S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/04/2016 - 12:30

తిరుపతి: రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరావు బుధవారం ఇక్కడ మీడియాతో అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ఎపికి సమస్యలు తీరతాయని, ఆ దిశగా సిఎం చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు. హోదా ఇవ్వనిపక్షంలో రాష్ట్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదన్నారు.

05/04/2016 - 12:28

గుంటూరు: వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో వచ్చే నెల 27 నుంచి ఉద్యోగులు సేవలందిస్తారని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు. ఆయన బుధవారం ఉదయం సచివాలయ నిర్మాణం పనులను పరిశీలించారు. సచివాలయంలో 3,4 అంతస్థుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు.

05/04/2016 - 08:23

విజయవాడ, మే 2: రాజధాని అమరావతిని నిర్మించే సంస్థను ఖరారు చేసేపనిలో రాష్ట్ర ప్రభుత్వం బిజీ అయింది. అత్యుత్తమ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకూ రాజధాని అమరావతికోసం చేసిన పని అంతా ఒక ఎత్తు, ఇకముందు జరిగేది మరో ఎత్తు అని అన్నారు.

05/04/2016 - 08:09

సింహాచలం, మే 3: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వార్షిక చందనోత్సవాల్లో భాగంగా శ్రీగంధం అరగదీత పనులకు శ్రీకారం చుట్టారు. చైత్ర బహుళ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ గంధం అరగదీత ప్రక్రియ మంగళవారం సంప్రదాయంగా ప్రారంభమైంది.

05/04/2016 - 08:07

చింతూరు, మే 3: దండకారణ్యంలో మావోయిస్టులను అణచివేయడానికి ప్రభుత్వం చేపడుతున్న వైమానిక దాడులకు వ్యతిరేకంగా మావోయిస్టులు 4, 5 తేదీల్లో దండకారణ్య బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మండలంలోని ఏడుగుర్రాలపల్లి, పేగ గ్రామాల నడుమ పలుచోట్ల రహదారులపై కందకాలు తవ్వారు. చెట్లను నరికి రహదారికి అడ్డంగా పడవేశారు.

05/04/2016 - 08:05

విజయవాడ, మే 3: ఆంధ్రప్రదేశ్‌ను సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. దీని కోసం నవోదయం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బుధవారం నవోదయం కార్యక్రమాన్ని తొలిసారిగా చేపడుతున్నామని అన్నారు. సారా రహిత రాష్టమ్రే దీని లక్ష్యమని తెలిపారు.

05/04/2016 - 08:04

నాగార్జున యూనివర్సిటీ, మే 3: రానున్న రోజుల్లో రాష్ట్ర విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వీలుగా అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన వ్యాయామవిద్య రాష్టస్థ్రాయి శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.

05/04/2016 - 01:48

హైదరాబాద్, మే 3: ఆంధ్రప్రదేశ్ టెన్త్ పరీక్ష ఫలితాలు రెండురోజుల్లో విడుదల చేసేందుకు ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. విత్‌హెల్డ్ జాబితా పరిష్కారం కాగానే 5న ఫలితాలు విడుదల చేయనుంది. మరీ జాప్యం జరిగితే మరుసటి రోజు ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీ పరీక్షల బోర్డు అధికారులు తెలిపారు.

05/04/2016 - 01:45

విజయవాడ, మే 3: రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు, నగర పాలక సంస్థలకు ఈ ఏడాది సెప్టెంబర్ తరువాత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇందులోభాగంగా మంగళవారం విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు, మున్సిపల్ మంత్రి నారాయణ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది.

05/04/2016 - 01:41

విజయవాడ, మే 3: కృష్ణ, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్‌లను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆంధ్ర ప్రాంత నాయకులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగింది.

Pages