S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/02/2018 - 22:52

సత్తెనపల్లి, ఆగస్టు 2: సత్తెనపల్లి పట్టణంలోని చెంచుకాలనీ సమీపంలోని ఇంట్లో గురువారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు స్థానిక అచ్చంపేట రోడ్డులోగల చెంచుకాలనీకి సమీపంలోని పోలేరమ్మగుడి బజారులో నివాసముంటున్న నూర్‌బాషా ఇమాంబీ (36) దారుణహత్యకు గురైంది. 20 సంత్సరాల క్రితం తెనాలికి చెందిన కాలేషావలితో వివాహం అయింది. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

08/02/2018 - 22:51

సత్తెపల్లి, ఆగస్టు 2: స్థానిక రంగాకాలనీలో నివాసముంటున్న తుమ్రుకోట ఆనందకుమార్ (40) తన ఇంటిలో ఎవరూలేని సమయంలో గురువారం ఉరివేసుకొని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు గతంలో గుంటూరులోని ఆర్టీఓ కార్యాలయంలో హోమ్‌గార్డుగా పనిచేశాడు. కొద్దికాలంగా దానిని మానేసి సత్తెనపల్లిలోని కూలిపనులకు వెళుతున్నాడు. భార్య హెల్డా కార్చర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

08/02/2018 - 22:24

పొదిలి, ఆగస్టు 2: హోంగార్డు హత్యకేసులో నిందితురాలిని గురువారం పొదిలి సిఐ ఎం శ్రీనివాసరావు అరెస్టు చేశారు. మర్రిపూడి పోలీసుస్టేషన్‌కు చెందిన హోంగార్డు షేక్ షబ్బీర్ గత రెండేళ్లుగా కొనకనమిట్ల మండలం చౌటపల్లి గ్రామంలో ఒక కోళ్లఫారం పొదిలికి చెందిన షేక్ ఇమాంభీతోకలిసి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇమాంబీతో షబ్బీర్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది.

08/02/2018 - 22:19

సంతమాగులూరు, ఆగస్టు 2 : ఆటోడ్రెవర్ నిర్లక్ష్యానికి ఓ బాలిక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బల్లికురవ మండలం కొప్పెరప్పాడు తండాలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనలో మోరావత్ అమృత (8) అనే బాలిక కన్నుమూసింది. గ్రామంలోని ఇంటింటికి సురక్షిత నీటిని విక్రయించే ఆటో ఒక వీధిలోకి వచ్చింది.

08/02/2018 - 22:00

హిందూపురం టౌన్, ఆగస్టు 2 : మండల కేంద్రంలోని మారుతీనగర్‌లో రెండేళ్ల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన శాంతి కేసులో ఆమె భర్త చిట్టా మల్లికార్జునతోపాటు ఐదుగురిని నిర్దోషులుగా పేర్కొంటూ స్థానిక అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి రామచంద్రమూర్తి గురువారం తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

08/02/2018 - 21:29

జలుమూరు, ఆగస్టు 2: మండలం టెక్కలిపాడు పంచాయతీ పరిథి దుర్గమ్మ గుడి ఎదురుగా సీపీ రోడ్‌కు రోడ్డుపక్కన వున్న వంతెనకు ఢీకొని నరసన్నపేట మండలం జమ్ముపంచాయతీ రావాడపేట గ్రామానికి చెందిన ఇప్పిలి సుదర్శనరావు(35) దుర్మరణం చెందాడు. అదే రాత్రి తిలారు నుండి ఇంటికి వెళ్తుండగా రోడ్డు పక్కనున్న ఖానాకు ఢీకొని పక్కనున్న గోతిలో పడిపోగా ఆయనపై ఆయనబైక్ పడిపోవడంతో మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు.

08/01/2018 - 00:40

గచ్చిబౌలి, జూలై 31: రెండు పడకల ఇండ్ల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను పోలీసుల సహకారంతో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. భారీ బందో బస్తు నడుమ అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడానికి వచ్చిన పోలీసులు ,అధికారులపై ప్రజలు తిరగబడడంతో పాటు కారం పొడి చల్లడంతోపాటు, రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

07/31/2018 - 23:56

అమరచింత, జూలై 31: మండల కేంద్రంలోని బీసీకాలనీలోని నివాసం ఉంటున్న బోయ్య ఆంజనేయులు ఇంటి నుండి ఏపి02టిడి1730 నంబర్ గల డీసీఎంలో తరలిస్తున్న 102క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వేణు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిటి రాజేంధర్ పట్టుకున్నారు.

07/31/2018 - 23:51

సంగారెడ్డి, జూలై 31: ఇంటి ముందు పార్కింగ్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని దుండగులు దహనం చేసిన సంఘటన జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. టౌన్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టణంలోని రాంనగర్‌కు చెందిన జంగం సంగప్ప సదాశివపేట మండల పరిధిలోని ఎంఆర్‌ఎఫ్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

07/31/2018 - 23:49

దేవరకొండ, జూలై 31: దేవరకొండ మున్సిపాల్టీలో సీఐ ఎంజీఎస్ రామకృష్ణ మంగళవారం విచారణ జరిపారు. పట్టణంలోని రెండో వార్డులో ఉర్దూ మీడియం పాఠశాల సమీపంలో జమీరోద్దిన్ అనే వ్యక్తికి 7-65, 7-66, 7-67 నెంబర్‌లు గల ఇళ్ళు ఉన్నాయి. జమీరోద్దిన్ 25 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం హైద్రాబాద్‌కు వెళ్ళి పోయాడు. దీంతో ఈ ఇల్లు పూర్తిగా శిథిలమైపోయింది.

Pages