S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గోకుల్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి సినిమా, డ్రీమ్ వారియర్స్ పతాకాలపై పెరల్ వి.పొట్లూరి, పరం వి.పొట్లూరి, కెవిన్ అనె్న, ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘కాష్మోరా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ను, ఆడియోను వచ్చే నెల 7న విడుదల చేయనున్నారు.
‘సాధారణంగా లవ్ ఫెయిల్యూర్స్ చాలామందికి ఉంటాయి. అయితే కొంతమంది మాత్రమే ఆ లవ్ ఫెయిల్యూర్స్ను దాటి వారి ప్రేమను సక్సెస్ చేసుకుంటారు’ అని అంటున్నాడు దర్శకుడు విరించి వర్మ. ‘ఉయ్యాల జంపాల’తో దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న విరించి చేస్తున్న రెండో చిత్రమిది. నాని హీరోగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘మజ్ను’.
తెలుగులో విజయవంతమైనట్లుగానే తమిళంలో కూడా ఎప్పుడెప్పుడు నటిద్దామా అని ఎదురుచూస్తున్న రాశీకి మంచి అవకాశమే దొరికింది. అదనుచూసి హిట్ చిత్రంతో కోలీవుడ్ను ఏలాలనుకున్న ఆమెకు కాస్త ఆలస్యమైనా మంచి అవకాశం దొరికిందని ఆనందపడుతోంది. సిద్ధార్థ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘సైతాన్ కా బచ్చా’ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది.
అశోక్చంద్ర, రాజా సూర్యవంశి, తేజారెడ్డి, కారుణ్య ప్రధాన తారాగణంగా శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై టి.కరణ్రాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘ఇదో ప్రేమలోకం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ- ఇదో అందమైన ప్రేమకథ అని, ప్రియుడికిచ్చిన మాటకోసం తన వాళ్ళను వదులుకుని ఓ మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే ఓ మహిళ కథనం ప్రధానంగా సాగుతుందని తెలిపారు.
చిరంజీవి 151వ సినిమా దాదాపుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వుండబోతోందని టాలీవుడ్ భోగట్టా. రెండు మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి ఈ విషయాన్ని ఖరారు చేస్తున్నారు. బోయపాటి శ్రీను చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చడంతో ఈ సినిమాను అల్లు అరవింద్ రూపొందించనున్నారని సమాచారం. అడ్వాన్స్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఇదే సమయంలో పవన్కళ్యాణ్ సినిమాకు బోయపాటి శ్రీను గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు.
నూతన నటీనటులు శరత్కళ్యాణ్, హనీగుప్తా, మోహన్ వత్స, ఉపాసన ప్రధాన తారాగణంగా జె.వి.ఆర్ సినిమాస్, వైష్ణవి ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై శ్రీనివాస్ నేదునూరి దర్శకత్వంలో జె.వి.ఆర్, దేశ్ముఖీరాజూ యాదవ్, శ్రీనివాస్ నేదునూరి సంయుక్తంగా రూపొందిస్తున్న ‘ఏమి సోదరా.. మనసుకేమయిందిరా’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది.
పరిశ్రమకు వచ్చి దాదాపు పది సంవత్సరాలు దాటిపోయింది. అయినాకనీ కాజల్ గ్లామర్లో ఏ మాత్రం మార్పు రాలేదు. పెద్ద హీరోలతోపాటుగా చిన్న హీరోల చిత్రాల్లో నటిస్తూ తన హవా చాటుతోంది. తాజాగా ఎన్టీఆర్తో ఐటెం పాటలో కూడా నర్తించి శభాష్ అనిపించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాల్షీట్లు దొరకని తారగా రికార్డు సృష్టించింది.
అందమైన, అపురూపమైన జంటగా పేరుపొంది.. ‘బ్రాంజిలోనా’ అన్న ప్రత్యేక పదాన్ని తమ పేరుగా మార్చుకున్న ఏంజిలినా జూలీ, బ్రాడ్పిట్ల వివాహబంధం చెదిరిపోయింది. హాలీవుడ్ నటుడు, భర్త బ్రాడ్పిట్ నుంచి విడాకులు కోరుతూ ఆమె లాస్ఏంజిలిస్లోని ఉన్నత న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. ఈ విషయాన్ని ఏంజిలినా ప్రతినిధి వెల్లడించగా, తాజా పరిణామం తనకు విచారం కలిగించిందని పిట్ పేర్కొనడం గమనార్హం.
హీరో సూర్య కెరీర్లోనే అతి పెద్ద హిట్గా చెప్పుకునే ‘సింగం’ సిరీస్లో మూడవ పార్ట్ ‘సింగం-3’ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త తమిళ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమంటే ఈ చిత్రంలో ఉన్న ఓ స్పెషల్ సాంగ్లో ఒకప్పుడు మంచి సినిమాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న నటి ఒకరు సూర్యతో కలిసి స్టెప్పులు వేయనుందట. ఆమె ఎవరో కాదు.. నీతూ చంద్ర.
కుమారి చిత్రంతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసి హెబా పటేల్ తాజా చిత్రం ఏంజెల్. పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై భువనసాగర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాగ అనే్వష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ పాలకొండలో జరుగుతోంది. సోషియో ఫాంటసిగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 20 రోజులపాటు చిత్రీకరించనున్నారు.