-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఘట్కేసర్, ఆగస్టు 2:కళాశాల విద్యార్ధుల బలహీనతను అసరాగా చేసుకుని గంజాయిని అమ్ముతున్న ఇద్దరు మహిళలతో పాటు మరో యువకున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్కేసర్ బస్టాండ్ సమీపంలో ఇద్దరు మహిళలు, ఉదయ్ కుమార్ అనే యువకుడు కలిసి కొంత కాలంగా గంజాయిని అమ్ముతున్నట్లు తెలిపారు.
విజయవాడ (క్రైం), ఆగస్టు 2: గంజాయి కేసులో ఇద్దరి నిందితులపై నేరం రుజువుకావడంతో 4మాసాలు జైలుశిక్ష విధిస్తూ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పింది.
విజయవాడ (క్రైం), ఆగస్టు 2: రోడ్డు ప్రమాదానికి కారకుడైన ఆర్టీసీ డ్రైవర్కు 12వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రూ.వెయ్యి జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఉంగుటూరు మండలం ఎలుకపాడుకు చెందిన మొవ్వ ఏస్తేరు రాణి (15) అనే బాలిక 2017 జూన్ 21న సైకిల్పై స్కూలుకు వెళ్తుండగా ఉంగటూరు వైపు వెళ్లే గన్నవరం డిపో బస్సు ఢీకొట్టింది.
నందిపేట, ఆగస్టు 2: నందిపేట మండల కేంద్రంలోని శ్రీ గీత హైస్కూల్లో యూకేజీ చదువుతున్న మహేశ్వరీ అనే 6సంవత్సరాల విద్యార్థిని గురువారం కిడ్నాప్కు గురైంది. బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వనె్నల్(కే) గ్రామానికి చెందిన హరిత, రమేష్ల పెద్ద కుమార్తె అయిన 6సంవత్సరాల వయస్సు గల మహేశ్వరి నందిపేటలోని శ్రీ గీత హైస్కూల్లో చదువుతోంది.
అమరచింత, ఆగస్టు 2: మండలంలోని పాంరెడ్డిపల్లిలో చినిరెడ్డి అనే వ్యక్తి ఇంటిపై బుధవారం అర్ధరాత్రి విజిలెన్స్ అధికారులు దాడి చేసి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 32 క్వింటాల్ రేషన్ బియ్యంను పట్టుకున్నారు. అనంతరం ఇంటికి తాళం వేసి గ్రామంలోని రేషన్ డీలరుకు అప్పగించి వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ అధికారలకు సమాచారం అందించారు.
జోగిపేట, ఆగస్టు 2: అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామంలో బుధవారం రాత్రి విద్యుత్ షాక్ తగిలి సంగాగౌడ్(40), మహమ్మద్ శాన్(16) మృతి చెందారు. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో అనుకోకుండా వీరిద్దరు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.వీరు మృతి చెందిన విషయాన్ని గ్రామస్థులు విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు.
సిద్దిపేట అర్బన్, ఆగస్టు 2: స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు వెళ్లి చెరువులో పడి ప్రమాదవశాత్తు ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సిద్దిపేట పట్టణంలో గురువారం నాడు చోటుచేసుకుంది. సిద్దిపేటలోని కోమటిచెరువు సమీపంలో గల ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడేందుకు స్థానికుడైన మర్కంటి రాజేశ్ (22) వెళ్లాడు. ఈ క్రమంలో బంతి చెరువులో పడిపోయింది. దాన్ని తీసేందుకు లోనికి వెళ్లిన రాజు అందులో మునిగిపోయి మృతిచెందాడు.
దేవరపల్లి, ఆగస్టు 2: విశాఖ నుంచి మహారాష్టక్రు రవాణా అవుతున్న 230 కిలోల గంజాయితోపాటు వాహనాలను దేవరపల్లి సెంటర్లో ఎస్సై పి వాసు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కడియం నుంచి మహారాష్టక్రు పేపరు రవాణా చేయడానికి ఉపయోగించే లారీలో విశాఖ వద్ద 230 కిలోల గంజాయిని 85 బండిళ్లుగా ప్యాక్ చేసి లోడుచేశారు.
నెల్లూరు, ఆగస్టు 2: ట్రావెల్ బస్సుల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 8 మంది ముఠా సభ్యులను నెల్లూరు క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను క్రైం బ్రాంచ్ డిఎస్పీ బాలసుందరరావు గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు..
కావలి టౌన్, ఆగస్టు 2: పట్టణంలోని ఇందిరాగర్లో నివసిస్తున్న పిరిగి భార్గవ్(20) అనే వ్యక్తిని అతని ఇంటిముందే స్నేహితులు మద్యం మత్తులో తలపై బండతోకొట్టి దారుణంగా హత్యచేసిన సంఘటన గురువారం జరిగింది. రెండవ పట్టణ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానగర్లో ఒక వ్యక్తి చనిపోయి ఉండటాన్ని ఆటోడ్రైవర్లు గమనించి సమాచారం అందించటంతో సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే ఆ వ్యక్తి మృతిచెందాడని తెలిపారు.