S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/15/2018 - 22:44

గార్లదినె్న, ఏప్రిల్ 15 : మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో ఆదివారం రైలు ఢీకొని చాకలి బాలన్న (68) మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు కల్లూరు గ్రామంలో చాకలి బాలన్న తన కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈనేపథ్యంలో గాడిదలు రైల్వే పట్టాలపై రావడంతో పక్కనకు తోలేందుకు వెళ్లడంతో రైలు ఢీకొంది. దీంతో బాలన్న అక్కడిక్కడే మృతి చెందాడు. అదేవిధంగా రెండు గాడిదలు మృతి చెందాయి.

04/15/2018 - 22:43

ఆత్మకూరు, ఏప్రిల్ 15: మండల పరిధిలోని వేపచర్ల ఎగువతండాకు చెందిన కేశవనాయక్ (42)కి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం కేటాయించిన భూమి టీడీపీ వారు లాగేసుకున్నందుకు వ్యధ చెంది ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వేపచర్ల ఎగువతాండాకు చెందిన కేశవనాయక్‌కు 507.2 సర్వే నెంబర్‌లో 3.21 ఎకరాల భూమి కేటాయించింది.

04/15/2018 - 01:57

మక్తల్, ఏప్రిల్ 14: ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయన్న తీవ్ర మనస్తాపంతో ఓ విద్యార్థిని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మక్తల్ మండలం కర్ని గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే మండల పరిధిలోని కర్ని గ్రామానికి చెందిన నాగేశమ్మ, మల్లేష్‌గౌడ్‌లకు కూతురు మమత. ఆమె జిల్లా కేంద్రంలోని వాగ్ధేయి కళాశాలలో ఇంటర్ ప్రథమంలో ఎంపీసీ చదువుతోంది.

04/15/2018 - 01:47

నార్కట్‌పల్లి, ఏప్రిల్ 14: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదన్న మనస్థానంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొప్పాని తేజ (18) నల్లగొండ ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. పరీక్షల్లో ఉత్తీర్ణత కాకపోవడంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

04/15/2018 - 01:25

నర్సీపట్నం, ఏప్రిల్ 14: గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. పీక తెగకోసి అతికిరాతకంగా హత్య చేసారు. అక్రమ సంబంధం కారణంగా జరిగిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గురైన మహిళ ఎవరనేది తెలియకపోవడంతో ఆధార్ ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి అప్పన్నదొరపాలెం సమీపంలోని జీడి తోటలో శనివారం ఉదయం గుర్తు తెలియన మహిళ మృత దేహం పడి ఉంది.

04/15/2018 - 01:24

నర్సీపట్నం, ఏప్రిల్ 14: పరీక్షా ఫలితాలు మరో విద్యార్థి ప్రాణాలను బలిగొన్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదనే మనస్తాపంతో చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందివస్తాడనుకున్న కొడుకు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

04/15/2018 - 01:02

బనగానపల్లె, ఏప్రిల్ 14:బత్తులూరుపాడు-యనకండ్ల మార్గం మధ్యలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యనకండ్లకు చెందిన సుబ్బరాయుడు(25) దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ రాకేశ్ తెలిపిన వివరాలు.. బనగానపల్లె నుంచి పలుకూరులోని గనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా, అతి వేగంగా నడపడం వల్ల ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకుపోయిందన్నారు.

04/15/2018 - 01:01

డోన్, ఏప్రిల్ 14:ప్యాపిలి మండల పరిధిలోని పోదొడ్డి గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత తొప్పెల రమణ(40) మృతిచెందారు. రమణ ద్విచక్ర వాహనంపై ప్యాపిలి నుంచి పోదొడ్డి గ్రామానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు.

04/15/2018 - 00:58

ఖమ్మం ఖిల్లా, ఏప్రిల్ 14: బోనకల్ మండలంలో మోటమర్రి రైల్వేస్టెషన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి విజయవాడ నుండి వరంగల్ వైపు వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు చొరబడి దోపిడీయత్నం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మోటమర్రి రైల్వేస్టేషన్ దాటుతున్న సమయంలో ఆరుగురు దొంగల ముఠా సభ్యులు రైల్లో ప్రయాణీకులను భయపెట్టి బంగారు ఆభరణాలు దొంగిలించే ప్రయత్నం చేశారు.

04/15/2018 - 00:56

సత్తుపల్లి, ఏప్రిల్ 14: సత్తుపల్లి పట్టణం మసీద్ రోడ్డుకు చెందిన షేక్ మాబూసుభానీ (37) మంగళవారం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామ శివారుల్లో రక్తపు మరకలు కనిపించాయంటూ ఒక అజ్ఞాతవాసి సత్తుపల్లి పోలీసులకు సమాచారం అందించాడు.

Pages