-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సానియా మీర్జా వచ్చే ఏడాది జరిగే ఫెడ్ కప్ టోర్నీలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తుంది. ఎస్పి మిశ్రా నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు థాయిలాండ్లోని హువా హిన్లో జరిగే ఆసియా/ఓషియానియా గ్రూప్-1 ఫెడ్కప్ మ్యాచ్ల్లో ఆడే ఆరుగురు సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.
న్యాయమూర్తులు నాకు అన్యాయం చేశారు. నేను నిర్దోషిని. ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. ఫిఫా ట్రిబ్యునల్ నన్ను ఎనిమిది సంవత్సరాలు సస్పెండ్ చేయడం అన్యాయం. ఈ నిర్ణయంపై క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టులో ఫిటిషన్ వేస్తాను. అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది.
- సెప్ బ్లాటర్
------------------
యొకహమా, డిసెంబర్ 20: అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (్ఫఫా) ఆధ్వర్యంలో జరిగిన క్లబ్ ప్రపంచ కప్ చాంపియన్షిప్ను స్పెయిన్ దిగ్గజం బార్సిలోనా కైవసం చేసుకుంది. ఆదివారం భారీగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో జరిగిన ఫైనల్లో ఈ జట్టు 3-0 తేడాతో అట్లెటికో రివర్ ప్లేట్ను చిత్తుచేసింది. సౌరెజ్ రెండు గోల్స్ సాధించి, బార్సిలోనాను విజయపథంలో నడిపాడు. మెస్సీ ఒక గోల్ చేశాడు.
ఫటోర్డా, డిసెంబర్ 20: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ టైటిల్ను చెనె్నయిన్ క్లబ్ కైవసం చేసుకుంది. ఆదివారం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చెనె్నయిన్ను అదృష్టం వరించగా, గోవాను దురదృష్టం లక్ష్మీకాంత్ కట్టిమణి రూపంలో వెంటాడింది. మెన్డోజా వలెన్షియా మ్యాచ్ చివరి క్షణాల్లో కీలక గోల్ చేసి చెనె్నయిన్ను గెలిపించాడు.
హామిల్టన్, డిసెంబర్ 20: శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నది. నిన్నటి వరకూ శ్రీలంకది పైచేయికాగా, మ్యాచ్ మూడోరోజు, ఆదివారం టిమ్ సౌథీ విజృంభణతో కివీస్ ఆధిపత్యాన్ని సంపాదించింది. విజయం దిశగా అడుగులు వేస్తున్నది.
కోల్కతా, డిసెంబర్ 20: మళ్లీ ఫామ్లోకి వస్తానని, గతంలో మాదిరిగానే ఉత్తమ ఆటతో రాణిస్తానని ఆస్ట్రేలియాకు వెళ్లే భారత టి-20 జట్టులో స్థానం సంపాదించుకున్న యువరాజ్ సింగ్ చెప్పాడు. కోల్కతా 25కె రన్కు హాజరైన అతను విలేఖరులతో మాట్లాడుతూ, చాలకాలంగా తాను చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని చెప్పాడు.
కోల్కతా, డిసెంబర్ 20: టాటా స్టుల్ కోల్కతా 25కె రన్ మహిళల విభాగంలో సుధా సింగ్ టైటిల్ కైవసం చేసుకుంది. వచ్చే ఏడాది రియో డి జెనీరియోలో జరిగే ఒలింపిక్స్కు అర్హత సంపాదించిన ఆమె ఈ రన్ను ప్రాక్టీస్ ఈవెంట్గా పూర్తి చేసింది. లక్ష్యాన్ని ఒక గంట, 27.31 నిమిషాల్లో చేరుకున్న సుధ విజేతగా నిలవగా, చివరి క్షణం వరకూ ఆమెకు గట్టిపోటీనిచ్చిన లలితా బాబర్ ఒక గంట, 27.47 నిమిషాలతో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది.