-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్: ఐదేళ్లు కాదు, పదేళ్లపాటు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గతంలో మాట్లాడిన బిజెపి నేతలు ఇపుడు వౌనం వహించడం తగదని ఎపి మంత్రి పీతల సుజాత అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని తాజాగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్సభలో ప్రకటించడం బాధాకరమన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన బాధ్యత బిజెపి నాయకత్వంపై ఉందన్నారు.
శ్రీకాకుళం: ఎన్ని సవాళ్లున్నా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతులను ఆదుకుంటున్నట్లు ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. ఆయన బుధవారం శ్రీకాకుళం మండలంలో అల్లిచెరువు పనులను పరిశీలించారు. అనంతరం కిల్లిపాలెంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. నీరు-చెట్టు, ఇంకుడుగుంతలు, పంటకుంటల కార్యక్రమానికి గ్రామాల్లో మంచి స్పందన లభిస్తోందన్నారు. నిధులు లేకున్నా రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు.
విశాఖ: బ్రాండిక్స్ కార్మికులకు కనీస వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచాలని వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతుగా ఆయన బుధవారం బ్రాండిక్స్ వద్ద మాట్లాడుతూ, నెలరోజుల్లోగా వేతనాలు పెంచకుంటే తాను నిరవధిక దీక్ష చేస్తానన్నారు. సిఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇక్కడి కార్మికులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు.
విజయవాడ: ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమేనని భావిస్తే కేంద్రం ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, గతంలో పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఈ హామీ నెరవేర్చకుంటే రాబోయే పరిణామాలకు బిజెపి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
విజయవాడ: బిసిల హక్కులను పరిరక్షించేందుకు త్వరలో ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బుధవారం ఇక్కడ తెలిపారు. బిసిలకు ఏభైశాతం రిజర్వేషన్లు కల్పించాలని, లక్ష కోట్లతో కేంద్ర నిధి ఏర్పాటు చేయాలన్నారు. కాపులను బిసి జాబితాలో చేరిస్తే తాము సహించేది లేదన్నారు. బిసిల కోసం పోరాడితే సినీనటుడు పవన్కల్యాణ్కు తాము మద్దతిస్తామన్నారు.
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా 26 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమంది అధికారులకు పదోన్నతులను కల్పించింది. పోలీస్ హెడ్క్వార్టర్స్కు రిపోర్ట్ చేయాల్సిందిగా నవదీప్సింగ్, కోయ ప్రవీణ్, ఎస్ హరికృష్ణ, నవీన్ గులాటి, జెట్టి గోపినాథ్లకు ఆదేశాలు జారీ చేసింది.
బదిలీల వివరాలు:
హోం శాఖ కార్యదర్శి - అనురాధ
గుంటూరు: ఎపికి అన్యాయం జరగని రీతిలో తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టవచ్చని టిడిపి అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆయన బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, రెండు తెలుగురాష్ట్రాల మధ్య నీటి వివాదాలను కేంద్రం పరిష్కరించాలన్నారు. కమీషన్ల కోసమే ఇపుడు తెలంగాణ సర్కారు పాలమూరు పథకానికి జీవోలు జారీ చేస్తోందన్నారు.
కాకినాడ: తుని మండలంలో మంగళవారం రాత్రి భారీగా వీచిన ఈదురుగాలులతో మామిడితోటలకు తీవ్ర నష్టం జరిగింది. అనేక చోట్ల మామిడికాయలు నేలరాలాయి. దీంతో తమకు అనుకోని సమస్యలు ఎదురైనట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు.
శ్రీకాకుళం: ఎపి సిఎం చంద్రబాబు ఒకరోజు పర్యటనకు బుధవారం ఇక్కడికి వచ్చారు. ఇక్కడి కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగే నీరు-ప్రగతి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొంటారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఈరోజు రాత్రి ఇక్కడే బసచేస్తారు. గురువారం ఉదయం ఆయన విజయనగరం జిల్లా పర్యటకు వెళతారు.
గుంటూరు: న్యాయపరమైన వివాదాలతో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్ మంత్రి నారాయం బుధవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. గ్రామాల విలీనంపై కోర్టు కేసులు దాదాపు కొలిక్కివచ్చినందున అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. గుంటూరు కార్పొరేషన్ భవనాన్ని ఆధునీకరిస్తామని తెలిపారు.