-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
నెల్లూరు, ఏప్రిల్ 13: రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో ఓ విద్యార్థి దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం స్థానిక బీవీ నగర్ రైల్వేగేట్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని నవాబుపేటకు చెందిన చిరుకూరి నాగమనోజ్ కుమార్ ఇంటర్మీడియట్ పూర్తిచేసి నగరంలోని ఓ విద్యాసంస్థలో ఎంసెట్ లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు.
గూడూరు టౌన్, ఏప్రిల్ 13: గృహనిర్మాణ పనుల్లో భాగంగా విద్యుత్ పనులు చేస్తూ తీగలు తగలడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై గూడూరు రూరల్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.
బిట్రగుంట, ఏప్రిల్ 13 : బోగోలు మండలం సుందరగిరివారికండ్రిగ పంచాయతీలో శుక్రవారం సాయంత్రం ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పైడి హజరత్తమ్మ (17) కలిగిరిలో ఇంటర్మీడియట్ చదువుతోంది. గురువారం విడుదలైన పరీక్షల ఫలితాల్లో ఒక సబ్జెక్ట్లో ఫెయిలైంది.
పిఠాపురం, ఏప్రిల్ 13: మృత్యువులోనూ వారి బంధం వీడలేదు. ప్రభుత్వ ఉద్యోగులైన వీరిద్దరూ ముగ్గురు పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో సొంత ఊరు చూసొద్దామని బయలుదేరిన వీరిని మృత్యువు మార్గం మధ్యంలోనే రైలు రూపంలో కబళించింది. పిఠాపురం రైల్వే స్టేషనులో గురువారం అర్థరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో రైలు ఢీకొని భార్యాభర్తలు మృతిచెందారు.
నాతవరం, ఏప్రిల్ 13: నాతవరం గ్రామానికి చెందిన భీమిరెడ్డి లచ్చబాబు(53) గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి పాక కూలి మరణించాడు. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గురువారం సాయంత్రం లచ్చబాబు పొలంలోకి వెళ్ళాడు. ఒక్కసారిగా గాలి,వాన కురియడంతో పశువుల పాకలోకి వెళ్ళాడు. ఈ లోగా గాలి బారీగా వీయడంతో పాకలోని సిమ్మెంట్ స్థంబాల మీదన పడి మృతి చెందాడు.
అనకాపల్లి రూరల్, ఏప్రిల్ 13: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాద్య దైవం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయ రాజగోపుర నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. 1.80కోట్ల వ్యయంతో ఆలయ ప్రధాన ముఖద్వారం ఎదురుగా రాజగోపుర నిర్మాణం జరుగుతుంది. నిర్మాణ పనుల్లో భాగంగా కాంక్రీట్ పనులకు మిక్సర్ను దించుతుండగా సంబంధిత వాహనం నిర్మాణం జరుగుతున్న కాంక్రీట్ పనుల వద్దకు బోల్తాకొట్టింది.
సోమందేపల్లి, ఏప్రిల్ 13 : మండల కేంద్రంలోని స్నేహలతా నగర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (36) శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు ఏ ప్రాంతానికి చెందిన వాడో కూడా ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. నీలం రంగు గళ్ల చొక్కా, బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. వ్యక్తి మృతి చెందిన విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఒంగోలు,ఏప్రిల్ 12: ఒంగోలు నగరంలోని మంగమూరురోడ్డులోని కొత్తడొంకలో గురువారం మధ్యాహ్నం ఆడుకుంటున్న పిల్లపై గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మృతిచెందిన వారిలో గుడిమిట్ల నవదీప్(7), సిందే ప్రేమ్చంద్ (7), కట్టా మణికంఠ (7)లుగా గుర్తించారు. మరో ఐదేళ్ళ సిందే ప్రేమజ్యోతి అనే బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి.
నందివాడ, ఏఫ్రిల్ 12: కృష్ణాజిల్లా నందివాడ మండలంలోని తమిరిశ గ్రామంలో గల 20 ఎకరాల చేపల చెరువులో మేత కడుతుండగా ప్రమాదవశాత్తు పడవ బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటన గురువారం జరిగింది. నందివాడ ఎస్ఐ మణికుమార్ కథనం ప్రకారం తమిరిశ నుండి నందివాడ వెళ్లే రోడ్డులో గల చేపల చెరువులో ఈ ప్రమాదం జరిగింది. గుడివాడ నాగవరప్పాడుకు చెందిన కత్తుల నాగరాజు ఈ చెరువు సాగు చేస్తున్నారు.
పాయకాపురం, ఏప్రిల్ 12: కార్పొరేటర్ పేరు చెప్పి గృహ నిర్మాణాలు చేపడుతున్న వారి దగ్గరకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు కార్పొరేషన్ సిబ్బంది, ఓ పత్రికకు చెందిన వ్యక్తి, మరో యువతిని అజిత్సింగ్నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ నవాబ్జాని నిందితులను ప్రవేశపెట్టారు.