-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
షిల్లాంగ్, డిసెంబర్ 25: షిల్లాంగ్లో జరగాల్సిన బాడ్మింటన్ ఈవెంట్ను గౌహతికి తరలించడం పట్ల మేఘాలయ ఒలింపిక్ సంఘం నిరసన వ్యక్తం చేసింది.
కొలంబో, డిసెంబర్ 25: శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్మన్ కుశాల్ పెరీరా (25) డోపింగ్ పరీక్షలో అడ్డంగా దొరికిపోయాడు. అతను నిషిద్ధ ఉత్ప్రేరకాలను ఉపయోగించినట్లు శాంపిల్-బి పరీక్షలో తేలింది. దీంతో పెరీరాపై నాలుగు సంవత్సరాలు నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తెలియజేసిందని శ్రీలంక క్రీడా శాఖ మంత్రి దయసిరి జయశేఖర శుక్రవారం వెల్లడించాడు.
కరాచి, డిసెంబర్ 25: కళంకిత ఫాస్ట్బౌలర్ ముహమ్మద్ ఆమీర్ ఉన్న లాహోర్ జాతీయ శిక్షణా శిబిరానికి హాజరయ్యేది లేదని తెగేసి చెప్తున్న సీనియర్ ఆటగాళ్లు మహమ్మద్ హఫీజ్, అజర్ అలీలతో మాట్లాడడం ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ప్రయత్నించాడు.
మెల్బోర్న్, డిసెంబర్ 25: మెల్బోర్న్లో వెస్టిండీస్తో జరిగే బాక్సింగ్డే (26వతేదీ) నుంచి జరగనున్న రెండో టెస్టుకు ఉస్మాన్ ఖావాజా తిరిగి జట్టులోకి రావడం కోసం ఆస్ట్రేలియా సెలెక్టర్లు షాన్ మార్ష్ను జట్టులోంచి తొలగించారు. హోబర్ట్లో వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో మార్ష్ టెస్ట్మ్యాచ్లలో తన అత్యధిక స్కోరు అయిన 182 పరుగులను సాధించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: మెక్సికో ఓపెన్ టోర్నమెంట్లో గ్రాండ్ప్రీ టైటిల్ సాధించి మంచి జోరుమీద ఉన్న భారత జోడీ మను అత్రి, బి.సుమిత్ రెడ్డి ప్రపంచ ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్టు ర్యాంకును సాధించారు.
వెల్లింగ్టన్, డిసెంబర్ 25: న్యూజిలాండ్లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న లీడింగ్ బౌలర్ లసిత్ మలింగ కివీస్తో తొలి రెండు అంతర్జాతీయ వనే్డ మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇటీవల శ్రీలంకలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు పర్యటన సందర్భంగా మలింగ మోకాలికి తీవ్ర గాయమైంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఎలాంటి లోపాలు లేవని స్పష్టమైన త ర్వాతే అంపైర్స్ డిసిషన్ రివ్యూ సిస్టం (డిఆర్ఎస్)ను అమలు చేస్తామ ని అప్పటి వరకూ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తామని భారత క్రికెట్ ని యంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్పష్టం చే శాడు. గురువారం అతను పిటిఐతో మాట్లాడుతూ ప్రస్తుత డిఆర్ఎస్ లో కొన్ని లోపాలు ఉన్న విషయాన్ని భారత్ చాలాకాలంగా చెప్తునే ఉందని అన్నాడు.
సెయింట్ జాన్స్, డిసెంబర్ 24: భారత్తో గత ఏడాది అత్యంత వివాదాస్పదంగా ముగిసిన సిరీస్ను పునరుద్ధరించుకునే ప్రయత్నంలో పడింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి). గత ఏడాది భారత్ పర్యటనకు వచ్చిన విండీస్ క్రికెటర్లు పూర్తి సిరీస్ ఆడకుండానే వెనుదిరిగారు.
పాక్తో క్రికెట్ సిరీస్పై బిసిసిఐ దొంగాట!