-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకొవిచ్ టైటిల్ను నిలబెట్టుకోగా, మహిళల సింగిల్స్లో వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్కు చుక్కెదురైంది. విక్టోరియా అజరెన్కా సంచలన విజయాన్ని నమోదు చేసి విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో మిలోస్ రవోనిక్ను సెర్బియా స్టార్ జొకొవిచ్ 6-2, 6-0 తేడాతో చిత్తుచేశాడు.
బెంగళూరు: బంగ్లాదేశ్తో సోమ వారం జరిగిన టి-20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్పై సునాయాసంగా గెలిచే అవకా శం ఉన్నప్పటికీ తడబడి, వికెట్లు చేజార్చుకున్న ఆస్ట్రేలియా చివరికి 3 వికెట్ల తేడాతో విజ యం సాధించింది. 157 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ అందుకుంది.
మొహాలీ: టి-20 వరల్డ్ కప్లో రేసులోనే ఉండడమేగాక, భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాభవంతో స్వదేశంలో పెల్లుబుకుతున్న అభిమానుల ఆగ్రహం నుంచి బయటపడేందుకు కూడా మంగళవారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ తలపడనుంది. ‘అండర్ డాగ్’ ముద్రతో బరిలోకి దిగినప్పటికీ ఈ టోర్నీలో న్యూజిలాండ్ అసాధారణ ఫామ్ను కొనసాగిస్తున్నది. పటిష్టమైన భారత్ను ఓడించి సంచలనం సృష్టించింది.
ఇండియన్ వెల్స్ (అమెరికా): మహిళలంటే గౌరవం లేదా? అంత చులకనగా చూస్తారా? అంటూ ఇండియన్ వెల్స్ పిఎన్బి పరిబాస్ టెన్నిస్ టోర్నమెంట్ డైరెక్టర్ రేమండ్ మూర్పై ప్రపంచ నంబర్వన్ సెరెనా విలియమ్స్ మండిపడింది. అతని వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నది. మహిళల టెన్నిస్ మొత్తం పురుషుల విభాగంపై ఆధారపడి ముందుకు వెళుతున్నదని మూర్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు.
కోల్కతా: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్వహించే వనే్డ, టి-20 ప్రపంచ కప్ చాంపియన్షిప్ పోటీల్లో పాకిస్తాన్తో ఇప్పటి వరకూ 11 మ్యాచ్లు ఆడిన టీమిండియా అన్నింటిలోనూ విజయభేరి మోగించింది. ఇలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నప్పటికీ, వీటి వల్ల ఒత్తిడి మరింతగా పెరుగుతుందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు.
ఇండియన్ వెల్స్: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకొవిచ్ ఇండియన్ వెల్స్ పిఎన్బి పరిబాస్ పురుషుల సింగిల్స్లో టైటిల్ నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకేశాడు. సెమీ ఫైనల్లో అతను చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ను 7-6, 6-2 తేడాతో ఓడించి ఫైనల్ చేరాడు. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ దాదాపుగా ఏకపక్షంగా సాగింది.
బసెల్: భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ ఇక్కడ జరిగిన స్విస్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. సెమీ ఫైనల్స్లో థాయిలాండ్కు చెందిన తనొంగ్సక్ సయేసొంబూన్సక్ను 21-18, 22-24, 21-9 తేడాతో ఓడించిన అతను ఆదివారం నాటి ఫైనల్లో మార్క్ విబ్లెర్పై వరుస సెట్లలో విజయభేరి మోగించడం విశేషం.
న్యూఢిల్లీ: టి-20 వరల్డ్ కప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించడంలో ప్రధాన భూమిక పోషించిన భారత స్టార్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లతోపాటు ఎంతో మంది ప్రముఖులు, అభిమానులను అతనిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పాకిస్తాన్తో మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో, కోహ్లీ 55 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు.
కరాచీ: టి-20 వరల్డ్ కప్లో భాగంగా శనివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై స్థానిక మీడియా విరుచుకుపడింది. పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. సరైన వ్యూహం లేకనే ఓడిందంటూ, దీనికి కోచ్ వకార్ యూనిస్, కెప్టెన్ షహీద్ అఫ్రిదీ బాధ్యత వహించాలని ‘ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక విమర్శించింది.