్రస్థానం, ఏ స్వప్నం, ఏ దిగ్విజయం?’’ అని చివరి చరణంలో ప్రశ్నలు వేస్తాడు. దీనికి వందేళ్ల వెనకాల 1836లో, చదువులు లేవు. బడులు లేవు, తీర్చిన పాఠ్య ప్రణాళికలు లేవు, అక్కడక్కడా అయ్యవార్లు నడిపే బడులు తప్ప.

04/03/2017 - 14:32

పేరుకు కాగితమైతేనేం
అది అక్షరాలు ఆడుకునే ఓ క్రీడాంగణం
తళతళలాడే శే్వతవర్ణం
దాని ఆభరణం
విశ్వ నయనాలను
అక్కున చేర్చుకునే
ఓ దేవాలయం
మధుర భావ కుసుమాలతోనే
దాని తేజం
మల్లె వంటి మనసుతో
వెనె్నలోలే వెలుగులు పంచడం
దాని నైజం
అన్ని వాదాలను
కడుపులో దాచుకునే
ధవళ పత్రరాజం
కలం చేసే
నాట్య విన్యాసాలకు

04/03/2017 - 14:30

విష రసాయన ఱంపాల కోతలో
ఏళ్ల తరబడి గుక్కపట్టి ఏడ్చిన మట్టి
ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది
జీవామృతాన్ని జీర్ణించుకుని
వైనంగా గుల్లబారి గుంభనంగా నవ్వుతోంది
ఆరార అగ్న్యస్త్ర కషాయాన్ని ఆరగించి
ఆకుపచ్చ శస్త్రాలను ఆకాశంవైపు నిలబెడుతోంది
పునర్జీవం పొందిన వానపాములు
మట్టితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాయి
శ్రద్ధగా బోధనలు వింటున్న శిష్యుల్లా

04/03/2017 - 14:28

ఒక నిర్దిష్ట సమస్యను సార్వత్రిక సమస్యలో భాగంగా చిత్రించిన పద్య కావ్యం ‘ఒకనాడు’. కావ్యకర్త విద్వాన్ విశ్వం. నిజానికి ఈ కావ్యం సినారే పేర్కొన్నట్లుగా భావ కవితలోనే దేశ భక్తి కవిగా పేర్కొనవచ్చు.

04/03/2017 - 14:25

‘్భరతి’ తరువాత తెలుగు సాహిత్య చరిత్రలో 400కు పైగా సంచికలను పూర్తి చేసుకున్న మాసపత్రిక ‘ప్రజాసాహితి’. నాల్గవ వంతుకు పైగా అంటే 100కు పైగా సంచికలను ప్రత్యేక, విశిష్ట సంచికలుగా వెలువరించటం ద్వారా సాంస్కృతికోద్యమ కర్తవ్య దీక్షను ప్రజాసాహితి ప్రదర్శించింది.

03/26/2017 - 21:57

ఆకాశంబున నినె్చ ఘల్ఘలలు నృత్యన్మంజుమంజీర శిం
జా కల్యాణ పరంపరాశ్రుతులు ఋక్సామోజ్వల ద్ఘోషలున్
రాకా చంద్ర కలా తరంగ తతి చర్చాసాంద్రతల్ నూత్న వి
శ్వాకారంబు సహస్ర పత్రకమల స్పందద్వికాసంబులై

03/26/2017 - 21:56

నామ కోశము
శ్రీమదాంధ్ర భారతము,
రెండు భాగములు
వెల: ఒక్కొక్క భాగము 700
ప్రతులకు: నవోదయ, కాచిగూడ చౌరస్తా, హైదరాబాదు లేదా
రచయిత: 17-1-388-1-ఎ,
శ్రీ లక్ష్మీనగర్ కాలనీ, హైదరాబాదు-51.
**

03/26/2017 - 21:52

ఆధునిక తెలుగు సాహిత్యంలో అంపశయ్య నవీన్ ఒక విలక్షణమైన కాల్పనిక వచన రచయిత. విలక్షణత వారి మొట్టమొదటి నవల ‘అంపశయ్య’ మొదలు, ముప్ఫై రెండవ నవల ‘ప్రేమకు ఆవలి తీరం’ దాకా మళ్ళీ మల్ళీ రుజువవుతూనే వుంది.

Pages