-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
జమ్మూ, మార్చి 26: పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ శనివారం కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాతో సమావేశమై రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. తర్వాత ఆమె కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు మద్దతు తెలియజేసినందుకు బిజెపికి కృతజ్ఞతలు తెలియజేశారు. జమ్మూ, కాశ్మీర్లో శాంతి, సమన్వయం, అభివృద్ధే తమ కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతగా ఉంటుందని చెప్పారు.
న్యూఢిల్లీ, మార్చి 26: ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు బడా పారిశ్రామికవేత్తలుగా ఎదగడం కోసం ప్రభుత్వం త్వరలోనే స్టాండప్ ఇండియా అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా బిజ్బెహరా పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం సాయుధ జవాన్లపై మిలిటెంట్లు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లతో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. దాడి చేసిన మిలిటెంట్లు వెంటనే పరారయ్యారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పాట్నా: బిహార్లోని ముజఫర్నగర్ జిల్లాలో శనివారం తెల్లవారు జామున మావోయిస్టులు ఓ నిర్మాణ సంస్థకు చెందిన వాహనాలను, యంత్ర పరికరాలను దగ్ధం చేశారు. ముజఫర్నగర్ జంక్షన్ సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ రైల్వేలైన్ డబ్లింగ్ పనులను కొంతకాలంగా చేపడుతోంది. సుమారు 60 మంది మావోలు తెల్లవారు జామున అక్కడికి వచ్చి 14 వాహనాలకు, ఇతర పరికరాలకు నిప్పు పెట్టారు.
న్యూఢిల్లీ, మార్చి 25: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిణామాలపై తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్టప్రతిని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కలిసి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం రాష్టప్రతి భవన్లో ప్రణబ్ ముఖర్జీతో ఆయన భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ, మార్చి 25: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఇప్పటికీ ఘర్షణ వైఖరినే అనుసరిస్తోందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆరోపించింది. అంతేకాదు, ప్రభు త్వం ప్రతిపక్షాలకు చేరువయ్యే విషయంలో ఇంక చాలా దూరంలోనే ఉందని వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ ట్విట్టర్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఫాలో అవుతుండడం ఓ మంచి పరిణామమన్న వాదనలను కూడా ఆ పార్టీ కొట్టి పారేసింది.
గౌహతి, మార్చి 25: అస్సాంలో తాము అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్తో ఉన్న సరిహద్దులను శాశ్వతంగా మూసేసి శరణార్థుల రాకను అరికడతామని బిజెపి తన ఎన్నికల పత్రంలో స్పష్టం చేసింది. అలాగే ఈ అక్రమ వలసదారులకు ఉపాధి కల్పిస్తున్న వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
లాల్గఢ్ (పశ్చిమబెంగాల్), మార్చి 25: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఎన్నికల కమిషన్కు భయపడాల్సిన అవసరం లేదని పరోక్షంగా పార్టీ యంత్రాంగానికి సూచించారు. ప్రజల మద్దతుతో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పనిచేయాలని ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘కొంతమంది బయటి నుంచి వచ్చి మిమ్మల్ని భయపెడితే, మీరు భయపడొద్దు. మూడు రోజుల తరువాత వారు తిరిగి వెళ్లిపోతారు.
న్యూఢిల్లీ, మార్చి 25: బెయిలు మంజూ రు చేయడానికి ఒకే రకమైన నిబంధనలు ఉండాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై జడ్జీలకు ఎలాంటి మార్గదర్శకాలు అవసరం లేదని, అయితే పేదలు ఇబ్బంది పడకుండా ఉండేలా చూ డడం కోసం అవసరమైన మార్గాలను సిఫార్సు చేస్తామని లా కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ బిఎస్ చౌహాన్ చెప్పారు.
న్యూఢిల్లీ, మార్చి 25: అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకుల జాబితాలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్కు స్థానం లభించింది. అమెజాన్ సిఈఓ జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచిన ఈ జాబితాలో భారత్నుంచి స్థానం పొందిన ఏకైక వ్యక్తి కేజ్రివాల్ కావడం గమనార్హం.