S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/04/2016 - 01:35

విజయవాడ, మే 3: మలేసియా, సింగపూర్, జపాన్ వంటి దేశాలకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అతి దగ్గరగా ఉందని, భౌగోళికంగా దేశం మధ్యలో ఉండటం అన్ని వైపులకు రవాణాకు రాష్ట్రం అనుకూలమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, విభజన అనంతరం రాష్ట్రంలోని వనరులను కూడగట్టుకుని అభివృద్ధి కేంద్రంగా పాలనా వ్యవహారాలను వినూత్న పంధాలో ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు.

05/04/2016 - 01:26

విజయవాడ, మే 3: రాష్ట్రంలో ఐఎఎస్, ఐపిఎస్‌లను బదిలీ చేయాలని ప్రభుత్వం దీర్ఘకాలంగా కసరత్తు ఇప్పటికీ ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐఎఎస్, ఐపిఎస్‌లను చంద్రబాబు నియమించారు. ఆ తరువాత ఒకరిద్దరికి స్థానం చలనం కల్పించారు. మిగిలిన వారంతా రెండేళ్ళ నుంచి దాదాపూ అదే పదవుల్లో కొనసాగుతున్నారు.

05/04/2016 - 01:20

కాకినాడ, మే 3: దైవ దర్శనానికై వారణాసి (కాశీయాత్ర) వెళ్ళిన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరానికి చెందిన ఎనిమిదిమంది యాత్రికులపై అగంతకులు హత్యాయత్నానికి ఒడిగట్టారు. దుండగులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఏడుగురి ఆచూకీ గల్లంతయ్యింది. అదృష్టవశాత్తూ ఈ దాడి నుండి ప్రాణాలతో తీవ్ర గాయాలతో బయటపడిన ఓ క్షతగాత్రుడి ద్వారా ఈ దారుణం వెలుగుచూసింది. క్షతగాత్రుడు వారణాశి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు.

05/04/2016 - 01:16

హైదరాబాద్, మే 3: విశాఖపట్నం జిల్లా అడవివరంలో సింహాచలం దేవస్థానానికి చెందిన స్థలం నుంచి ఆక్రమణ దారులు వైదొలగాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. భూ ఆక్రమణ కేసులో ఆ భూమిని ఆక్రమించుకున్న వారు ఆ స్థలాన్ని సొంతం చేసుకోవాలంటే మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని భూ ఆక్రమణల నిరోధక ట్రిబ్యునల్‌కు ఆదేశాలు ఇచ్చే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

05/04/2016 - 01:13

విజయవాడ, మే 3: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం తన నివాసంలో సమావేశమయ్యారు. వైకాపానుంచి భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడాన్ని శిల్పా సోదరులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలం కిందట తులసిరెడ్డిపై జరిగిన దాడిలో భూమావర్గం హస్తం ఉందని శిల్పా వర్గీయులు ఆరోపిస్తూ వస్తున్నారు.

05/03/2016 - 18:06

హైదరాబాద్: తెలంగాణ, రాయలసీమలో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో పండ్లతోటలకు భారీ నష్టం జరిగింది. రంగారెడ్డి జిల్లా తాండూరులో గాలివాన బీభత్సానికి కొంతమేరకు ఆస్తినష్టం జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరులో వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గాలులతో చిరుజల్లులు కురియడంతో ఒక్కసారి వాతావరణం చల్లబడింది.

05/03/2016 - 18:05

విజయవాడ: రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగనందున గతంలో ఎపికి ఇచ్చిన హామీలన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఎపి టిడిపి అధ్యక్షుడు కళావెంకట్రావు అన్నారు. ఈ విషయమై మంగళవారం ఇక్కడ జరిగిన పార్టీ పాలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులపైనా సమావేశంలో చర్చించామని తెలిపారు.

05/03/2016 - 18:04

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టే పాలమూరు, రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టుల వల్ల భవిష్యత్‌లో రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ప్రాజెక్టులను ఆపివేసేలా ఎపి సిఎం చంద్రబాబు గట్టిగా ప్రయత్నించడం లేదన్నారు.

05/03/2016 - 16:43

విజయవాడ: ‘ సేవ్ డమొక్రసీ ’ పేరుతో దిల్లీయాత్ర చేసిన వైకాపా అధినేత జగన్ అక్కడ ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళావెంకట్రావు ప్రశ్నించారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఎపికి ప్రత్యేక హోదాపై దిల్లీలో ఉన్నపుడు జగన్ ఎందుకు మాట్లాడలేదన్నారు. పైసా ఖర్చులేకుండా రాజధాని కోసం 34వేల ఎకరాలను సేకరించగా లక్ష కోట్ల రూపాయల కుంభకోణం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

05/03/2016 - 16:42

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తమ దేశం భాగస్వామి అవుతుందని మలేషియా మంత్రి ముస్త్ఫా మహ్మద్ అన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా మాట్లాడుతూ, ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమేనన్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నందున ఎపిలో పారిశ్రామికీకరణకు దండిగా అవకాశాలున్నాయని చంద్రబాబు అన్నారు.

Pages